గోపీచంద్ తో పక్కా కమర్షియల్ సినిమా చేసిన మారుతి ఆ సినిమా రిలీజ్ హడావుడిలో ఉన్నాడు. ప్రస్తుతం సినిమాను ప్రమోట్ చేస్తూ ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు మారుతి. తాజాగా ప్రభాస్ తో తను చేయబోయే సినిమా గురించి క్లారిటీ ఇచ్చాడు. ప్రభాస్ తో ఏ తరహా సినిమా చేయబోతున్నారు ? హారర్ జోనర్ అంటున్నారు నిజమేనా ? టైటిల్ అదేనా ? అనే ప్రశ్నలకు సమాధానం చెప్తూ మాట్లాడాడు మారుతి.
ప్రభాస్ సినిమా ఇలా ఉంటుంది అలా ఉంటుంది అంటూ వాళ్ళే మాట్లాడేసుకుంటున్నారు. సినిమా కూడా వాళ్ళే తీసేస్తారేమో అంటూ వ్యంగ్యంగా కామెంట్ చేశాడు మారుతి. అయితే ప్రభాస్ ని ఎలా చూపించాలో తనకి ఓ క్లారిటీ ఉందని అలాగే చూపించే ప్రయత్నం చేస్తానని అన్నాడు.
నేను ఎలాంటి సినిమా చేయగలనో అందరికీ తెలుసని నా జోనర్ , నా కామెడీ నచ్చే అప్రోచ్ అవుతారని నా మార్క్ లోనే సినిమా చేస్తానని అన్నాడు. ఇక ఈ విషయంపై ఓ ఉదాహరణ కూడా చెప్పాడు దర్శకుడు. “మనం నాటుకోడి బాగా వండుతామని తెలిసి మనల్ని పిలిచినప్పుడు మనకి వచ్చిన వంటే చేసి పెట్టాలి తప్ప మనకి రాని చైనీస్ వంట వండకూడదు” అంటూ చెప్పుకొచ్చాడు.
మారుతి మాటల్ని బట్టి చూస్తే ప్రభాస్ సినిమా తన మార్క్ లోనే ఉండబోతుందని, కాకపోతే ప్రభాస్ ఇమేజ్ కి తగ్గట్టుగా కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయొచ్చని అర్థమవుతుంది. ప్రస్తుతానికి ప్రభాస్ -మారుతి సినిమాకు సంబంధించి స్క్రిప్ట్ ఇంకా లాక్ అవ్వలేదు. కొందరు రైటర్స్ తో మారుతి కథా చర్చలు జరుపుతున్నారు. త్వరలోనే ఫైనల్ నెరేషన్ ఇచ్చి ప్రాజెక్ట్ లాక్ చేసుకోనున్నాడు మారుతి. ఈ ప్రాజెక్ట్ ‘పక్కా కమర్షియల్’ రిజల్ట్ పై కూడా ఆధారపడి ఉంది. ఏ మాత్రం తేడా కొట్టినా ప్రాజెక్ట్ ఇంకా డిలే అవ్వడం ఖాయం.
This post was last modified on June 27, 2022 1:27 pm
ఏపీ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది. వాస్తవానికి ఇప్పటికే చాలా బిల్లులు పెండింగులో ఉండగా..…
అమెరికాను నెంబర్ వన్ చేయాలన్న పేరుతో ఇష్టారాజ్యంగా నిర్ణయాలు తీసుకుంటూ.. ప్రపంచాన్ని ఆగమాగం చేసిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇమేజ్…
‘అమరావతి’ని ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా నిర్ణయిస్తూ ఏపీ అసెంబ్లీ పెట్టిన తీర్మానం మీద ఇటీవలే ఒక టీవీ ఛానెల్లో చర్చా…
కంటెంట్ మీద ఎంత నమ్మకం ఉన్నా ప్రీమియర్ల విషయంలో నిర్మాతలు ఒకటికి పదిసార్లు ఆలోచించే పరిస్థితులు ఇప్పుడున్నాయి. కొన్నిసార్లు ఈ…
జివి ప్రకాష్ కుమార్ మనకూ బాగా సుపరిచితుడైన సంగీత దర్శకుడు. తమిళంలో అయితే రెగ్యులర్ గా హీరోగా కూడా నటిస్తూ…
ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై వైసీపీ అధినేత వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ప్లాన్-బీ’గా మచిలీపట్నం–విజయవాడ–గుంటూరు ప్రాంతాన్ని…