చాలామంది నటులకు, దర్శకులకు డ్రీమ్ ప్రాజెక్ట్ అని ఒకటుంటుంది. ముందే ఫలానా సినిమాను డ్రీమ్ ప్రాజెక్ట్ అని భావించేవాళ్లు కొందరైతే.. ఒక సినిమా మొదలయ్యాక కూడా కొందరికది డ్రీమ్ ప్రాజెక్ట్గా మారుతుంటుంది. మాధవన్ కెరీర్లో ‘రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్’ కూడా అలాంటి సినిమానే.
దేశం కోసం ఎంతో చేసి, ఆపై దేశద్రోహిగా ముద్ర వేయించుకుని, అనేక అవమానాలు ఎదుర్కొని, చివరికి కోర్టులో ఎడతెగని పోరాటంతో పులు కడిగిన ముత్యంలా బయటికి వచ్చిన గ్రేట్ సైంటిస్ట్ నంబి నారాయణన్ జీవిత కథ ఆధారంగా మాధవన్ స్వీయ దర్శకత్వం, నిర్మాణంలో తెరకెక్కించిన చిత్రమిది.
ముందు వేరే దర్శకుడితో, నిర్మాతతో మొదలైన ఈ సినిమా.. తర్వాత పూర్తగా మాధవన్ చేతుల్లోకే వచ్చింది. అదే దర్శకత్వం వహించి, సొంతంగా సినిమాను నిర్మించాడు. స్క్రిప్ట్ రీసెర్చ్, ప్రి ప్రొడక్షన్, మేకింగ్, పోస్ట్ ప్రొడక్షన్, పబ్లిసిటీ.. ఇలా అన్ని పనులూ దగ్గరుండి చూసుకోవడం నాలుగేళ్లకు పైగా మాధవన్ ఈ సినిమాకే అంకితం కావాల్సి వచ్చింది.
ఎట్టకేలకు ‘రాకెట్రీ’ జులై 1న బహు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులో కూడా ఈ చిత్రం విడుదలవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్లో ప్రమోషన్లలో పాల్గొన్న మాధవన్.. సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. “ఈ సినిమాలో నంబి నారాయణన్ జీవితాన్ని చూస్తే ఒక భారతీయుడు ఇంత చేశారా అనిపిస్తుంంది. మామూలుగా బయోపిక్స్ తీస్తున్నా సరే.. కమర్షియల్ సక్సెస్ కోసం కొన్ని మసాలా అంశాలను జోడించాల్సి ఉంటుంది. కానీ ఈ సినిమాకు ఆ అవసరమే రాలేదు. నంబి జీవితంలో అంత డ్రామా ఉంది. తెరపై చూపించిందంతా నిజం అని జనాలు నమ్మితే చాలు. మామూలుగా సినిమాల్లో మనం చూసే డ్రామాకు మించి నంబి జీవితంలో ఎన్నో రసవత్తర మలుపులు ఉన్నాయి. ఆ డ్రామాకు కనెక్ట్ అయి సినిమాను హిట్ చేస్తారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇంతకుముందెన్నడూ చూడని సన్నివేశాలు ‘రాకెట్రీ’లో ఉంటాయి. ఈ సినిమా కోసం నేను ప్రోస్థెటిక్ మేకప్ వాడకుండా సహజంగా బరువు పెరిగి, సహజంగానే తగ్గి, నా పలు వరసల్ని కూడా మార్చుకుని నటించా” అని మాధవన్ తెలిపాడు.
This post was last modified on June 29, 2022 3:41 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…