మంచు ఫ్యామిలీకి కాకతాళీయంగా అలా వివాదాలు వస్తాయో లేక ముందే ఊహించి బజ్ వచ్చేలా ఇలా ప్లాన్ చేసుకుంటారో తెలియదు కానీ మొత్తానికి వాళ్ళ సినిమాల తాలూకు కాంట్రవర్సీలు ఇటు న్యూస్ ఛానల్స్ కు అటు సోషల్ మీడియాకు మంచి స్టఫ్ గా మారుతున్నాయి. రెండు రోజుల క్రితం మంచు విష్ణు కొత్త సినిమా జిన్నా టైటిల్ అనౌన్స్ మెంట్ చేసిన సంగతి తెలిసిందే. సినిమాకు పని చేసిన సాంకేతిక నిపుణలను తీసుకొచ్చి వాళ్ళను పరిచయడం చేయడం ద్వారా దీని గురించి ప్రమోట్ చేయడం బాగుంది.
కానీ జిన్నా టైటిల్ లోగోని ఏకంగా ఏడుకొండల పైన పెట్టేసి చూపించడం పట్ల తీవ్రఅభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రచయిత కోన వెంకట్ దీనికి సంబంధించిన క్లారిటీ కూడా ఇచ్చారు. హీరో పేరు గాలి నాగేశ్వరరావు కాబట్టి అది ఇష్టం లేక షార్ట్ కట్ లో జిన్నాగా పిలిపించుకుంటాడని, అందులోనూ తిరుపతిలో జరిగే కథ కాబట్టి అలా సెట్ చేశామని వివరణ ఇచ్చారు. అయితే ఈ సమాధానం ఎవరికీ సంతృప్తినివ్వలేదు. ముఖ్యంగా బిజెపి నాయకులు బాగా పర్సనల్ గా తీసుకుని టీవీ డిబేట్లలో ఏకంగా వార్నింగులు ఇచ్చేశారు.
ఇదంతా ఎంచుకొచ్చిందంటే దేశవిభజన సమయంలో ఎందరో ప్రాణాలు కోల్పోవడానికి ప్రత్యక్ష కారణమైన నేతగా జిన్నాకున్న చెడ్డపేరే. ముఖ్యంగా హిందూవాదుల్లో ఆయన మీద తీవ్ర వ్యతిరేకత ఉంది. గుంటూరు జిన్నా సెంటర్ విషయంలో ఆ మధ్య జరిగిన రగడ గుర్తుందిగా. మొత్తానికి ఈ వ్యవహారం ఎక్కడ తేలుతుందో కానీ ఫైనల్ గా జిన్నాకు ఫ్రీ పబ్లిసిటీ తీసుకొస్తోంది. ఇప్పటిదాకైతే మంచు విష్ణు వివాదం గురించి స్పందించలేదు. సన్నీ లియోన్, పాయల్ రాజ్ పుత్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు ఇషాన్ సూర్య దర్శకుడు.
This post was last modified on June 15, 2022 11:12 am
ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రం చేసిన ప్రతిపాదన తీవ్ర సంకట స్థితిలోకి నెట్టేసింది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వాలంటూ.. కేంద్ర…
దాదాపు రెండేళ్ల తర్వాత.. ఏపీలో మరోసారి ఎన్నికలకు రంగం రెడీ అవుతోంది. గ్రామ పంచాయతీ సహా.. స్థానిక సంస్థల ఎన్నికలకు…
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…