ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లు జరుగుతున్న టైంలో జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ కాంబో సినిమాలో అలియా భట్టే హీరోయినన్న ప్రచారం జోరుగా జరిగింది. ఎవరో అనడం కాదు ఆవిడే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ వార్తకు మరింత ప్రాచుర్యం దక్కింది. మంచి జంటను తెరపై చూడొచ్చన్న ఆనందం తారక్ ఫ్యాన్స్ లో సోషల్ మీడియా వేదికగా కనిపించింది. ఇంతలో కేవలం రోజుల వ్యవథిలో అలియా ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో యంగ్ టైగర్ టీమ్ కొత్త జోడి కోసం నెలల తరబడి వేట కొనసాగిస్తూనే ఉంది.
ఇదంతా జరగడం వెనుక పెద్ద ట్విస్టే ఉందట. రన్బీర్ కపూర్ తో పెళ్లికి డేట్ ఫిక్స్ కావడానికి ముందే ఇద్దరూ వీలైనంత త్వరగా తల్లితండ్రులు కావాలని నిర్ణయించుకున్నారట. ఒకవేళ కొత్త మూవీకి కమిట్ అయితే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని గుర్తించే సున్నితంగా నో చెప్పేశారు. ఈ కారణాన్ని ఇంకా వివాహం కాకుండానే బయటికి చెప్తే ఫ్యాన్స్ ఊరికే లేనిపోని రచ్చ చేస్తారని గుర్తించి ఆ విషయాన్ని గుట్టుగా ఉంచేశారు. కేవలం నెలల వ్యవధిలో అలియాకు గర్భనిర్ధారణ కావడంతో ఇదంతా నిజమనేపిస్తోంది.
ప్రస్తుతం పుట్టబోయే బిడ్డ కోసం షాపింగ్ చేయడానికి స్పెయిన్ వెళ్లే ఆలోచనలో రన్బీర్ అలియాలు ఉన్నట్టు ముంబై రిపోర్ట్.ఇప్పుడు ఎన్నో నెల అనే విషయం చెప్పడం లేదు కానీ అదేమంత సీరియస్ గా ఆలోచించాల్సిన ఇష్యూ అయితే కాదు. సెప్టెంబర్ లో విడుదల కాబోయే బ్రహ్మాస్త్ర పార్ట్ 1 శివ ప్రమోషన్లో అలియా పాల్గొనడం మీద అనుమానాలున్నాయి. ప్యాన్ ఇండియా లెవెల్ లో టీమ్ భారీ పబ్లిసిటీని ప్లాన్ చేసుకుంది. తానే తెలుగు వెర్షన్ కి సమర్పకుడు కావడంతో రాజమౌళి స్వయంగా ఆ బాధ్యతలు చూసుకోబోతున్నారు.
This post was last modified on June 30, 2022 5:25 pm
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…
దేశంలో గత కొంతకాలం నుంచి బీజేపీ హవా నడుస్తోంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో ఆ పార్టీకి ఆశించిన మేర విజయాలు…
సక్సెస్ మాత్రమే మాట్లాడే ఇండస్ట్రీలో కొందరికి అవకాశాలు ఒక సినిమాతో సృష్టించుకున్న బ్రాండ్ వల్ల వస్తాయి. జాతిరత్నాలు దర్శకుడు కెవి…
తమిళనాడు రాజకీయాల్లో చిత్రమైన వైఖరి కనిపిస్తోంది. ఏ పార్టీకి పూర్తిస్థాయి మెజారిటీ దక్కలేదు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే విషయంలో…