ఇటీవలే పెళ్లి చేసుకుని మిసెస్ విగ్నేష్ శివన్ గా మారిన తర్వాత విడుదలైన నయనతార కొత్త సినిమా ఓ2. కాకపోతే థియేటర్లలో కాదు లెండి, డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా ఓటిటి రిలీజ్ అందుకుంది. ట్రైలర్ చూశాక ఓ మాదిరి ఆసక్తి రేగింది కానీ అసలు మూవీలో ఏమైనా మ్యాటర్ ఉందేమోనని అభిమానులు చాలా ఆశించారు. దీని దర్శకుడు పేరు విక్నేష్ కావడం గమనార్హం. క్యాస్టింగ్ పెద్ద గ్రాండ్ గా లేకపోయినా ఇంట్లోనే కూర్చుని చూసే వెసులుబాటు ఉండటంతో ఓ లుక్ వేద్దామనుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు.
ఇంతకీ దీని టాక్ ఎలా ఉందో చూద్దాం. ఇదో సర్వైవల్ థ్రిల్లర్. అంటే ఏ సహాయం అందక ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు హీరో లేదా హీరోయిన్ చేసే పోరాటమన్న మాట. ఈ ఓ2 ఆ పాయింట్ తోనే రూపొందింది. ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడుతున్న కొడుకు వీర (రిత్విక్) కు ఆపరేషన్ చేయించడానికి బస్సులో కొచ్చి తీసుకెళ్తుంది పార్వతి(నయనతార). కానీ ఆ బస్సు యాక్సిడెంట్ కు గురై ఓ లోయలోకి పడిపోయి అందరూ ఊపిరాడని ప్రమాదంలో పడతారు. అసలే అదే వ్యాధితో బాధ పడుతున్న వీరను కాపాడుకోవడం పార్వతికి ఛాలెంజ్ గా మారుతుంది. తోటి ప్రయాణికులు ఇదే సమస్యతో అల్లాడుతున్నప్పుడు తనేం చేసిందనేదే ఇందులో కథ.
ఏదో హాలీవుడ్ సినిమాలు చూసి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఎగ్జైట్ అయిపోయి స్క్రిప్ట్ మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా ప్రేక్షకులను తక్కువంచనా వేస్తే ఎలా ఉంటుందో ఓ2 ఉదాహరణగా నిలుస్తుంది. నయనతార లాంటి పవర్ ఫుల్ స్టార్ ని చేతిలో పెట్టుకుని ఇంతటి పేలవమైన కథాకథనాలతో చూసేవాళ్ల ఓపికతో ఆదుకుంటాడు విక్నేష్. మంచి ఆరిస్టులు దొరికినా సరైన డ్రామా లేక ఓ2 చాలా నిరాసక్తంగా సాగుతుంది. సాంకేతిక విభాగాలు కూడా బ్యాడ్ అవుట్ ఫుట్ కోసం కష్టపడ్డాయి. వెబ్ లో ఉన్న కంటెంట్ మొత్తం చూసేశాం అయినా బోలెడు టైం ఉందంటే తప్ప ఓ2 చూసేందుకు సరైన కారణం చెప్పలేం. నేత్రికన్ తర్వాత నయన్ రెండో ఓటిటి మూవీ ఇది.
This post was last modified on June 17, 2022 7:13 pm
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…