ఇప్పుడు కరోనా మహమ్మారిని అందరూ లైట్ తీసుకుంటూ ఉండొచ్చు. ఇప్పుడు కేసులు కూడా చాలా తక్కువగానే నమోదవుతూ ఉండొచ్చు. కానీ కరోనా ప్రభావం మాత్రం జనాల మీద ఎప్పటికీ కొనసాగేలా ఉంది. కొవిడ్ వల్ల మనుషుల దైనందిన జీవితాల్లో, అలాగే వారి ఆలోచన తీరులో చాలా మార్పు వచ్చేసింది. సినిమాల విషయానికి వస్తే.. కొత్త సినిమా వస్తే థియేటర్లకు వెళ్లి చూడాల్సిందే అన్న మైండ్ సెట్ ఇప్పుడు జనాల్లో లేదు.
థియేటర్లకు వెళ్లి సినిమాలు చూసే అలవాటును కొవిడ్ బ్రేక్ చేసింది. అదే సమయంలో ఓటీటీలకు బాగా అలవాటు పడ్డారు. దీనికి తోడు కరోనా నష్టాల్ని భర్తీ చేసుకోవడం కోసమని నిర్మాతలు టికెట్ల ధరలను మరీ ఎక్కువ పెంచేయడం, పెద్ద సినిమాలకు అదనంగా వడ్డించడం లాంటి పరిణామాలు ప్రేక్షకులను మరింతగా థియేటర్లకు దూరం చేసేశాయి.
ఇప్పుడు మా సినిమాలకు రేట్లు తగ్గించాం, సాధారణ రేట్లకే సినిమా చూపిస్తాం అని స్టేట్మెంట్లు ఇవ్వడం, ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడం లాంటివి నిర్మాతలు చేస్తున్నారంటే టికెట్ల ధరలు ఏ స్థాయిలో ప్రతికూల ప్రభావం చూపించాయో అర్థం చేసుకోవచ్చు. ఈ మధ్య మేజర్, విక్రమ్ సినిమాలకు రీజనబుల్ రేట్లు పెట్టడం బాగానే కలిసొచ్చింది. సింగిల్ స్క్రీన్లలో 150, మల్టీప్లెక్సుల్లో 195-200 రేట్లు పెట్టారు ఈ సినిమాలకు.
కానీ తర్వాత వచ్చిన నాని సినిమా అంటే సుందరానికీ విషయంలో నిర్మాతలు ఈ బాటలో వెళ్లలేదు. ఆ చిత్రానికి సింగిల్ స్క్రీన్లలో 175, మల్టీప్లెక్సుల్లో 250 రేట్లు పెట్టారు. దీనికి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జీలు అదనం. ఇది ప్రేక్షకులకు రుచించినట్లు లేదు. ఆ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాకపోవడానికి రేట్లు ఎక్కువ ఉండడం కూడా ఒక కారణమైందన్నది స్పష్టం. ఈ నేపథ్యంలో ఈ వారం రానున్న రానా సినిమా విరాటపర్వంకి నిర్మాతలు ఆలోచించిన నిర్ణయం తీసుకున్నారు. 150, 200 రేట్లతో వెళ్లాలని నిర్ణయించుకున్నారు. సత్యదేవ్ మూవీ గాడ్సెకు కూడా ఇవే రేట్లు ఉండబోతున్నాయి. గాడ్సె సంగతేమో కానీ.. విరాటపర్వంకి ఈ రేట్లు మేలు చేయొచ్చు.
This post was last modified on June 14, 2022 3:06 pm
తెలంగాణ అధికార పార్టీ కాంగ్రెస్లో వన్ మ్యాన్ `ఆర్మీ`గా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కనిపిస్తున్నారు. గత ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి…
ఉత్తరాంధ్ర రాజకీయాల్లో ఒకప్పుడు దూకుడుగా ఉన్న వైసీపీ ఇప్పుడు పెద్దగా కనిపించడం లేదన్న టాక్ వినిపిస్తోంది. కీలక నాయకులు ఉన్నప్పటికీ..…
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…