తమిళ దర్శకులు వచ్చి తెలుగులో సినిమాలు చేయడం, హిట్లు కొట్టడం మామూలే. ఇది దశాబ్దాల కిందటే జరిగింది. కానీ తెలుగు దర్శకులు తమిళంలో, అక్కడి స్టార్లతో సినిమాలు చేయడం.. హిట్లు కొట్టడం అంటే ఆశ్చర్యపోయి చూడాల్సిందే. ఇప్పుడు అనుకోకుండా ఇద్దరు దర్శకులు కోలీవుడ్లోకి అడుగు పెడుతున్నారు.
అందులో ఒకరు ‘జాతిరత్నాలు’ ఫేమ్ అనుదీప్ కేవీ కాగా.. మరొకరు తొలిప్రేమ, మిస్టర్ మజ్ను, రంగ్దె చిత్రాల డైరెక్టర్ వెంకీ అట్లూరి. ఇందులో ముందుగా కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తున్నది అనుదీపే. తమిళ కథానాయకుడు శివ కార్తికేయన్తో అతను తెలుగు, తమిళ భాషల్లో ద్విభాషా చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘ప్రిన్స్’ అనే టైటిల్ ఖరారు చేశారు తాజాగా. ఫస్ట్ లుక్, సెకండ్ లుక్ కూడా లాంచ్ చేశారు.
ఇందులో ఓ విదేశీ అమ్మాయి కథానాయికగా నటిస్తోంది. ఆమెతో కలిసి శివ ఉన్న కొత్త పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ చిత్రం పాండిచ్చేరి నేపథ్యంలో నడిచే కథతో తెరకెక్కుతోంది. అక్కడి నేపథ్యానికి తగ్గట్లుగా ఫారిన్ అమ్మాయితో ప్రేమలో పడ్డ కుర్రాడి కథలా కనిపిస్తోందిది. టైటిల్, ఫస్ట్ లుక్ అన్నీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి. శివకార్తికేయన్ డాక్టర్, డాన్ లాంటి బ్లాక్బస్టర్లతో మంచి ఊపుమీదున్నాడు. ఈ రెండు చిత్రాలు తెలుగులో కూడా బాగా ఆడాయి.
దీంతో ‘ప్రిన్స్’ పట్ల పాజిటివ్ బజ్ నెలకొంది. అనుదీప్ ఈ సినిమా విషయంలో చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నాడు. అతడి నమ్మకం ఫలించి, అన్నీ కలిసొచ్చి అతను హిట్ కొట్టగలిగితే.. కోలీవుడ్లో హిట్ కొట్టిన అచ్చ తెలుగు దర్శకుడిగా అనుదీప్ రికార్డుల్లోకెక్కుతాడు. పాత కాలంలో కొందరు దర్శకులు తమిళంలో సినిమాలు చేశారు కానీ.. గత మూడు దశాబ్దాల్లో అయితే ఏ తెలుగు దర్శకుడూ తమిళంలోకి వెళ్లి సినిమాలు చేసి విజయం సాధించిన దాఖలాలు కనిపించవు. మరి అనుదీప్ రికార్డ్ కొడతాడేమో చూడాలి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…