ఇటీవలే పెళ్లి చేసుకుని మిసెస్ విగ్నేష్ శివన్ గా మారిన తర్వాత విడుదలైన నయనతార కొత్త సినిమా ఓ2. కాకపోతే థియేటర్లలో కాదు లెండి, డిస్నీ హాట్ స్టార్ లో నేరుగా ఓటిటి రిలీజ్ అందుకుంది. ట్రైలర్ చూశాక ఓ మాదిరి ఆసక్తి రేగింది కానీ అసలు మూవీలో ఏమైనా మ్యాటర్ ఉందేమోనని అభిమానులు చాలా ఆశించారు. దీని దర్శకుడు పేరు విక్నేష్ కావడం గమనార్హం. క్యాస్టింగ్ పెద్ద గ్రాండ్ గా లేకపోయినా ఇంట్లోనే కూర్చుని చూసే వెసులుబాటు ఉండటంతో ఓ లుక్ వేద్దామనుకునే వాళ్ళు ఎక్కువే ఉన్నారు.
ఇంతకీ దీని టాక్ ఎలా ఉందో చూద్దాం. ఇదో సర్వైవల్ థ్రిల్లర్. అంటే ఏ సహాయం అందక ప్రాణాలు ప్రమాదంలో పడినప్పుడు హీరో లేదా హీరోయిన్ చేసే పోరాటమన్న మాట. ఈ ఓ2 ఆ పాయింట్ తోనే రూపొందింది. ఊపిరితిత్తుల జబ్బుతో బాధపడుతున్న కొడుకు వీర (రిత్విక్) కు ఆపరేషన్ చేయించడానికి బస్సులో కొచ్చి తీసుకెళ్తుంది పార్వతి(నయనతార). కానీ ఆ బస్సు యాక్సిడెంట్ కు గురై ఓ లోయలోకి పడిపోయి అందరూ ఊపిరాడని ప్రమాదంలో పడతారు. అసలే అదే వ్యాధితో బాధ పడుతున్న వీరను కాపాడుకోవడం పార్వతికి ఛాలెంజ్ గా మారుతుంది. తోటి ప్రయాణికులు ఇదే సమస్యతో అల్లాడుతున్నప్పుడు తనేం చేసిందనేదే ఇందులో కథ.
ఏదో హాలీవుడ్ సినిమాలు చూసి ఎక్కడో ఒక పాయింట్ దగ్గర ఎగ్జైట్ అయిపోయి స్క్రిప్ట్ మీద సీరియస్ గా దృష్టి పెట్టకుండా ప్రేక్షకులను తక్కువంచనా వేస్తే ఎలా ఉంటుందో ఓ2 ఉదాహరణగా నిలుస్తుంది. నయనతార లాంటి పవర్ ఫుల్ స్టార్ ని చేతిలో పెట్టుకుని ఇంతటి పేలవమైన కథాకథనాలతో చూసేవాళ్ల ఓపికతో ఆదుకుంటాడు విక్నేష్. మంచి ఆరిస్టులు దొరికినా సరైన డ్రామా లేక ఓ2 చాలా నిరాసక్తంగా సాగుతుంది. సాంకేతిక విభాగాలు కూడా బ్యాడ్ అవుట్ ఫుట్ కోసం కష్టపడ్డాయి. వెబ్ లో ఉన్న కంటెంట్ మొత్తం చూసేశాం అయినా బోలెడు టైం ఉందంటే తప్ప ఓ2 చూసేందుకు సరైన కారణం చెప్పలేం. నేత్రికన్ తర్వాత నయన్ రెండో ఓటిటి మూవీ ఇది.
This post was last modified on June 17, 2022 7:13 pm
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్ వైసీపీ నేతలను ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేశారు. ``అన్నీ గుర్తుంచుకున్నా.…
దసరా తర్వాత న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కలయికలో తెరకెక్కుతున్న ది ప్యారడైజ్ షూటింగ్ నిర్విరామంగా జరుగుతోంది.…
రాజకీయాల్లో మార్పులు జరుగుతూనే ఉంటాయి. ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారుతారు. ఇలాంటి పరిణామమే ఉమ్మడి కృష్నాజిల్లాలో కూడా చోటు చేసుకుంటోంది.…
ప్రస్తుతం ఇండియాలో తెరకెక్కుతున్న చిత్రాల్లో అత్యంత హైప్ ఉన్న వాటిలో అల్లు అర్జున్, అట్లీ సినిమా ఒకటి. ఏకంగా రూ.800…
భారీ అంచనాల మధ్య అవతార్ ఫైర్ అండ్ యాష్ విడుదలయ్యింది. ఇవాళ రిలీజులు ఎన్ని ఉన్నా థియేటర్లలో జనం నిండుగా…
మన దగ్గర అయిదు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు సంక్రాంతికి తలపడుతున్నా సరే పెద్దగా టెన్షన్ వాతావరణం లేదు కానీ తమిళంలో…