గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసిన మారుతి ఆ సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్నాడు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మారుతి. తాజాగా ప్రభాస్ తో తను చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో ఏ తరహా సినిమా చేయబోతున్నారు ? హారర్ జోనర్ అంటున్నారు నిజమేనా ? టైటిల్ అదేనా ? అనే ప్రశ్నలకు సమాధానం చెప్తూ మాట్లాడాడు మారుతి.
ప్రభాస్ సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. సినిమా కూడా వాళ్ళే తీసేస్తారేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు మారుతి. అయితే ప్రభాస్ ని ఎలా చూపించాలో తనకి ఓ క్లారిటీ ఉందని అలాగే చూపించే ప్రయత్నం చేస్తానని అన్నాడు.
నేను ఎలాంటి సినిమా చేయగలనో అందరికీ తెలుసని నా జోనర్ , నా కామెడీ నచ్చే అప్రోచ్ అవుతారని నా మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నాడు. ఇక ఈ విషయంపై ఓ ఉదాహరణ కూడా చెప్పాడు దర్శకుడు. “మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ వంట వండకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు.
మారుతి మాటల్ని బట్టి చూస్తే ప్రభాస్ సినిమా తన మార్క్ లోనే ఉండబోతుందని, కాకపోతే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చని అర్థమవుతుంది. ప్రస్తుతానికి ప్రభాస్ -మారుతి సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు. కొందరు రైటర్స్ తో మారుతి కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఫైనల్ నెరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేసుకోనున్నాడు మారుతి. ఈ ప్రాజెక్ట్ ‘పక్కా కమర్షియల్’ రిజల్ట్ పై కూడా ఆధారపడి ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రాజెక్ట్ ఇంకా డిలే అవ్వడం ఖాయం.
This post was last modified on June 27, 2022 1:27 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…