కరోనా మహమ్మారి థియేటర్ ఇండస్ట్రీని గట్టి దెబ్బే కొట్టింది కానీ.. అదే సమయంలో ఓటీటీలకు మాత్రం మంచి ఊపు తెచ్చిపెట్టింది. ఒక్కసారిగా ఓటీటీలు పెరిగిపోయాయి. వాటిలో కంటెంట్ కూడా విస్తృతమైంది. ఈ క్రమంలో ప్రాంతీయ భాషల్లో బోలెడన్ని వెబ్ సిరీస్లు తయారవడం మొదలైంది. ఐతే ఆరంభంలో తెలుగులో చాలా వరకు సోసో అనిపించే వెబ్ సిరీస్లే వచ్చాయి.
నెట్ ఫ్లిక్స్, అమేజాన్ ప్రైమ్ లాంటి స్ట్రీమింగ్ జెయింట్స్లో ఉన్న టాప్ క్లాస్ ఒరిజినల్స్ ముందు మన వాళ్లు తీసిన సిరీస్లు చాలా సాధారణంగా అనిపించాయి. కానీ ఈ మధ్య మన ఒరిజినల్స్లోనూ క్వాలిటీ పెరుగుతోంది. ఈ కోవలో వచ్చిన కొత్త సిరీసే.. రెక్కీ. ఈ మధ్య ‘గాలివాటం’తో ప్రేక్షకులను ఆకట్టుకున్న జీ5 సంస్థ.. తాజాగా ఈ సిరీస్ను లాంచ్ చేసింది. విడుదలకు ముందు ప్రచార హడావుడి పెద్దగా లేకపోవడం వల్ల ఇది జనాల్లోకి వెళ్లలేదు కానీ.. ఇప్పుడు చూసిన వాళ్లందరూ దీని గురించి పాజిటివ్గా మాట్లాడుతుండటం ‘రెక్కీ’కి కలిసొస్తోంది.
రాయలసీమ ప్రాంతంలోని తాడిపత్రి (అనంతపురం జల్లా) నేపథ్యంలో నడిచే క్రైమ్ డ్రామా.. రెక్కీ. అక్కడి మున్సిపల్ ఛైర్మన్ను చంపడానికి ఒక గ్యాంగ్ దిగడం.. వాళ్లు రెక్కీ చేసి అతణ్ని మట్టుబెట్టడం.. ప్రధానంగా ఈ నేపథ్యంలో కథ నడుస్తుంది. ఐతే ఈ హత్య వెనుక ఎవరున్నారన్నది పెద్ద ట్విస్ట్. ఆ తర్వాత ఛైర్మన్ కొడుకు కూడా హత్యకు గురి కావడం ఇంకో ట్విస్ట్. ఇలా ఆసక్తికర మలుపులతో ఉత్కంఠ రేకెత్తించేలా సాగుతుంది ఏడు ఎపిసోడ్ల ‘రెక్కీ’. మున్సిపల్ ఛైర్మన్ పాత్రలో తమిళ నటుడు ఆడుగళం నరేన్, అతడి కొడుకు క్యారెక్టర్లో శివబాలాజీ నటించారు. క్యారెక్టర్ నటుడు సమ్మెట గాంధీ.. హత్యకు పథకం రచించే పాత్రలో అదరగొట్టేశాడు.
ఇంకా శ్రీరామ్, ధన్య బాలకృష్ణన్, జీవా, శరణ్య ప్రదీప్ లాంటి పేరున్న తారాగణం ఈ సిరీస్లో నటించింది. కొత్త దర్శకుడు పోలూరు కృష్ణ ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే కథాకథనాలతో ఈ సిరీస్ను తీర్చిదిద్దాడు. అతడికి మంచి భవిష్యత్తు ఉంటుందనడంలో సందేహం లేదు. మన నేటివిటీతో పకడ్బందీ క్రైమ్ సిరీస్ చూడాలనుకునేవాళ్లకు ‘రెక్కీ’ మంచి ఛాయిస్.
This post was last modified on June 20, 2022 8:05 am
ఎలా కనుక్కున్నారో కానీ త్రివిక్రమ్ శ్రీనివాస్ గుంటూరు కారం సినిమాలో కుర్చీ మడతపెట్టి పాట కోసం క్యారెక్టర్ ఆర్టిస్టు పూర్ణతో కొన్ని…
హైదరాబాద్ నగరంలోని రాయదుర్గం భూముల్లో కొంత భాగాన్ని ప్రభుత్వం వేలం వేసింది. అయితే.. మునుపెన్నడూ లేని విధంగా కళ్లు చెదిరే…
హైదరాబాద్లో జరిగిన ఓ వివాహ వేడుకకు వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ హాజరయ్యారు. సీనియర్ ఐపీఎస్ అధికారి…
ప్రతి సంవత్సరం లాగే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానులు హైదరాబాద్ లో ఘనంగా జరుపుకున్నారు. దీనికి మెగా…
వైసీపీ అధినేత జగన్కు సోదరుడి వరుసయ్యే కడప ఎంపీ.. వైఎస్ అవినాష్ రెడ్డి నివాసం నుంచి ఎన్ ఫోర్స్ మెంటు…
‘‘ఏమ్మా నాన్నగారు ఉన్నారా? నాన్న గారు….ఇంట్లో లేరని చెప్పమన్నారండీ….నాన్న గారు లేరని చెప్పమన్నారేంట్రా…చెయ్యి పట్టుకొని ఇక్కడికే తీసుకురాలేకపోయావా…కన్ఫ్యూజన్ లేకుండా……’’అల వైకుంఠపురములో…