ఆర్ఆర్ఆర్ లాంటి విజువల్ గ్రాండియర్లే విడుదలైన యాభై రోజులకు ఓటిటిలో వస్తుంటే ఎనిమిది నెలల క్రితం రిలీజైన ఓ మీడియం బడ్జెట్ మూవీ ఇప్పుడు డిజిటల్ లో రావడమంటే విచిత్రమే. పెళ్లి సందDకి అదే జరిగింది. రాఘవేంద్రరావు పర్యవేక్షణలో గౌరీ రోణంకి దర్శకత్వంలో శ్రీకాంత్ వారసుడు రోషన్, హీరోయిన్ శ్రీలీలని పరిచయం చేస్తూ తీసిన ఈ ఫ్యామిలీ ఆడియన్స్ పెద్ద హిట్టేం కాదు. జరిగిన బిజినెస్ కి థియేటర్లలో డబ్బులు బాగానే వచ్చాయి కానీ చూసిన వాళ్ళెవరూ బ్రహ్మాండంగా ఉందని చెప్పిన దాఖలాలు లేవు.
కట్ చేస్తే చూడనివాళ్ళ సంఖ్య కూడా భారీగానే ఉంది. సరే ఓటిటిలో చూద్దామంటే నెలలు గడుస్తున్నా ఎంతకీ రాలేదు. టీవీ ఛానల్ లోనూ ఊసు లేదు. ముఖ్యంగా కీరవాణి పాటలు, శ్రీలీల గ్లామర్ షోని చిన్న తెరపై ఎంజాయ్ చేద్దామనుకున్న వాళ్ళకు నిరాశే మిగిలింది. ఎట్టకేలకు వాళ్ళ ఎదురు చూపులు ఫలించి ఈ శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇది తెలియడం ఆలస్యం సోషల్ మీడియాలో చెప్పుకోదగ్గ రియాక్షన్లే కనిపించాయి. మాములుగా ఇంత లేట్ ప్రీమియర్ అంటే ఎవరూ పట్టించుకోరు.
దీనికి కారణం ఒకటే. రిలీజ్ టైంలో పెళ్లి సందD టీమ్ అడిగిన రేట్ కి ఓటిటిలు ఒప్పుకోలేదు. దాంతో ఆ చర్చల మధ్య పుణ్యకాలం గడిచిపోయింది. యుట్యూబ్ లో వీడియో సాంగ్స్ మాత్రం హల్చల్ చేశాయి. ఏది ఎలా ఉన్నా దీపముండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలనే టైపులో వేడి ఉండగానే పాలు కాచుకోవాలి. అంతే తప్ప ఇంత జాప్యం చేస్తే సామాన్య ప్రేక్షకుల్లో ఓటిటి ప్రీమియర్ల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది. అన్నట్టు ఈ పెళ్లి సందD ద్వారానే రాఘవేంద్రరావు గారు నటుడిగా తెరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే.
యూపీలోని మహారాజ్గంజ్ జిల్లా నేపాల్ సరిహద్దులో సశస్త్ర సీమా బల్ (ఎస్ఎస్బీ) బలగాలకు ఒక విదేశీయుడు పట్టుబడటం దేశవ్యాప్తంగా కలకలం…
ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏదైనా సినిమా ఫలితాన్ని తేల్చి చెప్పేది బాక్సాఫీస్ వసూళ్లే. అవి ఎంత ఘనంగా వచ్చాయనే దాన్ని బట్టే…
రాజకీయ వ్యూహకర్త నుంచి ప్రత్యక్ష రాజకీయాల్లోకి దిగిన ప్రశాంత్ కిషోర్ (పీకే) ఆస్తుల వివరాలు ఇప్పుడు పాలిటిక్స్ లో హాట్…
తెలుగు సినీ పరిశ్రమలో అతి పెద్ద కుటుంబాల్లో అక్కినేని వారిది ఒకటి. తరతరాలు కూర్చుని తిన్నా తరగనంత ఆస్తి ఉంది.…
టీమిండియా మరో పోరుకు సిద్ధమైంది. ఎడ్జ్బాస్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో ఈరోజు వన్డే సిరీస్ మొదలుకానుంది. వరుస టీ20 సిరీస్…
ఏపీ సీఎం చంద్రబాబు కలల ప్రాజెక్టు.. విజయనగరం జిల్లా భోగాపురంలో నిర్మించిన గ్రీన్ఫీల్డ్ అంతర్జాతీయ విమానాశ్రయానికి కేంద్ర ప్రభుత్వం `ప్రత్యేక`…