టాలీవుడ్లో కొందరు ఇమేజ్ లేని హీరోలను స్టార్లుగా.. స్టార్లను సూపర్ స్టార్లుగా చేసిన ఘనత పూరీ జగన్నాథ్కు దక్కుతుంది. ఐతే బయటి హీరోల కెరీర్లకు అంతగా ఉపయోగపడ్డ పూరి.. సొంత కొడుకును మాత్రం హీరోగా నిలబెట్టడంలో ఇప్పటిదాకా విజయవంతం కాలేకపోయాడు. టీనేజీలో ఉండగా ఆంధ్రాపోరి లాంటి సినిమా చేయించడం పెద్ద తప్పిదం అయితే.. అతణ్ని హీరోగా పరిచయం చేస్తూ మెహబూబా లాంటి సాధారణ చిత్రం తీయడం ఇంకో పెద్ద తప్పు.
కొడుక్కి తాను సొంతంగా హిట్టివ్వలేకపోయిన పూరి.. తర్వాత అతణ్ని తన శిష్యుడు అనిల్ పాడూరి చేతికి అప్పగించాడు. పూరి కథతో అనిల్ తీసిన రొమాంటిక్ కూడా నిరాశనే మిగిల్చింది. ఇప్పుడిక ఆకాశ్ ఆశలన్నీ చోర్ బజార్ మీదే ఉన్నాయి. జార్జిరెడ్డి దర్శకుడు జీవన్ రెడ్డి రూపొందించిన చిత్రమిది. దీని టైటిల్, మొదట్లో వచ్చిన ప్రోమోలు ఆసక్తికరంగానే అనిపించాయి.
కానీ తర్వాత సినిమా వార్తల్లో లేకుండా పోయింది. ఇప్పుడు చడీచప్పుడు లేకుండా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. బాక్సాఫీస్ చాలా డల్లుగా ఉన్న టైంలో, సరైన బజ్ లేకుండా రిలీజవుతోంది చోర్ బజార్. దీంతో పోలిస్తే కిరణ్ అబ్బవరం సినిమా సమ్మతమేకే కాస్త బజ్ కనిపిస్తోంది.
ఆకాశ్ చివరి సినిమా రొమాంటిక్ అంతిమంగా ఫ్లాపే అయినప్పటికీ.. అందులోని ఘాటు దృశ్యాలతో పాటలు, ఇతర ప్రోమోలు రిలీజ్ చేయడం.. విడుదల ముంగిట పూరి పనిగట్టుకుని ప్రమోషనల్ కార్యక్రమాలు ప్లాన్ చేయడం, ప్రి రిలీజ్ ఈవెంట్ ఘనంగా చేయడం, సెలబ్రెటీలకు స్పెషల్ షో వేసి కొడుక్కి ఎలివేషన్లు ఇప్పించడంతో బజ్ క్రియేటైంది. ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ చోర్ బజార్ విషయంలో పూరి ఏం పట్టనట్లు ఉంటున్నాడు. చోర్ బజార్ సినిమాకు ఏ పెద్ద పేర్లూ అటాచ్ అయి లేని నేపథ్యంలో కొడుకు సినిమాను పూరీనే ఇలా వదిలేస్తే దానికి ఇంకెక్కడ బజ్ క్రియేటవుతుంది?
ఏపీలోని కూటమి సర్కారు ఇటీవలే నిర్వహించిన మెగా డీఎస్సీపై విపక్ష వైసీపీ బారీ అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే.…
పెద్ది ప్రీమియర్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో, అభిమానుల్లో ఎడతెగని చర్చ జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్ లో క్లారిటీ వచ్చేసింది. రాత్రి 8…
దృశ్యం 3 ప్రపంచవ్యాప్తంగా రెండు వందల కోట్ల గ్రాస్ దాటేసింది. కేవలం పది రోజుల్లోపే ఈ ఫీట్ సాధించడం అనూహ్యం.…
జనసేన అదినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ రాజకీయాలకు కొత్తే. సినిమా నటుడిగా సుదీర్ఘ కాలం పాటు కొనసాగుతున్న…
తెలుగు సినీ చరిత్రలోనే అత్యంత గొప్ప దర్శకుల్లో ఒకరు దాసరి నారాయణరావు. అగ్ర దర్శకుడిగా ఉంటూ 150 సినిమాలు తీయడం…
తెలంగాణ రాజధాని హైదరాబాద్ లోని భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) కార్యాలయం వద్ద శనివారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీఆర్ఎస్…