ప్రారంభమైన కొత్తలో డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన ఆహ ఓటీటీ రాను రాను మంచి ప్రోగ్రామ్స్ డెలివరీ చేసి సబ్ స్క్రైబర్స్ ను పెంచుకుంది. ఇక బాలయ్య తో చేసిన ‘అన్ స్టాపబుల్’ టాక్ షో ఆహాను ప్రేక్షకులకు బాగా దగ్గర చేసింది. ఈ టాక్ షో ఆడియన్స్ ని బాగా ఎట్రాక్ట్ చేసి ఆహా సబ్ స్క్రిప్షన్ తీసుకునేలా చేసింది. అయితే సీజన్ ఎండ్ అయిపోయాక మళ్ళీ ఆ స్థాయి షో ఆహాలో పడలేదు. ఇండియన్ ఐడల్ ఓ మోస్తరుగా సక్సెస్ అయ్యింది అంతే.
అయితే ఇప్పుడు మళ్ళీ బాలయ్య తో అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలు పెట్టె ప్లాన్ లో ఉన్నారు. ఇప్పటికే బాలయ్య నుండి మరోసారి గ్రీన్ సిగ్నల్ అందుకున్న ఆహా టీం ప్రస్తుతం ఈ షో సీజన్ 2 లో ఎలాంటి గెస్టులను తీసుకురావాలని సన్నాహాలు చేస్తున్నారు. మొదటి ఎప్సిసోడ్ తో బజ్ క్రియేట్ చేసే ప్లానింగ్ లో ఉన్నారు. మెగా స్టార్ చిరంజీవి ని మొదటి ఎపిసోడ్ కి గెస్ట్ గా తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నారు. ఆ తర్వాత వెంకటేష్ , నాగార్జున కూడా ఈ సీజన్ లో కనిపిస్తారని తెలుస్తుంది.
బాలయ్య – నాగార్జున కి అప్పట్లో ఏదో గొడవ జరిగిందని టాక్ స్ప్రెడ్ అయింది. ఆ తర్వాత వీరిద్దరూ వైజాగ్ లో ఓ ఈవెంట్ లో కలుసుకొని ఆ వార్తలకి చెక్ పెట్టారు. ఇప్పుడు నాగ్ బాలయ్య షో లో కనిపిస్తే ఎపిసోడ్ హాట్ టాపిక్ అవుతుంది. సీజన్ 1 లో బాలయ్య -రవితేజ ల ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చినట్టే ఈ ఎపిసోడ్ లో కూడా అలాంటివి ప్లాన్ చేయబోతున్నారట. ఇక చిరు -బాలయ్య కూడా కొన్నాళ్ళుగా దూరంగా ఉంటున్నారు. పొలిటికల్ వివాదాలతో రెండు కుటుంబాల మధ్య సంబంధం తెగింది. మరి చిరు బాలయ్య షో కి వస్తే ఆ వివాదం ముగుస్తుంది. సెప్టెంబర్ లేదా అక్టోబర్ నుండి బాలయ్య టాక్ షో సీజన్ 2 మొదలయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆహా ఓంకార్ తో ఓ డాన్స్ షో నిర్వహిస్తుంది. దాని తర్వాత బాలయ్య షో మొదలు కానుంది.
This post was last modified on June 22, 2022 11:37 am
ఎనిమిదేళ్ల క్రితం 2019లో తెలుగు రాష్ట్రాలను కుదిపేసిన సంఘటన దిశాపై జరిగిన అఘాయిత్యం. ఒక వైద్య విదార్థినిని నలుగురు కరుడు…
వైయస్ కుటుంబంలో ఆస్తి తగాదాలు ఇంకా సమసిపోయినట్లు కనిపించడం లేదు. అన్నా చెల్లెళ్ళ మధ్య దూరం తరిగిన సూచనలు కానరావడం…
ప్యారడైజ్ మీద ఉన్న క్రేజ్ దృష్ట్యా దానికి పోటీగా నిలబడేందుకు పెద్ద సినిమాలు సాహసం చేయడం లేదు. అనుమాన పక్షి…
గజ్వేల్ నియోజకవర్గం.. తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్ కంచుకోట. అయితే.. ఇక్కడే పాగా వేయాలని.. వచ్చే…
తమిళంలో డెబ్యూతోనే సూపర్ హిట్ అందుకున్న సుహాస్ గురించి చెన్నై మండాడి సక్సెస్ మీట్ లో దర్శకుడు చేసిన కామెంట్స్…
అక్టోబర్ 2 ఆదర్శ కుటుంబం ఏకె 47 వస్తుందో లేదో ఖచ్చితంగా చెప్పలేం కానీ సందీప్ కిషన్ సిగ్మా రిలీజవుతోంది.…