Movie News

పరిశ్రమపై బయోపిక్కుల వర్షం

అసలు బయోపిక్కుల మూలాలు ఎక్కడ మొదలయ్యాయో కానీ కథల కొరతతో అల్లాడుతున్న పరిశ్రమకు సెలబ్రిటీల జీవితాలే ఆధారమవుతున్నాయి. ఇప్పటికే చాలా వచ్చాయి. మహానటి, మల్లేశం, ఎంఎస్ ధోని, ఎన్టీఆర్, పాన్ సింగ్ తోమర్, మేరీ కోమ్, అజారుద్దీన్, సచిన్ ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు అవుతుంది. వీటిలో బ్లాక్ బస్టర్లున్నాయి డిజాస్టర్లున్నాయి. ఒకరకంగా చెప్పాలంటే జనానికి ఇవి క్రమంగా బోర్ కొడుతున్న ఉదంతాలే ఎక్కువ. అయినా కూడా రచయితలు దర్శకులు వెనుకాడటం లేదు.

ఇప్పటికిప్పుడు నిర్మాణంలో ఉన్నవి త్వరలో ప్రారంభం కాబోయేవి చూస్తే పదిహేనుకి పైగానే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయం. ఇటీవలే రిటైర్మెంట్ తీసుకున్న లేడీ క్రికెటర్ మిథాలీ రాజ్ కథను శభాష్ మితు పేరుతో వచ్చే నెల విడుదల చేయబోతున్నారు. సౌరవ్ గంగూలీకి సంబంధించిన స్క్రిప్ట్ ఆల్రెడీ పూర్తి చేశారు. బందిపోటు రాణి పూలన్ దేవిని హత్య చేసిన నిందితుడు పంకజ్ సింగ్ పున్దిర్ రియల్ స్టోరీ షేర్ సింగ్ రానాగా వస్తోంది. రియాలిటి కమెడియన్ కపిల్ శర్మ జర్నీని ఫన్కార్ లో చూపించబోతున్నారు.

ప్రముఖ చెఫ్ కం రచయిత్రి తర్ల దలాల్ ని ఆవిడ ఇంటి పేరుతోనే వెండితెరపై ఆవిష్కరించబోతున్నారు. ఇవి కాకుండా మహాత్మా పూలే, ఉషా మెహతా, సుబ్రతా రాయ్, సితార దేవి, సరోజ్ ఖాన్, రాకేష్ మరియా, ఆదేశ్ శ్రీవాత్సవ, శ్రీకాంత్ బొల్ల, జిఆర్ గోపి నాధ్, కేఫ్ కాఫీ డే అధిపతి విజి సిద్దార్థ తదితర ప్రముఖులను స్క్రీన్ పై చూపించబోతున్నారు. ఇవన్నీ అఫీషియల్ గా లాక్ చేసినవి. ఇంకా చర్చల దశల్లో ఉన్నవి పదికి పైగానే ఉంటాయి. చూస్తుంటే ఈ బయోపిక్కుల ప్రవాహం ఇప్పట్లో ఆగే సూచనలు కనిపించడం లేదు.

This post was last modified on June 21, 2022 2:54 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

అమరావతి పరీక్ష పాస్ అవ్వాలి జగన్

గ‌త 2024 అసెంబ్లీ ఎన్నిక‌ల్లో వైసీపీ తుడిచి పెట్టుకుని పోవ‌డానికి అనేక కార‌ణాలు ఉన్నాయి. వీటిలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క…

2 hours ago

చాక్లెట్ లుక్‌లో కియారా… సోషల్ మీడియా షేక్

​బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ తన గ్లామర్‌తో మరోసారి ఇంటర్నెట్‌ను షేక్ చేసింది. పెళ్లి, ఆ తర్వాత పాప…

2 hours ago

దేశంలో ఫ‌స్ట్‌.. గుడ్డుతోపాటు చేప‌లు కూడా!

చిన్నారుల‌కు ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో అందించే మ‌ధ్యాహ్న భోజ‌నంలో ఇక నుంచి చేప‌ల కూర కూడా వ‌చ్చించ‌నున్నట్టు తెలంగాణ మంత్రి వాకిటి…

2 hours ago

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు…

3 hours ago

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…

3 hours ago

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

5 hours ago