సోషల్ మీడియా వచ్చాక ఏది నిజమో ఏది అబద్దమో అంత త్వరగా అంతు చిక్కడం లేదు. ఫేస్ బుక్కులు, ట్విట్టర్ లు జనాల స్మార్ట్ ఫోన్స్ లో సింహభాగం ఆక్రమించాక సినిమాలకు సంబంధించిన ప్రతి విషయమూ వైరల్ కావడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు. ఆ మధ్య పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి రిలీజ్ కు ముందు అది ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టి తీశారని నెటిజెన్లు నానా రచ్చ చేస్తే ఏకంగా దాని దర్శకుడు లైన్లోకొచ్చి అవునా నిజమా అంటూ హంగామా చేశారు. విడుదల దాకా ఈ హడావిడి జోరుగానే సాగింది.
కట్ చేస్తే రెండు సినిమాలు చూసిన వాళ్లకు పోలికలు కనిపించిన మాట వాస్తవం. దీన్ని కాసేపు పక్కనపెడితే ఇప్పుడు వారసుడికి ఈ భూతం తగులుకునేలా ఉంది. దిల్ రాజు నిర్మాతగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ మంచి స్వింగ్ లో ఉంది. దీనికి సంబంధించిన స్టోరీ ఇదేనంటూ కొన్ని మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. ఓ బడా బిలియనీర్ చనిపోతే ఎక్కడో రహస్యంగా పెరుగుతున్న వారసుడు తిరిగి వచ్చి తండ్రికి జరిగిన అన్యాయానికి ప్రతీకారం తీర్చుకోవడమే వారసుడు కథగా అందులో పేర్కొన్నారు.
లార్గో వించ్, అజ్ఞాతవాసిలోనూ మెయిన్ పాయింట్ ఇదే. ఇప్పుడా ఆ డైరెక్టర్ జెరోమ్ సల్లే మళ్ళీ రంగంలోకి దిగి అవునా అంటూ రీ ట్వీట్లు చేస్తుండటం అసలు ట్విస్ట్. కేవలం టైటిల్ ని పట్టుకుని ఈ స్టోరీని అల్లారా లేక ఏదైనా లీక్ బయటికి వచ్చిందా అనేది కనీసం ట్రైలర్ వస్తే కానీ చెప్పలేం. రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ ఫ్యామిలీ కం యాక్షన్ ఎంటర్ టైనర్ లో చాలా పెద్ద క్యాస్టింగ్ ఉంది. 2023 సంక్రాంతిని టార్గెట్ చేసుకున్న వారసుడు మీద విక్రమ్ రికార్డులు బ్రేక్ చేయాలన్న ఒత్తిడి ఫ్యాన్స్ నుంచి వస్తోంది
This post was last modified on July 5, 2022 1:58 pm
తండ్రుల వల్ల కానిది పిల్లలు చేసి చూపిస్తే అదో ఆనందం. నాగబాబు ప్రస్తుతం ఈ స్థితిని అనుభవిస్తున్నారు. నిర్మాతగా నాగబాబు…
సీనియర్ నటుడు రాజశేఖర్కు గోలీల ఫ్యాక్టరీ ఉందని.. దాని ద్వారా ప్రతి నెలా కోట్లు సంపాదిస్తున్నాడని సోషల్ మీడియాలో వీడియోలు…
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్దత కల్పించే బిల్లుకు పార్లమెంటు ఉభయ సభలు ఆమోదం తెలిపిన నేపథ్యంలో ఇక రాష్ట్రపతి ఆమోదమే…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నోట నుంచి వచ్చిన మావిగన్ పైనే…
ఒకపక్క ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ మెల్లగా మొదలైపోతున్నాయి. ట్రాకర్స్ ఒక్కొకరుగా రంగంలోకి దిగుతున్నారు. ఏపీ తెలంగాణ డిస్ట్రిబ్యూటర్లు ఏ నిమిషంలో…
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు క్యాంపు కార్యాలయంపై శనివారం దాడి…