కాలం కలిసొచ్చినపుడు, ఫాంలో ఉన్నపుడు ఏం చేసినా చెల్లుతుంది. ఏం మాట్లాడినా నడుస్తుంది. కానీ దానికి భిన్నమైన పరిస్థితుల్లో ఎంత సైలెంటుగా ఉంటే అంత మంచిది. అందులోనూ మహిళలకు సంబంధించిన సున్నితమైన విషయాల్లో ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తే నడవదు. పరిణామాలు కొంచెం తీవ్రంగానే ఉంటాయి. ఈ విషయంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు కొంచెం లేటుగా అర్థమైనట్లుంది. సాఫ్ట్ టార్గెట్స్ చూసుకుని ట్విట్టర్లో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేయడం వర్మకు అలవాటు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్ సహా మెగా హీరోలను వర్మ అదేపనిగా ఎలా కెలుకుతూ ఉంటాడో అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రపతి అభ్యర్థిగా నిలిపిన ఆదివాసి మహిళా నేత ద్రౌపది ముర్ము గురించి కూడా అవాకులు చవాకులు పేలి సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్నాడు.
ద్రౌపది రాష్ట్రపతి అయితే మరి పాండవులు ఎవరు, కౌరవులు ఎవరు అంటూ వెకిలి వ్యాఖ్యలు చేయడంతో వర్మను నెటిజన్లు గట్టిగా తగులుకొన్నారు. ఇన్నాళ్లు వర్మ ఏం చేసినా చెల్లింది కానీ ఈ వ్యాఖ్యలు మాత్రం వర్మ కు పెద్ద తలనొప్పి తెచ్చేలా కనిపిస్తున్నాయి. అయితే డ్యామేజ్ కంట్రోల్లో భాగంగా ఎన్నడు లేని విధంగా వర్మ తన వ్యాఖ్యలకు వివరణ ఇవ్వడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. కానీ ఆ వివరణ పేలవంగా ఉండటంతో వర్మకు తలనొప్పి తప్పట్లేదు. ఇక లాభం లేదు అని వర్మ ఇంకో మార్గం ఎంచుకున్నాడు.
ద్రౌపదిని తనదైన శైలిలో పొగడడం మొదలుపెట్టాడు. ద్రౌపది రాష్ట్రపతి అయితే కౌరవులు పాండవులు అందరు ఒకటై పోతారని.. ఆమెను ఆరాధిస్తారని వ్యాఖ్యానించాడు. అంతేకాక ద్రౌపది కళ్ళు సూపర్ అని.. ఆమె నవ్వు అద్భుతమని ఫోటోలు పెట్టి సిల్లీ కామెంట్లు చేశాడు. కానీ ఎంత చేసినా ఫలితం లేకపోయింది. నెటిజన్లు కరగలేదు. ఆయనపై మరింతగా అటాక్ చేస్తున్నారు. చేసిన తప్పుకు సారి చెప్పి ఊరుకోకుండా.. ఎందుకీ సాగతీత.. సిల్లీ కామెంట్లు అని వర్మకు గడ్డి పెడుతున్నారు.
This post was last modified on June 26, 2022 9:30 am
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…
కుప్పం.. ఏపీ సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గం. గత 40 సంవత్సరాలుగా ఏక ఛత్రాధిపత్యంగా చంద్రబాబు ఇక్కడ విజయం దక్కించుకుంటున్నారు.…
సంక్రాంతి సినిమాల హడావుడి మరో లెవెల్ కు చేరుకుంది. ఇప్పటికే రాజాసాబ్ థియేటర్లలో సందడి చేస్తుండగా రేపు మెగాస్టార్ చిరంజీవి…
ఒకప్పుడు సౌత్ ఇండియన్ టాప్ హీరోయిన్లలో ఒకరిగా ఒక వెలుగు వెలిగింది సమంత. ఇటు తెలుగులో, అటు తమిళంలో అగ్ర…
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి 19 నెలలు అయిన నేపథ్యంలో, అన్ని వర్గాల ప్రజల సంతృప్తిపై మరోసారి ప్రభుత్వం ఐవీఆర్ఎస్…
ప్రముఖ ప్రకృతి వైద్య నిపుణులు మంతెన సత్యనారాయణ రాజు గారు సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్గా ఉంటూ ఆరోగ్య సూత్రాలు…