దిల్ రాజు ఇప్పుడైనా హిట్ కొట్టడం ఏంటి.. ఆయన చూడని సక్సెస్లా అనిపిస్తోందా? టాలీవుడ్లో ఆయన సక్సెస్ రేట్ ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదులెండి. ఇక్కడ టాపిక్ దిల్ రాజు బాలీవుడ్ ప్రస్థానం గురించి. గతంలో తెలుగులో టాప్ ప్రొడ్యూసర్లు చాలామంది హిందీలోకి అడుగు పెట్టిన వాళ్లే. ఆ తర్వాత ఆ ఒరవడికి బ్రేక్ పడింది.
టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించినప్పటికీ దిల్ రాజుకు పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మార్మోగేలా చేయాలని ఆశ ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప తరహాలో ఓ భారీ చిత్రంతో దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్కు హైప్ తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారు. ఐతే ఆ స్థాయి భారీ చిత్రం చేయడానికంటే ముందే ఆయన బాలీవుడ్లోకి అడుగు పెట్టాలని చూశారు.
ముందుగా జెర్సీ సినిమా రీమేక్తో అక్కడ ఎంట్రీ ఇచ్చారు. కానీ స్యూర్ షాట్ హిట్ అన్న నమ్మకం కలిగించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దిల్ రాజుకు అరంగేట్రంలో చేదు అనుభవం మిగిలింది. ఇప్పుడు ఆయన హిట్ రీమేక్తో బాలీవుడ్లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనతో కలిసి భూషణ్ కుమార్ ఇంకో ఇద్దరు నిర్మాతలు ఈ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి జెర్సీకి పోలికలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా తెలుగు నుంచి రీమేక్ అవుతున్న సినిమా. అలాగే ఒరిజినల్ తీసిన డైరెక్టరే దీన్ని కూడా రూపొందిస్తున్నాడు. మరి ఫలితం కూడా జెర్సీని పోలి ఉంటుందా.. లేక దిల్ రాజుకు బాలీవుడ్లో తొలి విజయాన్ని రుచి చూపిస్తుందా అన్నది చూడాలి. దీంతో పాటు ఎఫ్-2ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు దిల్ రాజు. రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా జంటగా నటించిన హిట్ హిందీ రీమేక్కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. జులై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…
మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…
రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…
ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…
తమిళ సినిమాలో దశాబ్దాల పాటు ఆధిపత్యం చలాయించిన సూపర్ స్టార్లు రజినీకాంత్. కమల్ హాసన్ వ్యక్తిగతంగా మంచి మిత్రులన్న సంగతి…
ఏపీలో ఇప్పుడు కాపు సామాజిక వర్గం కేంద్రంగా రసవత్తర రాజకీయం నడుస్తోంది. నిన్నటికి నిన్న వైసీపీ ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు…