ప్రారంభమైన కొత్తలో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆహ ఓటీటీ రాను రాను మంచి ప్రోగ్రామ్స్ డెలివరీ చేసి సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంది. ఇక బాలయ్య తో చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఆహాను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఈ టాక్ షో ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసి ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా చేసింది. అయితే సీజన్ ఎండ్ అయిపోయాక మళ్ళీ ఆ స్థాయి షో ఆహాలో పడలేదు. ఇండియన్ ఐడల్ ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యింది అంతే.
అయితే ఇప్పుడు మళ్ళీ బాలయ్య తో అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు పెట్టె ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే బాలయ్య నుండి మరోసారి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆహా టీం ప్రస్తుతం ఈ షో సీజన్ 2 లో ఎలాంటి గెస్టులను తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. మొదటి ఎప్సిసోడ్ తో బజ్ క్రియేట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి ని మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ , నాగార్జున కూడా ఈ సీజన్ లో కనిపిస్తారని తెలుస్తుంది.
బాలయ్య – నాగార్జున కి అప్పట్లో ఏదో గొడవ జరిగిందని టాక్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ వైజాగ్ లో ఓ ఈవెంట్ లో కలుసుకొని ఆ వార్తలకి చెక్ పెట్టారు. ఇప్పుడు నాగ్ బాలయ్య షో లో కనిపిస్తే ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతుంది. సీజన్ 1 లో బాలయ్య -రవితేజ ల ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చినట్టే ఈ ఎపిసోడ్ లో కూడా అలాంటివి ప్లాన్ చేయబోతున్నారట. ఇక చిరు -బాలయ్య కూడా కొన్నాళ్ళుగా దూరంగా ఉంటున్నారు. పొలిటికల్ వివాదాలతో రెండు కుటుంబాల మధ్య సంబంధం తెగింది. మరి చిరు బాలయ్య షో కి వస్తే ఆ వివాదం ముగుస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి బాలయ్య టాక్ షో సీజన్ 2 మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆహా ఓంకార్ తో ఓ డాన్స్ షో నిర్వహిస్తుంది. దాని తర్వాత బాలయ్య షో మొదలు కానుంది.
This post was last modified on June 22, 2022 11:37 am
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…