దిల్ రాజు ఇప్పుడైనా హిట్ కొట్టడం ఏంటి.. ఆయన చూడని సక్సెస్లా అనిపిస్తోందా? టాలీవుడ్లో ఆయన సక్సెస్ రేట్ ఇప్పుడు కొత్తగా మాట్లాడాల్సిన అవసరం లేదులెండి. ఇక్కడ టాపిక్ దిల్ రాజు బాలీవుడ్ ప్రస్థానం గురించి. గతంలో తెలుగులో టాప్ ప్రొడ్యూసర్లు చాలామంది హిందీలోకి అడుగు పెట్టిన వాళ్లే. ఆ తర్వాత ఆ ఒరవడికి బ్రేక్ పడింది.
టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించినప్పటికీ దిల్ రాజుకు పాన్ ఇండియా స్థాయిలో తన పేరు మార్మోగేలా చేయాలని ఆశ ఉంది. బాహుబలి, ఆర్ఆర్ఆర్, పుష్ప తరహాలో ఓ భారీ చిత్రంతో దేశవ్యాప్తంగా శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్కు హైప్ తీసుకురావాలని ఆయన అనుకుంటున్నారు. ఐతే ఆ స్థాయి భారీ చిత్రం చేయడానికంటే ముందే ఆయన బాలీవుడ్లోకి అడుగు పెట్టాలని చూశారు.
ముందుగా జెర్సీ సినిమా రీమేక్తో అక్కడ ఎంట్రీ ఇచ్చారు. కానీ స్యూర్ షాట్ హిట్ అన్న నమ్మకం కలిగించిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. దిల్ రాజుకు అరంగేట్రంలో చేదు అనుభవం మిగిలింది. ఇప్పుడు ఆయన హిట్ రీమేక్తో బాలీవుడ్లో మళ్లీ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఆయనతో కలిసి భూషణ్ కుమార్ ఇంకో ఇద్దరు నిర్మాతలు ఈ చిత్రాన్ని హిందీలో నిర్మిస్తున్నారు. ఐతే ఈ చిత్రానికి జెర్సీకి పోలికలు కనిపిస్తున్నాయి.
ఇది కూడా తెలుగు నుంచి రీమేక్ అవుతున్న సినిమా. అలాగే ఒరిజినల్ తీసిన డైరెక్టరే దీన్ని కూడా రూపొందిస్తున్నాడు. మరి ఫలితం కూడా జెర్సీని పోలి ఉంటుందా.. లేక దిల్ రాజుకు బాలీవుడ్లో తొలి విజయాన్ని రుచి చూపిస్తుందా అన్నది చూడాలి. దీంతో పాటు ఎఫ్-2ను కూడా హిందీలో రీమేక్ చేసే ప్రయత్నంలో ఉన్నాడు దిల్ రాజు. రాజ్ కుమార్ రావు, సాన్యా మల్హోత్రా జంటగా నటించిన హిట్ హిందీ రీమేక్కు శైలేష్ కొలను దర్శకత్వం వహించాడు. జులై 15న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
This post was last modified on June 17, 2022 9:09 am
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…