నక్సలిజం నేపథ్యంలో తెలుగులో చాలా సినిమాలే వచ్చాయి గతంలో. కృష్ణవంశీ ‘సింధూరం’ ఈ బ్యాక్డ్రాప్లో కల్ట్ మూవీగా నిలిచిపోయింది. ఐతే 2000 ముందు వరకు ఈ నేపథ్యంలో ఏ సినిమా వచ్చినా మంచి ఆదరణే ఉండేది. కానీ తర్వాత పరిస్థితులు వేగంగా మారిపోయాయి. నక్సలిజం ప్రభావం అంతకంతకూ తగ్గిపోయి.. ఆ కాన్సెప్టే మరుగున పడిపోయింది. దేశంలో ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో నక్సలిజం ఉంది కానీ.. తెలుగు రాష్ట్రాల వరకైతే ఆ ప్రభావం చాలా తక్కువ. జనాలు ఈ కాన్సెప్ట్తోనే పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయారని చెప్పాలి.ఆ ప్రభావం సినిమాల మీదా పడుతోంది.
ఇప్పుడు సొసైటీలో అసలేమాత్రం చర్చనీయాంశం కాని ఈ కాన్సెప్ట్ మీద సినిమాలు తీస్తుంటే జనాలు ఏమాత్రం నచ్చక తిరస్కరిస్తుండటం గమనార్హం. కొన్ని వారాల కిందటే ‘ఆచార్య’ సినిమా వచ్చింది. అందులో మెగాస్టార్ చిరంజీవి హీరో. ఆయన నక్సలైట్ పాత్రలోనే కనిపించాడు. చరణ్ సైతం కాసేపు ఆ పాత్రలో మెరిశాడు. నక్సలిజం బ్యాక్డ్రాప్లో పెద్ద ఎపిసోడే ఉంటుంది ఈ చిత్రంలో. కానీ జనాలకు అది అస్సలు రుచించలేదు. ఇప్పుడు ‘విరాటపర్వం’ విషయంలోనూ జరిగింది అదే. ‘ఆచార్య’తో పోలిస్తే ఇది మెరుగైన సినిమానే అయినా.. పూర్తగా నక్సల్ బ్యాక్డ్రాప్లో నడిచే ఈ సినిమాతో ఇప్పటి ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోయారు.
ఒకప్పుడైతే నక్సలైట్ల గురించి రోజూ జనాలు పేపర్లు, టీవీల్లో చూసేవారు. వాళ్ల గురించి చర్చించుకునేవారు. నక్సల్స్ ప్రభావం చాలా ప్రాంతాల మీద నేరుగా ఉండేది. కానీ ఇప్పుడు అవేవీ లేకపోవడంతో ఈ తరం యువతకు నక్సలైట్ల విషయంలో ఎమోషనల్ కనెక్షన్ అన్నదే లేదు. అలాంటపుడు వాళ్ల మీద సినిమాలు తీస్తే వాళ్లకెలా రుచిస్తుంది? సామాజికంగా చూసినా.. నక్సలిజం అన్నది ఔట్ డేటెడ్ కాన్సెప్ట్. సినిమాల పరంగా చూసినా అదే భావన ఉంది ఇప్పటి జనాలకు. కాబట్టి టాలీవుడ్ ఇక ఆ కాన్సెప్ట్ పక్కన పెట్టేయడం బెటరేమో.
This post was last modified on June 20, 2022 12:35 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…