ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు జరుగుతున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాలో అలియా భట్టే హీరోయినన్న ప్రచారం జోరుగా జరిగింది. ఎవరో అనడం కాదు ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్తకు మరింత ప్రాచుర్యం దక్కింది. మంచి జంటను తెరపై చూడొచ్చన్న ఆనందం తారక్ ఫ్యాన్స్ లో సోషల్ మీడియా వేదికగా కనిపించింది. ఇంతలో కేవలం రోజుల వ్యవథిలో అలియా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో యంగ్ టైగర్ టీమ్ కొత్త జోడి కోసం నెలల తరబడి వేట కొనసాగిస్తూనే ఉంది.
ఇదంతా జరగడం వెనుక పెద్ద ట్విస్టే ఉందట. రన్బీర్ కపూర్ తో పెళ్లికి డేట్ ఫిక్స్ కావడానికి ముందే ఇద్దరూ వీలైనంత త్వరగా తల్లితండ్రులు కావాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ కొత్త మూవీకి కమిట్ అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించే సున్నితంగా నో చెప్పేశారు. ఈ కారణాన్ని ఇంకా వివాహం కాకుండానే బయటికి చెప్తే ఫ్యాన్స్ ఊరికే లేనిపోని రచ్చ చేస్తారని గుర్తించి ఆ విషయాన్ని గుట్టుగా ఉంచేశారు. కేవలం నెలల వ్యవధిలో అలియాకు గర్భనిర్ధారణ కావడంతో ఇదంతా నిజమనేపిస్తోంది.
ప్రస్తుతం పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేయడానికి స్పెయిన్ వెళ్లే ఆలోచనలో రన్బీర్ అలియాలు ఉన్నట్టు ముంబై రిపోర్ట్.ఇప్పుడు ఎన్నో నెల అనే విషయం చెప్పడం లేదు కానీ అదేమంత సీరియస్ గా ఆలోచించాల్సిన ఇష్యూ అయితే కాదు. సెప్టెంబర్ లో విడుదల కాబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ ప్రమోషన్లో అలియా పాల్గొనడం మీద అనుమానాలున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో టీమ్ భారీ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంది. తానే తెలుగు వెర్షన్ కి సమర్పకుడు కావడంతో రాజమౌళి స్వయంగా ఆ బాధ్యతలు చూసుకోబోతున్నారు.
This post was last modified on June 30, 2022 5:25 pm
కొందరు ఫిలిం మేకర్స్ తమ సినిమా కథేంటో చివరి వరకు దాచి పెట్టాలని ప్రయత్నిస్తారు. నేరుగా థియేటర్లలో ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలనుకుంటారు.…
ఏపీ సీఎం చంద్రబాబుకు ప్రముఖ దినపత్రిక `ఎకనమిక్ టైమ్స్`.. ప్రతిష్టాత్మక వ్యాపార సంస్కర్త-2025 పురస్కారానికి ఎంపిక చేసిన విషయం తెలిసిందే.…
బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు భారత్కు పెద్ద తలనొప్పిగా మారాయి. 1971 విముక్తి యుద్ధం తర్వాత మన దేశానికి ఇదే…
ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో చెప్పలేం అంటారు. కానీ జపాన్ లో జరిగిన ఈ పెళ్లి చూస్తే టెక్నాలజీ…
ప్రభుత్వం తరఫున ఖర్చుచేసేది ప్రజాధనమని సీఎం చంద్రబాబు తెలిపారు. అందుకే ఖర్చు చేసే ప్రతి రూపాయికీ ఫలితాన్ని ఆశిస్తానని చెప్పారు.…
`వ్యాపార సంస్కర్త-2025` అవార్డును ఏపీ సీఎం చంద్రబాబు కైవసం చేసుకున్నారు. అయితే.. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాలు, 28 మంది ముఖ్యమంత్రులు…