దిల్ రాజు ఇప్పుడైనా హిట్ కొట్టడం ఏంటి.. ఆయన చూడని సక్సెస్లా అనిపిస్తోందా? టాలీవుడ్లో ఆయన సక్సెస్ రేట్ ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదులెండి. ఇక్కడ టాపిక్ దిల్ రాజు బాలీవుడ్ ప్రస్థానం గురించి. గతంలో తెలుగులో టాప్ ప్రొడ్యూసర్లు చాలామంది హిందీలోకి అడుగు పెట్టిన వాళ్లే. ఆ తర్వాత ఆ ఒరవడికి బ్రేక్ పడింది.
టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించినప్పటికీ దిల్ రాజుకు పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మార్మోగేలా చేయాలని ఆశ ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప తరహాలో ఓ భారీ చిత్రంతో దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్కు హైప్ తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారు. ఐతే ఆ స్థాయి భారీ చిత్రం చేయడానికంటే ముందే ఆయన బాలీవుడ్లోకి అడుగు పెట్టాలని చూశారు.
ముందుగా జెర్సీ సినిమా రీమేక్తో అక్కడ ఎంట్రీ ఇచ్చారు. కానీ స్యూర్ షాట్ హిట్ అన్న నమ్మకం కలిగించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దిల్ రాజుకు అరంగేట్రంలో చేదు అనుభవం మిగిలింది. ఇప్పుడు ఆయన హిట్ రీమేక్తో బాలీవుడ్లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనతో కలిసి భూషణ్ కుమార్ ఇంకో ఇద్దరు నిర్మాతలు ఈ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి జెర్సీకి పోలికలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా తెలుగు నుంచి రీమేక్ అవుతున్న సినిమా. అలాగే ఒరిజినల్ తీసిన డైరెక్టరే దీన్ని కూడా రూపొందిస్తున్నాడు. మరి ఫలితం కూడా జెర్సీని పోలి ఉంటుందా.. లేక దిల్ రాజుకు బాలీవుడ్లో తొలి విజయాన్ని రుచి చూపిస్తుందా అన్నది చూడాలి. దీంతో పాటు ఎఫ్-2ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు దిల్ రాజు. రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా జంటగా నటించిన హిట్ హిందీ రీమేక్కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. జులై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 17, 2022 9:09 am
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…
సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. ఈసారి బాక్సాఫీస్ వద్ద రద్దీ మామూలుగా లేదు. ప్రభాస్ 'రాజా సాబ్', మెగాస్టార్ 'MSG'…
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
మూడేళ్లకు పైగా టైం తీసుకుని, 400 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టి తీసిన సినిమా.. రాజాసాబ్. కానీ ఏం లాభం?…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…