మధుశాలిని గుర్తుందా? తన మోడర్న్ లుక్స్ చూసి, మోడల్గా కెరీర్ ఆరంభంలో తను చేసిన ప్రకటనలు అవీ చూసి చాలామంది ఏ ముంబయి భామో అయ్యుంటుదని అనుకున్నారు. కానీ ఆమె అచ్చ తెలుగు అమ్మాయే పొరుగింటి పుల్లకూర రుచి అన్నట్లుగా మన హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా మన దర్శక నిర్మాతలు పెద్దగా పట్టించుకోరు. వేరే భాషల కథానాయికలకే ప్రాధాన్యం ఇస్తారు. మధుశాలినికి అన్నీ ఉన్నా కూడా ఈ కారణంతోనే ఒక స్థాయికి మించి ఎదగలేకపోయింది.
కితకితలు, ఆగంతకుడు లాంటి చిన్న సినిమాలకే పరిమితం అయింది. హీరోయిన్గా అవకాశాలు తగ్గాక ఆమె క్యారెక్టర్ రోల్స్ కూడా చేసింది. ఆ సమయంలోనే తమిళం నుంచి అవకాశాలు రావడంతో అటు వెళ్లిపోయింది. ‘వాడు వీడు’ సహా అక్కడ చెప్పుకోదగ్గ స్థాయిలోనే సినిమాలు చేసింది. ఇప్పుడు తన జీవిత భాగస్వామిని కూడా మధుశాలిని కోలీవుడ్లోనే వెతుక్కోవడం విశేషం.
గోకుల్ అనే యువ నటుడిని మధుశాలిని చడీచప్పుడు లేకుండా పెళ్లాడేసింది. అసలు మధుశాలిని ప్రేమ గురించి కూడా పెద్దగా చర్చ లేదు. నేరుగా పెళ్లితోనే ఆమె వార్తల్లోకి వచ్చింది. గోకుల్ అక్కడంత పాపులర్ నటుడేమీ కాదు. చిన్నా చితకా సినిమాలే చేశాడు. కానీ మంచి అందగాడిగా పేరుంది. అతడితో మధుశాలిని పరిచయం ప్రేమగా మారి.. ఇద్దరూ పెళ్లి వైపు అడుగులు వేశారు. చూడ్డానికి చిన్నమ్మాయిలా కనిపిస్తుంది కానీ.. మోడలింగ్తో మొదలుపెడితే మధుశాలినిది రెండు దశాబ్దాల కెరీర్ కావడం విశేషం. చివరగా ఆమె తెలుగులో ‘గూఢచారి’ సినిమాలో ప్రత్యేక పాత్రలో మెరిసింది. ఇటీవల హాట్ స్టార్ వెబ్ సిరీస్ ‘9 అవర్స్’లోనూ నటించింది.
తమిళంలో కూడా సినిమాలు, వెబ్ సిరీస్ల్లో నటిస్తోంది మధు. పెళ్లి తర్వాత కూడా ఆమె కెరీర్ను కొనసాగించాలని నిర్ణయించుకుంది. గోకుల్ కూడా నటుడే కావడంతో ఆ విషయంలో అభ్యంతరాలు లేకపోవచ్చు. సోషల్ మీడియాలో ఈ జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
This post was last modified on June 18, 2022 12:31 pm
ఏపీలో 175 నియోజకవర్గాలు ఉన్నాయి. అయితే.. వీటిలో కొన్ని చాలా వెనుకబడి ఉన్నాయి. మరికొన్ని మధ్యస్థాయిలో అభివృద్ధి చెందాయి. ఇంకొన్ని…
ఒక పెద్ద సినీ కుటుంబానికి చెందిన కొత్త కుర్రాడు ఇండస్ట్రీలోకి అడుగు పెడుతుంటే.. డెబ్యూ మూవీ చేస్తుండగానే వేరే చిత్రాలు…
రాజకీయ పార్టీలకు ప్రముఖ సంస్థలు విరాళాలు ఇవ్వడం కొత్తకాదు. అయితే.. ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క విధంగా విరాళాలు ఇవ్వడం(వాటి ఇష్టమే…
కోనసీమ కొబ్బరి తోటలకు తెలంగాణ నాయకుల దిష్టి తగిలిందంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ…
ఒకప్పుడు ఏపీలో హెచ్ ఐవీ ఎక్కువగా ఉండేది. హైవేల పక్కన ఎక్కువ కండోమ్ లు కనపడేవి అని సీఎం చంద్రబాబు…
ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సీఎం చంద్రబాబు విజయవాడలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అదేవిధంగా…