యాక్షన్ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు గోపీచంద్. యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం.. ఇలా అతడి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ఐతే 2014లో ‘లౌక్యం’తో కెరీర్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నాక గోపీకి సరైన విజయమే లేదు. ‘సీటీమార్’ లాంటి కొన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. గోపీ కోరుకున్న విజయాన్నయితే ఇవ్వలేదు. దీంతో ఈసారి తన శైలికి కొంచెం భిన్నంగా.. కామెడీ-ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఈ తరం దర్శకుడు మారుతితో జట్టు కట్టాడతను.
గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ‘పక్కా కమర్షియల్’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. గోపీ నిరీక్షణ ఈసారి కచ్చితంగా ఫలించేలాగే కనిపిస్తోంది.
మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్తో పాటు.. గోపీ శైలిలో కొంచెం యాక్షన్ కూడా జోడించినట్లున్నారు. హీరోతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా, సత్యరాజ్ల పాత్రలు కూడా ట్రైలర్లో బాగానే ఆకర్షించాయి. యాక్షన్ సంగతి పక్కన పెడితే మారుతి మార్కు ఎంటర్టైన్మెంటే సినిమాకు బలంలా కనిపిస్తోంది. అది వర్కవుట్ అయితే సినిమా హిట్టయినట్లే. ఈసారి రిజల్ట్ తేడా కొడితే చాలా కష్టం కాబట్టి గోపీచంద్ ఉత్కంఠతో ఉండే ఉంటాడు.
ప్రభాస్తో సినిమాకు ముందు హిట్ మారుతికి కూడా చాలా అవసరం. అలాగే ఈ మధ్య కొన్ని సినిమాలు తేడా కొట్టిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వాళ్లు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీళ్లందరి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. దీంతో పాటుగా ఈ వీకెండ్లో మాధవన్ బహుభాషా చిత్రం ‘రాకెట్రీ’ కూడా రిలీజవుతోంది. తెలుగులో చిన్న స్థాయిలోనే ఈ సినిమా రిలీజవుతోంది. మాధవన్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన ఈ బయోపిక్ ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి. దీంతో పాటు షికారు, టెన్త్ క్లాస్ డైరీస్, డబ్బింగ్ మూవీ ఏనుగు కూడా రిలీజవుతున్నాయి. ఐతే వీటికి పెద్దగా బజ్ కనిపించడం లేదు.
This post was last modified on July 1, 2022 9:49 am
వైసీపీ హయాంలో జరిగిన 3500 కోట్ల రూపాయల లిక్కర్ కుంభకోణం కేసు.. అనేక మలుపులు తిరుగుతోంది. తాజాగా వైసీపీ కీలక…
శ్రియా రెడ్డి అంటే తెలుగు ప్రేక్షకుల్లో చాలామందికి ఇప్పటికీ ‘పొగరు’ సినిమాలోని ఈశ్వరి పాత్ర గుర్తొస్తుంది. విశాల్ హీరోగా వచ్చిన…
ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో, అటు ప్రేక్షకుల్లో జరుగుతున్న చర్చ ఎల్లుండి నుంచి ఇరుముడికి కేటాయించిన చాలా థియేటర్లు టాక్సిక్ కు…
ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత ప్రమాదానికి గురయ్యారు. ఆమె ఎగుర వేసిన డ్రోన్.. కొద్ద దూరం పైకి వెళ్లి…
కుళ్లిపోయిన చికెన్ వ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్న వ్యవహారం వెలుగులోకి రావడంతో ప్రజారోగ్యంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో…
బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన ఒక ప్రభుత్వ పాఠశాల ప్రిన్సిపాల్ అభ్యంతరకరంగా వ్యవహరించడం విమర్శలకు తావిచ్చింది. రాజస్థాన్ లోని ఒక ప్రిన్సిపాల్ విద్యార్థినులతో…