సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులు ఎప్పట్నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ వచ్చే ఏడాదే పట్టాలెక్కబోతోంది. దర్శక ధీరుడు రాజమౌళితో ఎట్టకేలకు మహేష్ జట్టు కట్టబోతున్నాడు. వీరి కలయికలో సినిమాను చాన్నాళ్ల ముందే ప్రకటించారు కానీ.. సినిమా వచ్చే ఏడాదే మొదలు కానుంది. జక్కన్నతో సినిమా ఆలస్యం అయితే అయింది కానీ.. అది మహేష్ మంచికే అని చెప్పాలి.
మొదట్లో వీరి మధ్య చర్చ జరిగినప్పుడే అయితే రాజమౌళి మామూలు సినిమానే తీసేవాడేమో. కానీ బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో బాక్సాఫీస్ను షేక్ చేసి ప్రపంచ స్థాయిలో తన పేరు మార్మోగేలా చేసుకున్నాక జక్కన్న మహేష్తో సినిమా చేయబోతున్నాడు. ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’తో రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో వచ్చిన పేరు ప్రఖ్యాతులు సాధారణమైనవి కావు.
మన ప్రేక్షకులకు ‘బాహుబలి’తో పోలిస్తే ‘ఆర్ఆర్ఆర్’ తక్కువగా అనిపించింది కానీ.. అంతర్జాతీయ ఆడియన్స్ స్పందన దీనికి భిన్నంగా ఉంది. హాలీవుడ్లో పేరున్న ఆర్టిస్టులు, ఫిలిం మేకర్లు, టెక్నీషియన్లు, వేరే రంగాలకు చెందిన సెలబ్రెటీలు ‘ఆర్ఆర్ఆర్’ చూసి మెస్మరైజ్ అయిపోయారు. కొన్ని వారాలుగా ఆ సినిమాను పొగడ్డమే పనిగా పెట్టుకున్నారు. తమ జీవితంలో ఇలాంటి సినిమా చూడలేదని కొందరంటే.. ‘ఆర్ఆర్ఆర్’కు ఆస్కార్ కట్టబెట్టాలనేవాళ్లు ఇంకొందరు. కొత్తగా ఇప్పుడు రాజమౌళి తీసిన వేరే సినిమాలను చూడడం మొదలుపెడుతున్నారు హాలీవుడ్ ప్రేక్షకులు.
ఈ నేపథ్యంలో జక్కన్న కొత్త సినిమాలపై వారికి ప్రత్యేక ఆసక్తి ఉంటుందనడంలో సందేహం లేదు. ఇండియాలో ఆల్రెడీ స్ట్రాంగ్ ఆడియన్స్ బేస్ ఉన్న జక్కన్న.. ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలోనూ ప్రేక్షకులను సంపాదించుకున్నాడు. ఇలాంటి టైంలో మహేష్ ఆయనతో జట్టు కడుతుండటంతో తన సినిమాకు వచ్చే అడ్వాంటేజ్ మామూలుగా ఉండదు. వీరి కలయికలో అంచనాలకు తగ్గ సినిమా వస్తే.. మహేష్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తే తన రేంజ్ ఎక్కడికో వెళ్లిపోతుందనడంలో సందేహం లేదు.
This post was last modified on June 15, 2022 5:27 pm
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ మంత్రి పార్టీ కీలక…