సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ వచ్చే ఏడాదే పట్టాలెక్కబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో ఎట్టకేలకు మహేష్ జట్టు కట్టబోతున్నాడు. వీరి కలయికలో సినిమాను చాన్నాళ్ల ముందే ప్రకటించారు కానీ.. సినిమా వచ్చే ఏడాదే మొదలు కానుంది. జక్కన్నతో సినిమా ఆలస్యం అయితే అయింది కానీ.. అది మహేష్ మంచికే అని చెప్పాలి.
మొదట్లో వీరి మధ్య చర్చ జరిగినప్పుడే అయితే రాజమౌళి మామూలు సినిమానే తీసేవాడేమో. కానీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేసి ప్రపంచ స్థాయిలో తన పేరు మార్మోగేలా చేసుకున్నాక జక్కన్న మహేష్తో సినిమా చేయబోతున్నాడు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు సాధారణమైనవి కావు.
మన ప్రేక్షకులకు ‘బాహుబలి’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ తక్కువగా అనిపించింది కానీ.. అంతర్జాతీయ ఆడియన్స్ స్పందన దీనికి భిన్నంగా ఉంది. హాలీవుడ్లో పేరున్న ఆర్టిస్టులు, ఫిలిం మేకర్లు, టెక్నీషియన్లు, వేరే రంగాలకు చెందిన సెలబ్రెటీలు ‘ఆర్ఆర్ఆర్’ చూసి మెస్మరైజ్ అయిపోయారు. కొన్ని వారాలుగా ఆ సినిమాను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. తమ జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదని కొందరంటే.. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ కట్టబెట్టాలనేవాళ్లు ఇంకొందరు. కొత్తగా ఇప్పుడు రాజమౌళి తీసిన వేరే సినిమాలను చూడడం మొదలుపెడుతున్నారు హాలీవుడ్ ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో జక్కన్న కొత్త సినిమాలపై వారికి ప్రత్యేక ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇండియాలో ఆల్రెడీ స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ ఉన్న జక్కన్న.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇలాంటి టైంలో మహేష్ ఆయనతో జట్టు కడుతుండటంతో తన సినిమాకు వచ్చే అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. వీరి కలయికలో అంచనాలకు తగ్గ సినిమా వస్తే.. మహేష్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 15, 2022 5:27 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…