ఓ స్టార్ డైరెక్టర్ చిన్న సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడంటే దానికి కచ్చితంగా ఓ స్ట్రాంగ్ రీజన్ ఉంటుంది. తాజాగా రాజమౌళి లావణ్య త్రిపాఠి ‘హ్యాపీ బర్త్ డే’ ను ప్రమోట్ చేయడంతో ఆడియన్స్ దీని వెనుక రీజన్ ఏమిటా? అనుకుంటున్నారు.
నిజానికి రాజమౌళితో పాటు అతని కుటుంబం అంతా మిగతా సినిమాల ప్రమోషన్స్ కి దూరంగా ఉంటారు. రాజమౌళి మాత్రం కొన్ని ఆబ్లికేషణ్స్ మీద కొన్ని సార్లు మీడియా ముందుకొచ్చి లేదా తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లో మిగతా సినిమాల గురించి పోస్ట్ చేస్తాడు. తాజాగా హ్యాపీ బర్త్ డే కోసం జక్కన్న ట్రైలర్ రిలీజ్ చేసి సినిమా మీద హైప్ తీసుకొచ్చాడు.
అయితే రాజమౌళి ఈ చిన్న సినిమాను ప్రమోట్ చేయడానికి ఓ రీజన్ ఉంది. ఈ సినిమా దర్శకుడు గతంలో ‘మత్తు వదలరా’ అనే సినిమా చేశాడు. అందులో హీరో కీరవాణి కొడుకు సింహా కోడూరు. సింహా ని హీరోగా పరిచయం చేసి రాజమౌళి కుటుంబానికి దర్శకుడు రితేష్ రానా బాగా దగ్గరయ్యాడు.
పైగా ఈ సినిమాకు మ్యూజిక్ ఇచ్చింది కీరవాణి పెద్ద కొడుకు కాల భైరవ. తన కుటుంబం నుండి సింహా ని హీరోగా పరిచయం చేసి ఓ డీసెంట్ హిట్ ఇచ్చిన రితేష్ కి కృతజ్ఞతగా రాజమౌళి అతని రెండో సినిమాను సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తున్నాడు.
ఎదేమైనా రాజమౌళి లాంటి అగ్ర దర్శకుడు ఓ చిన్న సినిమా మీద చేయి వేసి ప్రమోట్ చేస్తే దానికి అంతో ఇంతో బజ్ వస్తుంది. హ్యాపీ బర్త్ డే కి కచ్చితంగా అది హెల్ప్ అవుతుందనుకోవచ్చు. కానీ జక్కన్న ఇలా తనకి కావాల్సిన, పరిచయం ఉన్న వ్యక్తులకే కాకుండా మంచి టాలెంట్ తో చిన్న సినిమాలు తీసే మిగతా వారిని కూడా సపోర్ట్ చేస్తే బాగుంటుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
This post was last modified on June 29, 2022 9:25 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…