సీఎం కేసీఆర్కు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లేఖ రాశారు. తన ఇంటి వద్ద రెక్కీలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని కేసీఆర్ను కోరారు. సోమవారం తన ఇంటి వద్ద ఆరుగురు రెక్కీ నిర్వహించారని పేర్కొన్నారు. తన భద్రత దృష్ట్యా సీఆర్పీఎఫ్ సిబ్బందిని కేటాయించారని వెల్లడించారు. రెక్కీ నిర్వహించినవారిని పట్టుకునేందుకు ప్రయత్నించారని తెలిపారు. రెక్కీ నిర్వహించినవారిలో ఒకరిని పట్టుకున్నారు.. కానీ రెక్కీ చేసిన వారిలో మిగతా వ్యక్తులు కారులో పారిపోయారన్నారు.
ఏపీ ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్ సుభాన్ అలీబాషా అని చెప్పాడని వెల్లడించారు. ఐడీ కార్డు చూపాలని అడిగితే నిరాకరించాడని పేర్కొన్నారు. ఉన్నతాధికారికి ఫోన్ చేయాలని అడిగినా చేయలేదన్నారు. ఘటనపై గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశామని తెలిపారు. రెక్కీ నిర్వహణకు కారణాలపై విచారణ చేయాలని కోరామని లేఖలో చెప్పారు. రెక్కీలపై గతంలో గచ్చిబౌలి ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు చేశానని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 26న ఇచ్చిన ఫిర్యాదుపై ఇప్పటికీ విచారణ చేయలేదని వివరించారు.
కాగా, సైబరాబాద్ పోలీసు కమిషనర్గా ఉన్న స్టీఫెన్ రవీంద్ర.. తనకు వ్యతిరేకంగా ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కయ్యారని రఘురామ సంచలన ఆరోపణ చేశారు. ఎంపీ కుటుంబ సభ్యులు, సిబ్బంది కానిస్టేబుల్ను కొట్టినందుకు గాను ప్రస్తుతం ఎంపీ సెక్యూరిటీ వింగ్లో ఉన్న ఏఎస్ఐ కె.గంగారామ్ను సీఆర్పీఎఫ్ ఇప్పటికే సస్పెన్షన్లో ఉంచింది. అయితే తనను మట్టుబెట్టేందుకు ఏపీ ప్రభుత్వం కుట్ర పన్నిందని, గతంలో కూడా హైదరాబాద్లోని తన నివాసంలో రెక్కీ నిర్వహించిందని ఎంపీ ఆరోపించారు. దీనికి స్టీఫెన్ రవీంద్ర కూడా సహకరిస్తున్నారన్న అనుమానం ఉందని లేఖలో పేర్కొన్నారు.
ఈ వాస్తవాలకు విరుద్ధంగా, నగర పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర కేసును పలుచన చేయడానికి ప్రయత్నిస్తున్నారని మరియు సిఆర్పిఎఫ్ సిబ్బందిపై కేసులు బుక్ చేయమని పోలీసులను బలవంతం చేశారని ఎంపి పేర్కొన్నారు. గతంలో స్టీఫెన్ రవీంద్రను డిప్యూటేషన్పై ఏపీ పోలీసులు కోరారని, ఇప్పుడు ఏపీ ప్రభుత్వానికి ఆ ఐపీఎస్ అధికారి సాయం చేస్తున్నారని కేసీఆర్ భావించారని గుర్తు చేశారు. తనకు న్యాయం చేయాలని, తనకు, కుటుంబ సభ్యులకు బెదిరింపులకు గురిచేస్తూ తన నివాసంలో రెక్కీ నిర్వహిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రిని కోరారు.
ఇండస్ట్రీ, ప్రేక్షకుల్లో టాపిక్ పాతదే అయినా మరోసారి కొత్త డిబేట్ మొదలయ్యింది. లెనిన్ ప్రమోషన్లలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో నిర్మాత…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో చెన్నై లవ్ స్టోరీ మీద మంచి అంచనాలున్నాయి. దర్శకుడు రవి నంబూరి అయినప్పటికీ, కథ…
సలార్ లో వరదరాజ మన్నార్ గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన మలయాళ హీరో పృథ్విరాజ్ సుకుమారన్ ఆ తర్వాత తెలుగులో…
మొన్న విడుదలైన రావు బహదూర్ సినిమాకు కొందరు విమర్శకుల ప్రశంసలు దక్కాయి. ఫస్ట్ హాఫ్ మరీ నెమ్మదిగా ఉన్నా సెకండాఫ్…
తెలుగులో ఒకప్పుడు చిన్న సినిమాల కథానాయకుడిగా చాలా ఏళ్ల పాటు కెరీర్ను నడిపించాడు శివాజీ. కానీ తర్వాత అతడి మనసు…
ఏపీలో ప్రతిపక్షంగా ఉన్న వైసీపీలో చీలిక రానుందా? ఆ పార్టీ నాయకులు చీలిపోవడమో.. లేక కూటమిలోని ఓ పార్టీలో చేరిపోవడమో…