Movie News

పరిశ్రమపై బయోపిక్కుల వర్షం

అసలు బయోపిక్కుల మూలాలు ఎక్కడ మొదలయ్యాయో కానీ కథల కొరతతో అల్లాడుతున్న పరిశ్రమకు సెలబ్రిటీల జీవితాలే ఆధారమవుతున్నాయి. ఇప్పటికే చాలా వచ్చాయి. మహానటి, మల్లేశం, ఎంఎస్ ధోని, ఎన్టీఆర్, పాన్ సింగ్ తోమర్, మేరీ కోమ్, అజారుద్దీన్, సచిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. వీటిలో బ్లాక్ బస్టర్లున్నాయి డిజాస్టర్లున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జనానికి ఇవి క్రమంగా బోర్ కొడుతున్న ఉదంతాలే ఎక్కువ. అయినా కూడా రచయితలు దర్శకులు వెనుకాడటం లేదు.

ఇప్పటికిప్పుడు నిర్మాణంలో ఉన్నవి త్వరలో ప్రారంభం కాబోయేవి చూస్తే పదిహేనుకి పైగానే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ కథను శభాష్ మితు పేరుతో వచ్చే నెల విడుదల చేయబోతున్నారు. సౌరవ్ గంగూలీకి సంబంధించిన స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తి చేశారు. బందిపోటు రాణి పూలన్ దేవిని హత్య చేసిన నిందితుడు పంకజ్ సింగ్ పున్దిర్ రియల్ స్టోరీ షేర్ సింగ్ రానాగా వస్తోంది. రియాలిటి కమెడియన్ కపిల్ శర్మ జర్నీని ఫన్కార్ లో చూపించబోతున్నారు.

ప్రముఖ చెఫ్ కం రచయిత్రి తర్ల దలాల్ ని ఆవిడ ఇంటి పేరుతోనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇవి కాకుండా మహాత్మా పూలే, ఉషా మెహతా, సుబ్రతా రాయ్, సితార దేవి, సరోజ్ ఖాన్, రాకేష్ మరియా, ఆదేశ్ శ్రీవాత్సవ, శ్రీకాంత్ బొల్ల, జిఆర్ గోపి నాధ్, కేఫ్ కాఫీ డే అధిపతి విజి సిద్దార్థ తదితర ప్రముఖులను స్క్రీన్ పై చూపించబోతున్నారు. ఇవన్నీ అఫీషియల్ గా లాక్ చేసినవి. ఇంకా చర్చల దశల్లో ఉన్నవి పదికి పైగానే ఉంటాయి. చూస్తుంటే ఈ బయోపిక్కుల ప్రవాహం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.

This post was last modified on June 21, 2022 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రాజా సాబ్ ను లైట్ తీసుకున్న‌ హిందీ ఆడియ‌న్స్

బాహుబ‌లి, బాహుబ‌లి-2 చిత్రాల‌తో దేశ‌వ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్ర‌భాస్. ఇదంతా రాజ‌మౌళి పుణ్యం అంటూ కొంద‌రు…

4 hours ago

వింటేజ్ మెగాస్టార్ బయటికి వచ్చేశారు

చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…

4 hours ago

సంక్రాంతిలో శర్వా సేఫ్ గేమ్

సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…

5 hours ago

‘నదీ తీర ప్రాంతంలో ఉన్న తాడేపల్లి ప్యాలెస్ మునిగిందా?’

వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…

6 hours ago

ఇలాంటి సీక్వెన్స్ ఎలా తీసేశారు సాబ్‌?

మూడేళ్ల‌కు పైగా టైం తీసుకుని, 400 కోట్ల‌కు పైగా బ‌డ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…

7 hours ago

రామ్ దెబ్బ తిన్నాడు… మరి రవితేజ?

హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…

9 hours ago