మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాల జాబితాలో ఇంకో ప్రాజెక్టు చేరింది తాజాగా. మారుతి దర్శకత్వంలో తాను ఒక సినిమా చేసే అవకాశాలున్నట్లుగా పక్కా కమర్షియల్ మూవీ ప్రి రిలీజ్ ఈవెంట్లో చిరంజీవి వెల్లడించిన సంగతి తెలిసిందే. ఐతే యువి క్రియేషన్స్ అధినేతల్లో ఒకడైన విక్కీ ఈ ప్రపోజల్ తన ముందు పెట్టగా.. మారుతితో సినిమా చేయడానికి ఓకే చెప్పి ఏర్పాట్లు చేసుకోమని మాత్రమే చెప్పినట్లు చిరు వెల్లడించాడు. అంతకుమించి వివరాలేమీ చెప్పలేదు.
పక్కా కమర్షియల్ ప్రమోషన్లలో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో మారుతి ఈ సినిమా గురించి మాట్లాడాడు. తనతో సినిమా గురించి చిరంజీవి ఇలా ఓ పబ్లిక్ ఈవెంట్లో ప్రకటించడం కంటే ఆనందం ఇంకేముంటుందని మారుతి అన్నాడు. ఇది తన ఆత్మవిశ్వాసాన్ని ఎంతగానో పెంచినట్లు తెలిపాడు.
ఐతే చిరుతో సినిమాకు ఇప్పటిదాకా కథ అంటూ ఏమీ ఓకే కాలేదని.. ఆ ప్రాజెక్టు మీద పూర్తి స్థాయిలో పని చేయడానికి ఇంకా సమయం ఉందని మారుతి అన్నాడు. ఇక ప్రభాస్తో సినిమా చేయడం గురించి తొలిసారిగా అధికారిక ప్రకటన చేశాడు మారుతి. బాహుబలి స్టార్తో తాను సినిమా చేయబోతున్న మాట వాస్తవమే అన్నాడు. ఐతే ఈ సినిమా ఏ జానర్లో తెరకెక్కుతుందని, ఎప్పుడు మొదలవుతుంది అన్నది మారుతి వెల్లడించాడు.
గతంలో మాత్రం ఓ ఇంటర్వ్యూలో డార్లింగ్, బుజ్జిగాడు తరహాలో ప్రభాస్ అభిమానులకు నచ్చే ఎంటర్టైనర్ చేయబోతున్నట్లుగా సంకేతాలు ఇచ్చాడు మారుతి. ప్రభాస్కు హోం బేనర్ అనదగ్గ యువి క్రియేషన్స్లోనే ఈ సినిమా తెరకెక్కనుంది. ఆ బేనర్లో ప్రభాస్.. మిర్చి, సాహో, రాధేశ్యామ్ చిత్రాలలు చేసిన సంగతి తెలిసిందే. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఈ చిత్రం అక్టోబరులో సెట్స్ మీదికి వెళ్లబోతోంది.
This post was last modified on June 27, 2022 9:56 pm
వైసీపీ అధినేత వైఎస్ జగన్ పర్యటనకు వస్తున్నారంటే చాలు.. కర్నూలు జిల్లా ఆలూరులో వ్యాపారులు ముందుగానే తమ దుకాణాలు మూసివేయడం…
ఏపీ అసెంబ్లీ, శాసన మండలి సమావేశాలు సోమవారం(ఆగస్టు 17) నుంచి ప్రారంభం అవుతున్నాయి. అసెంబ్లీకి వైసీపీ నాయకులు ఎలానూ రావడం…
హైదరాబాద్ ఈగల్ పోలీసులకు గంజాయి ముఠా చుక్కలు చూపించింది. పక్కా సమాచారంతో పట్టుకునేందుకు వెళ్లిన ఈగల్ పోలీసులపై తిరగబడిన గంజాయి…
కర్నూలు జైల్లో ఉన్న వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షిని పరామర్శించేందుకు వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కర్నూలులో పర్యటించిన సంగతి…
ఓ ఇంట్లో దొంగతనం చేయడానికి వచ్చిన దొంగ ఆ ఇంట్లో వస్తువులు దొంగిలించడం…ఆకలేయడంతో ఆ ఇంట్లోనే తినేసి నిద్రలోకి జారుకోవడం…తీరా…
పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధినేత సుఖ్బీర్ సింగ్ బాదల్పై హత్యాయత్న ఘటన దేశవ్యాప్తంగా సంచలనం…