టాలీవుడ్ టాప్ స్టార్లలో చాలా జాగ్రత్తగా, ఆచితూచి సినిమాలు చేసేది ఎవరు అంటే అల్లు అర్జున్ పేరే చెప్పాలి. సినిమాల ఎంపికలో, కథలపై జడ్జిమెంట్ విషయంలో తండ్రి అల్లు అరవింద్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకున్న బన్నీ.. అంత ఆషామాషీగా ఏ సినిమానూ ఒప్పుకోడు. అందుకే వేరే స్టార్లతో పోలిస్తే అతడి సక్సెస్ రేట్ ఎక్కువ. అలాగే తన కెరీర్లో డిజాస్టర్లు కూడా తక్కువే.
‘వరుడు’ మాత్రమే అతడి కెరీర్లో పెద్ద మిస్టేక్ అని చెప్పాలి. ‘నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా’ కూడా ఇదే స్థాయిలో డిజాస్టర్ అయినప్పటికీ.. అది చెత్త సినిమా అయితే కాదు. ‘నా పేరు సూర్య’ తర్వాత సినిమాల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాడు బన్నీ. ‘అల వైకుంఠపురములో’తో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టిన అల్లు హీరో.. ‘పుష్ప’తో ఇంకా పెద్ద విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ‘పుష్ప-2’ మీదే అతడి ఫోకస్ మొత్తం నిలిచి ఉంది. ఈ సినిమాకు ముందు ఆరు నెలలకు పైగానే గ్యాప్ వచ్చినా అతను వేరే సినిమా కోసం ప్రయత్నించలేదు.
‘పుష్ప-2’ త్వరలోనే సెట్స్ మీదికి వెళ్లనుండగా.. దీని తర్వాత బన్నీ చేసే సినిమా ఏదనే విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది. దసరాకు బన్నీ కొత్త సినిమా ప్రకటన ఉంటుందని అతడి స్నేహితుడు, నిర్మాత బన్నీ వాసు వెల్లడించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటన రావడం బన్నీ కొత్త మూవీ మీద ఊహాగానాలు మొదలైపోయాయి.
‘విక్రమ్’ దర్శకుడు లోకేష్ కనకరాజ్తో బన్నీ కొత్త చిత్రం ఉంటుందని వార్తలు పుట్టించేశారు. కానీ బన్నీ సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం ఈ కాంబినేషన్లో సినిమా రావట్లేదు. బన్నీతో వెంటనే సినిమా చేయడానికి లోకేష్ అసలు రెడీగా లేడు. తమిళంలోనే అతడికి వేరే కమిట్మెంట్లు చాలానే ఉన్నాయి. ముందుగా ఏడాది చివర్లో విజయ్ సినిమాను మొదలుపెట్టాలి. తర్వాత విక్రమ్-2, ఖైదీ-2 చేయాలి.
తెలుగులో ఏ స్టార్తో అయినా సినిమా ఉంటుంది అంటే.. అది ముందు రామ్ చరణ్తోనే. వీరి మధ్య కథా చర్చలు కూడా జరిగాయి గతంలో. ఇద్దరికీ కుదిరినపుడు సినిమా చేయడానికి అంగీకారం కుదిరింది. బన్నీతో అయితే ఇప్పట్లో లోకేష్ జట్టు కట్టే అవకాశాలే లేవు. నిజానికి బన్నీ వేరే దర్శకుడితో చర్చలు జరుపుతున్నాడని.. అవి ఒక కొలిక్కి వచ్చాక మీడియాకు సమాచారం లీక్ అవుతుందని భావిస్తున్నారు.
This post was last modified on June 18, 2022 10:14 pm
2024 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. టీడీపీ, జనసేన,…
ఊహించని షాక్ తగిలింది. ఇంకో రెండు గంటల్లో అఖండ 2 తాండవంని వెండితెరపై చూడబోతున్నామన్న ఆనందంలో ఉన్న నందమూరి అభిమానుల…
ఏపీ మాజీ సీఎం జగన్ తన పాలనలో ప్రజా పర్యటనల సందర్భంగా పరదాలు లేనిదే అడుగు బయటపెట్టరు అన్న టాక్…
ఏడాది కిందట అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ళల పెళ్లి జరిగింది. సన్నిహితుల మధ్య కొంచెం సింపుల్గా పెళ్లి చేసుకుంది ఈ…
విరాట్ కోహ్లీ సెంచరీ కొట్టాడంటే టీమిండియా గెలిచినట్టే అని ఒక నమ్మకం ఉంది. కానీ రాయ్పూర్ వేదికగా జరిగిన రెండో…
ఎప్పుడూ లేనిది ఒక పెద్ద హీరోకు తెలంగాణ టికెట్ రేట్ల పెంపు బాగా ఆలస్యమయ్యింది. జూబ్లీ హిల్స్ ఎన్నికల ప్రచారంలో…