స్క్విడ్ గేమ్.. ఈ పేరు వింటే వెబ్ సిరీస్ ప్రియుల్లో ఒక రకమైన అలజడి కలుగుతుంది. ఆ కొరియన్ వెబ్ సిరీస్ ఇచ్చిన థ్రిల్, కిక్ అలాంటిలాంటివి కావు. వెబ్ సిరీస్ల చరిత్రలోనే అత్యంత ఆదరణ పొంది.. ఓటీటీల్లో వ్యూస్ పరంగా అన్ని రికార్డులనూ బద్దలు కొట్టేసిన ఘనత ఈ సిరీస్ సొంతం. అంతర్జాతీయ స్థాయిలో టాప్ క్వాలిటీ సినిమాలు, సిరీస్లకు పెట్టింది పేరైన కొరియా నుంచి వచ్చిన ‘స్క్విడ్ గేమ్’ సిరీస్లో ప్రతి ఎపిసోడ్ తీవ్ర ఉత్కంఠకు, ఉద్వేగానికి గురి చేసేదే.
హ్వాంగ్ డాంగ్ హ్యూక్ రూపొందించిన ఈ సిరీస్ చిన్న పిల్లలను సైతం విపరీతంగా ఆకట్టుకుని.. దాని మీద ఎన్నో గేమ్స్ రావడానికి కూడా దోహదం చేసింది. ఈ సిరీస్ చూసిన ప్రతి ఒక్కరూ సీక్వెల్ కోసం ఎదురు చూస్తున్నారు. ఇంత విజయవంతమైన సిరీస్కు సీక్వెల్ తీయకుండా ఉండరు కాబట్టి అది ఎప్పుడా అన్న ఉత్కంఠతో ఉన్నారు.
ఐతే ఉత్కంఠకు తెరదించుతూ నెట్ ఫ్లిక్స్ వాళ్లు ‘స్క్విడ్ గేమ్’ సెకండ్ సీజన్ను అనౌన్స్ చేశారు. దర్శకుడు డాంగ్ హ్యూక్ రెండో సీజన్ గురించి అధికారిక ప్రకటన చేశాడు. షూటింగ్ మొదలవుతోందని, తొలి సీజన్కు దీటుగా, ఉత్కంఠభరితంగా రెండో సీజన్ ఉండబోతోందని అతను ధీమా వ్యక్తం చేశాడు.
‘స్క్విడ్ గేమ్’ కాన్సెప్ట్ చాలా షాకింగ్గా ఉంటుంది. మల్టీ మిలియనీర్లయిన కొంతమంది.. డబ్బు కోసం తహతహలాడుతున్న వ్యక్తులను ఎంచుకుని ఒక దీవిలోకి తీసుకొచ్చి వాళ్లతో డేంజరస్ గేమ్స్ ఆడిస్తారు. ఈ క్రమంలో తప్పులు చేసిన వాళ్లు వరుసగా ప్రాణాలు కోల్పోతుంటారు. ఈ డేంజరస్ గేమ్స్ చూసి ఆ మల్టీ మిలియనీర్లు వినోదం పొందుతుంటారు. ఆ గేమ్స్ సాగే వైనం.. తీవ్ర ఉత్కంఠతో ఉంటుంది. ఒక ఎపిసోడ్ మొదలుపెడితే.. అన్నీ చూసేదాకా వదల్లేని థ్రిల్, టెన్షన్ ఉంటుంది ఈ సిరీస్లో. మరి రెండో సీజన్ కూడా ఇంతే ఉత్కంఠభరితంగా ఉంటుందేమో చూడాలి.
This post was last modified on June 13, 2022 12:30 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…