బాలీవుడ్లో మాస్, యాక్షన్ సినిమాలకు పేరుబడ్డ అజయ్ దేవగణ్లో ఒక దర్శకుడు ఉన్నాడని చాలామందికి తెలియదు. నటుడిగా 20 ఏళ్లకు పైగా పైగా అనుభవం వచ్చాక ఆయన 2006లో ‘యు మి ఔర్ హమ్’ సినిమా కోసం మెగా ఫోన్ పట్టి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అందులో అజయ్ భార్య కాజోలే కథానాయిక. ఆ సినిమా ఆశించిన ఫలితాన్నివ్వలేదు. మళ్లీ ఇంకో పదేళ్ల తర్వాత ‘శివాయ్’ సినిమా కోసం అజయ్ దర్శకుడిగా మారాడు. ఆ చిత్రంలో యాక్షన్ ఘట్టాలను అక్షయ్ తీర్చిదిద్దిన వైనం, తన ఓవరాల్ టేకింగ్ ఆకట్టుకున్నా బాక్సాఫీస్ దగ్గర మాత్రం మరోసారి నిరాశ తప్పలేదు.
ఇక ఇటీవలే ‘రన్ వే 34’ మరోసారి డైరెక్టర్ అవతారం ఎత్తాడు అజయ్. ఈ చిత్రం మంచి టాక్ తెచ్చుకున్నా బాక్సాఫీస్ దగ్గర అనుకూల పరిస్థితులు లేక సినిమా ఫెయిల్యూర్గా నిలిచింది. కానీ ఓటీటీలో ఈ సినిమాకు చాలా మంచి స్పందన వచ్చింది. దర్శకుడిగా అజయ్ చాలా పరిణతి చెందాడని, అతడిలో మంచి ఫిలిం మేకర్ ఉన్నాడని ఈ సినిమా చాటిచెప్పింది.
‘రన్ వే 34’ దర్శకుడిగా అజయ్లో ఆత్మవిశ్వాసం పెంచడంతో ఈసారి ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా మళ్లీ మెగా ఫోన్ పట్టేశాడు అజయ్. తన దర్శకత్వంలో ‘భోలా’ పేరుతో కొత్త సినిమా తెరకెక్కుతోంది. ఐతే ఇదేమీ అజయ్ సొంత కథతో తెరకెక్కుతున్న స్ట్రెయిట్ మూవీ కాదు. తమిళ, తెలుగు భాషల్లో సూపర్ హిట్టయిన ‘ఖైదీ’నే ఈ పేరుతో రీమేక్ చేస్తున్నాడు అజయ్. ‘ఖైదీ’ రీమేక్లో అజయ్ హీరో అన్నది పాత విషయమే. ముందు ఈ చిత్రం కోసం వేరే దర్శకుడిని ఎంచుకోవాలని అనుకున్నారు. కానీ తర్వాత ఆలోచన మారింది. అజయే దర్శకత్వ బాధ్యతలు చేపట్టాడు.
డైరెక్షన్ మీద పట్టు సంపాదించడం, పైగా ‘ఖైదీ’ లాంటి మంచి విషయం ఉన్న సినిమాను రీమేక్ చేయనుండడంతో అజయ్ కాన్ఫిడెంట్గా రంగంలోకి దిగినట్లు కనిపిస్తోంది. ఈ చిత్రంలో అజయ్ సరసన టబు నటిస్తోంది. నిజానికి ‘ఖైదీ’లో కథానాయిక పాత్రే కనిపించదు. కానీ హిందీలో అజయ్కి జోడీగా టబును తీసుకోవడాన్ని బట్టి స్క్రిప్టులో మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ మొదలుపెట్టుకున్న ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చిలో విడుదల కానుంది.
This post was last modified on July 4, 2022 12:33 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…