యాక్షన్ ఎంటర్టైనర్లతో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు గోపీచంద్. యజ్ఞం, రణం, లక్ష్యం, లౌక్యం.. ఇలా అతడి కెరీర్లో చెప్పుకోదగ్గ హిట్లు ఉన్నాయి. ఐతే 2014లో ‘లౌక్యం’తో కెరీర్లో అతి పెద్ద విజయాన్ని అందుకున్నాక గోపీకి సరైన విజయమే లేదు. ‘సీటీమార్’ లాంటి కొన్ని సినిమాలు ఓ మోస్తరుగా ఆడాయి కానీ.. గోపీ కోరుకున్న విజయాన్నయితే ఇవ్వలేదు. దీంతో ఈసారి తన శైలికి కొంచెం భిన్నంగా.. కామెడీ-ఫ్యామిలీ ఎంటర్టైనర్లకు కేరాఫ్ అడ్రస్గా మారిన ఈ తరం దర్శకుడు మారుతితో జట్టు కట్టాడతను.
గీతా ఆర్ట్స్ లాంటి పేరున్న సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ‘పక్కా కమర్షియల్’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటిదాకా రిలీజైన ప్రోమోలన్నీ ఆకట్టుకున్నాయి. తాజాగా విడుదల చేసిన రిలీజ్ ట్రైలర్ సైతం ఆకట్టుకుంది. గోపీ నిరీక్షణ ఈసారి కచ్చితంగా ఫలించేలాగే కనిపిస్తోంది.
మారుతి మార్కు ఎంటర్టైన్మెంట్తో పాటు.. గోపీ శైలిలో కొంచెం యాక్షన్ కూడా జోడించినట్లున్నారు. హీరోతో పాటు హీరోయిన్ రాశి ఖన్నా, సత్యరాజ్ల పాత్రలు కూడా ట్రైలర్లో బాగానే ఆకర్షించాయి. యాక్షన్ సంగతి పక్కన పెడితే మారుతి మార్కు ఎంటర్టైన్మెంటే సినిమాకు బలంలా కనిపిస్తోంది. అది వర్కవుట్ అయితే సినిమా హిట్టయినట్లే. ఈసారి రిజల్ట్ తేడా కొడితే చాలా కష్టం కాబట్టి గోపీచంద్ ఉత్కంఠతో ఉండే ఉంటాడు.
ప్రభాస్తో సినిమాకు ముందు హిట్ మారుతికి కూడా చాలా అవసరం. అలాగే ఈ మధ్య కొన్ని సినిమాలు తేడా కొట్టిన నేపథ్యంలో గీతా ఆర్ట్స్ వాళ్లు కూడా ఈ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. మరి వీళ్లందరి ఆశ నెరవేరుతుందేమో చూడాలి. దీంతో పాటుగా ఈ వీకెండ్లో మాధవన్ బహుభాషా చిత్రం ‘రాకెట్రీ’ కూడా రిలీజవుతోంది. తెలుగులో చిన్న స్థాయిలోనే ఈ సినిమా రిలీజవుతోంది. మాధవన్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన ఈ బయోపిక్ ఏమేర ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తుందో చూడాలి. దీంతో పాటు షికారు, టెన్త్ క్లాస్ డైరీస్, డబ్బింగ్ మూవీ ఏనుగు కూడా రిలీజవుతున్నాయి. ఐతే వీటికి పెద్దగా బజ్ కనిపించడం లేదు.
This post was last modified on July 1, 2022 9:49 am
సంక్రాంతి వచ్చేసింది.. తోడుగా సందడిని తీసుకువచ్చింది. ఆ సందడికి కోడిపందాల హడావుడి కూడా తోడైంది. ఏటా ఏపీలోని కొన్ని జిల్లాల్లో…
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…