ఓ స్టార్ డైరెక్టర్ చిన్న సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడంటే దానికి కచ్చితంగా ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. తాజాగా రాజమౌళి లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ ను ప్రమోట్ చేయడంతో ఆడియన్స్ దీని వెనుక రీజన్ ఏమిటా? అనుకుంటున్నారు.
నిజానికి రాజమౌళితో పాటు అతని కుటుంబం అంతా మిగతా సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. రాజమౌళి మాత్రం కొన్ని ఆబ్లికేషణ్స్ మీద కొన్ని సార్లు మీడియా ముందుకొచ్చి లేదా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మిగతా సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా హ్యాపీ బర్త్ డే కోసం జక్కన్న ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్ తీసుకొచ్చాడు.
అయితే రాజమౌళి ఈ చిన్న సినిమాను ప్రమోట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. ఈ సినిమా దర్శకుడు గతంలో ‘మత్తు వదలరా’ అనే సినిమా చేశాడు. అందులో హీరో కీరవాణి కొడుకు సింహా కోడూరు. సింహా ని హీరోగా పరిచయం చేసి రాజమౌళి కుటుంబానికి దర్శకుడు రితేష్ రానా బాగా దగ్గరయ్యాడు.
పైగా ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ. తన కుటుంబం నుండి సింహా ని హీరోగా పరిచయం చేసి ఓ డీసెంట్ హిట్ ఇచ్చిన రితేష్ కి కృతజ్ఞతగా రాజమౌళి అతని రెండో సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడు.
ఎదేమైనా రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు ఓ చిన్న సినిమా మీద చేయి వేసి ప్రమోట్ చేస్తే దానికి అంతో ఇంతో బజ్ వస్తుంది. హ్యాపీ బర్త్ డే కి కచ్చితంగా అది హెల్ప్ అవుతుందనుకోవచ్చు. కానీ జక్కన్న ఇలా తనకి కావాల్సిన, పరిచయం ఉన్న వ్యక్తులకే కాకుండా మంచి టాలెంట్ తో చిన్న సినిమాలు తీసే మిగతా వారిని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on June 29, 2022 9:25 pm
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…