యువ కథానాయకుడు రామ్ ఇప్పుడు మంచి ఊపుమీదున్నాడు. ‘ఇస్మార్ట్ శంకర్’తో కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి తన ఇమేజ్ను మరో స్థాయికి తీసుకెళ్లిన రామ్.. డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘రెడ్’తో కూడా ఓ విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. దీని తర్వాత తమిళ దర్శకుడు లింగుస్వామితో అతను చేసిన ‘వారియర్’కు మంచి క్రేజ్ వచ్చింది. దీనికి ప్రి రిలీజ్ బిజినెస్ రామ్ కెరీర్లోనే అత్యధిక స్థాయిలో జరిగింది.
‘వారియర్’ తర్వాత బోయపాటి శ్రీను లాంటి స్టార్ డైరెక్టర్తో అతను ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. దాని చిత్రీకరణకు సిద్ధమవుతూనే కొత్త కథలు వింటున్నాడు రామ్. తాజా సమాచారం ప్రకారం అతను తమిళ విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్తో ఓ సినిమా చేసే అవకాశం ఉందట. వీరి మధ్య కథా చర్చలు జోరుగా జరుగుతున్నట్లు సమాచారం.
గౌతమ్ గతంలో విక్టరీ వెంకటేష్తో ‘ఘర్షణ’ చేశాడు. అక్కినేని నాగచైతన్యతో ‘ఏమాయ చేసావె’, ‘సాహసం శ్వాసగా సాగిపో’ సినిమాలు తీశాడు. ‘ఘర్షణ’ మూవీ తనే తీసిన బ్లాక్బస్టర్ మూవీ ‘కాక్క కాక్క’కు రీమేక్. చైతూతో తీసిన రెండు సినిమాలు.. సమాంతరంగా తమిళంలో శింబు హీరోగా చేసినవే. ఇప్పుడు రామ్తో గౌతమ్ ఒక రీమేక్ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది.
తన ప్రొడక్షన్ హౌస్కు సంబంధించిన ఆర్థిక వివాదాల కారణంగా అనుకోకుండా చాలా గ్యాప్ తీసుకున్న గౌతమ్.. కొన్ని నెలల కిందటే శింబు హీరోగా ‘వెందు తనిందదు కాదు’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ఈ యాక్షన్ మూవీని సెప్టెంబరు 15న విడుదల చేయబోతున్నట్లు కూడా ప్రకటించారు. ఈ సినిమా చాలా బాగా వచ్చిందని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. ఈ కథనే తెలుగులో రామ్తో తీయాలని గౌతమ్ భావిస్తున్నాడట. స్క్రిప్టు రెడీగా ఉండడం, ఆల్రెడీ తీసిన సినిమా కావడంతో చాలా వేగంగా లాగించేయాలని గౌతమ్ భావిస్తున్నాడు. రామ్ ఓకే అంటే నిర్మాత దొరకడం పెద్ద కష్టమేమీ కాదు. మరి ఈ కాంబినేషన్లో నిజంగానే సినిమా వస్తుందేమో చూడాలి.
This post was last modified on June 30, 2022 1:00 pm
టాలీవుడ్ కామెడీని కొత్త పుంతలు తొక్కించిన వాళ్ళలో జంధ్యాల, రేలంగి నరసింహరావు, సింగీతం శ్రీనివాసరావు తర్వాత ఈవివి సత్యనారాయణ తనకంటూ…
ఇవ్వాళ సెప్టెంబర్ 2 వ తేదీ. వైయస్ రాజశేఖర రెడ్డి వర్ధంతి. సరిగ్గా 17 ఏళ్ళ క్రితం 2009 సెప్టెంబర్…
తెలంగాణా బీజేపీలో ఓ సెకండ్ హ్యాండ్ కారు రచ్చ రచ్చ చేస్తుంది. క్రమశిక్షణకు మారుపేరుగా చెప్పుకునే కమలం పార్టీని రోడ్డు…
ఏపీ డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఇవాళ అభిమానులు ఎదురు చూసిన కీలక అప్డేట్ ఓజి 2.…
సోలో హీరోగా దుల్కర్ సల్మాన్ టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాతోనూ వంద కోట్లు వసూలు చేయగలడని నిరూపించిన లక్కీ భాస్కర్ కొనసాగింపు…
తమిళనాడులో నాలుగు నెలల క్రితం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన జోసెఫ్ విజయ్ ప్రజానుకూల విధానాలతో ముందుకు సాగుతున్నారు. తమిళనాడులో అనేక…