యువ కథానాయకుడు రామ్ ఇప్పుడు మంచి ఊపుమీదున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లిన రామ్.. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘రెడ్’తో కూడా ఓ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో అతను చేసిన ‘వారియర్’కు మంచి క్రేజ్ వచ్చింది. దీనికి ప్రి రిలీజ్ బిజినెస్ రామ్ కెరీర్లోనే అత్యధిక స్థాయిలో జరిగింది.
‘వారియర్’ తర్వాత బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్తో అతను ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణకు సిద్ధమవుతూనే కొత్త కథలు వింటున్నాడు రామ్. తాజా సమాచారం ప్రకారం అతను తమిళ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్తో ఓ సినిమా చేసే అవకాశం ఉందట. వీరి మధ్య కథా చర్చలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం.
గౌతమ్ గతంలో విక్టరీ వెంకటేష్తో ‘ఘర్షణ’ చేశాడు. అక్కినేని నాగచైతన్యతో ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలు తీశాడు. ‘ఘర్షణ’ మూవీ తనే తీసిన బ్లాక్బస్టర్ మూవీ ‘కాక్క కాక్క’కు రీమేక్. చైతూతో తీసిన రెండు సినిమాలు.. సమాంతరంగా తమిళంలో శింబు హీరోగా చేసినవే. ఇప్పుడు రామ్తో గౌతమ్ ఒక రీమేక్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తన ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన ఆర్థిక వివాదాల కారణంగా అనుకోకుండా చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్.. కొన్ని నెలల కిందటే శింబు హీరోగా ‘వెందు తనిందదు కాదు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ మూవీని సెప్టెంబరు 15న విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ కథనే తెలుగులో రామ్తో తీయాలని గౌతమ్ భావిస్తున్నాడట. స్క్రిప్టు రెడీగా ఉండడం, ఆల్రెడీ తీసిన సినిమా కావడంతో చాలా వేగంగా లాగించేయాలని గౌతమ్ భావిస్తున్నాడు. రామ్ ఓకే అంటే నిర్మాత దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ కాంబినేషన్లో నిజంగానే సినిమా వస్తుందేమో చూడాలి.
This post was last modified on June 30, 2022 1:00 pm
టీవీకే అధినేత, తమిళనాడు సీఎం విజయ్ తీసుకుంటున్న నిర్ణయాలపై ప్రశంసలు వస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా పాఠశాలలు, దేవాలయాల సమీపంలో…
రాత్రి వేళ గస్తీ కాసేందుకు దేశం కాని దేశం వస్తున్న నేపాలీలు ఇప్పుడు నేరాల్లో ఆరితేరిపోయారని చెప్పాలి. గుర్ఖాలుగా ఎంట్రీ…
చట్టం గెలిచిందనుకున్న ప్రతీసారి పైరసీ కొత్త అవతారం ఎత్తుతోంది. ఐబొమ్మ ఆపరేటర్ రవి అరెస్ట్, సైట్ క్లోజ్ అని పోలీసులు…
ఇప్పుడు ఇండస్ట్రీలో చాలా విషయాల మీద వేడి వేడి చర్చలు జరుగుతున్నాయి. సింగల్ స్క్రీన్లకు పర్సెంటెజ్ ఇవ్వడం, పేరు మోసిన…
అల.. వైకుంఠపురములో.. తర్వాత పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయిందనుకున్న టైమ్లో వరుస డిజాస్టర్లు పూజా కెరీర్ని రివర్స్లో తిప్పేశాయి. రాధేశ్యామ్,…
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…