రామ్ గోపాల్ వర్మ స్థాయి ఏంటి.. ఈ సినిమాలేంటి అని తిట్టేవాళ్లు తిడుతున్నారు కానీ.. ఆయన మాత్రం బూతు పేరు చెప్పి భలేగా సొమ్ము చేసుకుంటున్నట్లే ఉన్నాడు. ఈ మధ్యే ఆయన్నుంచి క్లైమాక్స్ అనే కళాఖండం వచ్చింది. ఈ సినిమా చూసిన వాళ్లందరూ వర్మను విపరీతంగా తిట్టిపోశారు.
అయితేనేం అది బాక్సాఫీస్ లెక్కల్లో చెప్పాలంటే బ్లాక్బస్టర్. థియేట్రికల్ రిలీజ్ లేకుండా, ఓటీటీ ఫ్లాట్ ఫాంలోనూ విడుదల చేయకుండా.. సొంతంగా ఆర్జీవీ వరల్డ్ థియేటర్ అనే డిజిటల్ ఫ్లాట్ ఫాం పెట్టి.. ఒక్క వ్యూకు రూ.100 రేటు పెట్టి రిలీజ్ చేస్తే లక్షల మంది ఎగబడి చూశారు. వర్మ ఖాతాలోకి కోట్లు వచ్చిపడ్డాయి. ఈ సినిమాకు పెట్టిన ఖర్చు మీద ఎన్నో రెట్లు లాభాలు అందుకున్నాడు వర్మ.
ఐతే ఇప్పుడు వర్మ నుంచి మరో బూతు కళాఖండం వచ్చింది. దాని పేరు నేక్డ్. ఈసారి స్వీటీ అనే లోకల్ అమ్మాయితో మలయాళ బి-గ్రేడ్ సినిమాలకు ఏమాత్రం తగ్గని రీతిలో సినిమా తీసినట్లున్నాడు వర్మ. దాని పోస్టర్లు, ఇతర ప్రోమోలు చూసిన వాళ్లందరికీ స్థాయి అర్థమయ్యే ఉంటుంది. ఐతే క్లైమాక్స్లో అయినా ఇంటర్నేషనల్ పోర్న్ స్టార నటించింది కాబట్టి అలా ఎగబడ్డారనుకోవచ్చు.
కానీ నేక్డ్లో ఎవరో లోకల్ అమ్మాయి నటించినా.. ఇలాంటి వీడియోలు యూట్యూబ్లో, పోర్న్ సైట్లలో కుప్పలు కుప్పలుగా ఉన్నా.. ఏకంగా 200 రేటు పెట్టి చూసేందుకు కుర్రాళ్లు ఎగబడటం చిత్రమే. కేవలం 22 నిమిషాల నిడివి ఉన్న ఈ సినిమా శనివారం రాత్రి 9 గంటల నుంచి స్ట్రీమ్ అవుతుంటే.. తొలి అర్ధగంటలోనే 23,560 మంది టికెట్లు కొన్నట్లు వర్మ వెల్లడించాడు. అంటే అప్పటికే 47 లక్షలకు పైగా డబ్బులొచ్చి పడ్డాయన్నమాట.
ఈ సినిమా మొత్తానికి వర్మ అండ్ కో పెట్టిన ఖర్చు కేవలం రూ.5 లక్షలట. ట్రెండ్ చూస్తుంటే మినిమం కోటి రూపాయలైనా వసూలయ్యేలా ఉంది. మొత్తానికి వర్మ యాపారం భలేగా ఉన్నట్లే కనిపిస్తోంది.
This post was last modified on June 28, 2020 9:30 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…