Movie News

శీతాకాలమే కాపాడాలి

‘జ్యోతి లక్ష్మి’ తో హీరోగా పరిచయమైన సత్య దేవ్ తీరిక లేకుండా వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ‘బ్లఫ్ మాస్టర్’ తో దక్కిన గుర్తింపు, క్రేజ్ తో ఈ కుర్ర హీరోకి మంచి ఆఫర్స్ లభిస్తున్నాయి. అయితే సరైన హిట్ పడకుండానే ఘాడీ లాగిస్తున్నాడు. తాజాగా వచ్చిన ‘గాడ్సే’ కూడా సత్య దేవ్ కి ఆశించిన విజయం అందించలేకపోయింది. ట్రైలర్ తో ఎట్రాక్ట్ చేసిన ఈ సినిమా మార్నింగ్ షోకి టికెట్లు తెంచలేకపోయింది. దానికి తోడు టాక్ తేడా కొట్టడంతో సినిమా మినిమమ్ కలెక్షన్స్ కూడా అందుకోలేక డిజాస్టర్ అనిపించుకుంది.

నిజానికి సత్యదేవ్ చేస్తున్న ప్రతీ సినిమా నటుడిగా తనకి పేరు తెచ్చిపెడుతుంది. ఇంటెన్స్ యాక్టింగ్ తో మంచి ఫీడ్ బ్యాక్ అందుకుంటున్నాడు. కానీ హిట్ మాత్రం అందుకోలేకపోతున్నాడు. ఇప్పుడు ఈ కుర్ర హీరో ఆశలన్నీ ‘గుర్తుందా శీతాకాలం’ మీదే ఉన్నాయి. కన్నడ లో వచ్చిన ‘లవ్ మాక్ టైల్’ కి రీమేక్ గా తెరకెక్కుతుంది ఈ చిత్రం. ఈ నెలలోనే రిలీజ్ అనుకుంటున్నారు. ఆ మధ్య రిలీజ్ డేట్ ప్రకటించి మళ్ళీ సైలెంట్ అయిపోయారు.

ఈ సినిమాకు తమన్నా స్పెషల్ ఎట్రాక్షన్ గా ఉంది. ఆమె గ్లామర్ తో సినిమా ఓ మోస్తరు కలెక్షన్స్ అందుకునే అవకాశం ఉంది. కానీ బ్యాక్ టు బ్యాక్ యాక్షన్ డ్రామా సినిమాలతో సందేశాలు ఇస్తున్న సత్య దేవ్ ని ఆడియన్స్ రొమాంటిక్ హీరోగా యాక్సెప్ట్ చేస్తారా ? అనేది డౌటే. సత్య దేవ్ హీరోగా ఏ మేరకు మెప్పిస్తాడు అనేది పక్కన పెడితే ఈసారి తమన్నా సపోర్ట్ తో అయినా కచ్చితంగా ఓ హిట్టు మాత్రం కొట్టాల్సిందే. లేదంటే ఈ కుర్ర హీరో కి ఎన్ని సినిమాలు చేసిన మార్కెట్ రాదు. ఇండస్ట్రీలో ఎప్పుడైనా సక్సెస్ మేటర్. హిట్టు లేని హీరోకి ఎంతకాలమని ఆఫర్లు వస్తాయి ?

This post was last modified on July 2, 2022 6:15 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

1 hour ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

1 hour ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

3 hours ago

‘నీట్’ గా పేపర్ అమ్మేశారట!

నీట్ యూజీ పేపర్ లీక్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 22 మంది లక్షల విద్యార్థుల…

3 hours ago

భగీరథ్ కేసు వాదించేది వైసీపీ ఎంపీనే

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే.…

4 hours ago

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

5 hours ago