మెగాస్టార్ చిరంజీవి , మెహర్ రమేష్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘భోళా శంకర్’ చుట్టూ నిన్నటి వరకూ చాలా వార్తలు చక్కర్లు కొట్టాయి. సినిమా ఆగిపోయిందని కొందరు , లేదు లేదు దర్శకుడు మారబోతున్నాడు అంటూ మరికొందరు గాసిప్స్ క్రియేట్ చేసి వదిలారు. దీంతో మెగా ఫ్యాన్స్ డైలమాలో పడ్డారు. షూటింగ్ స్టేజిలో ఉన్న చిరు సినిమా ఆగిపోయిందా ? ఇదేంటి అనుకున్నారు.
ఈ వార్తలు అటు తిరిగి, ఇటు తిరిగి ఎట్టకేలకు మేకర్స్ చెవిలో పడ్డాయి. దీంతో మేకర్స్ వెంటనే ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది. అయితే సినిమా రూమర్స్ గురించి ప్రస్తావించకుండా డైరెక్ట్ గా షెడ్యుల్ డీటెయిల్స్ చెప్పారు. జూన్ 21 నుండి కొత్త షెడ్యుల్ ప్రారంభం కానుందని ప్రకటన ఇచ్చారు. దీంతో ఈ సినిమాపై వస్తున్న పుకార్లకు చెక్ పడింది. నిజానికి ఇలాంటి పుకార్లు బడా సినిమాలకు కొత్తేమి కాదు.
కానీ మెగా స్టార్ సినిమాకు మాత్రం కొత్తే. చిరు అప్ కమింగ్ సినిమాల్లో ‘భోళా శంకర్’ మీద కాస్త నెగిటివిటీ ఉంది. మెహర్ ఈ సినిమాను ఎలా తీస్తారో అని మెగా ఫ్యాన్స్ కూడా సందేహ పడుతున్నారు. వారిలో ఎవరో ఒకరు ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసి ఉండొచ్చు.
ఏదేమైనా చిరు బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో మళ్ళీ బిజీ అవ్వబోతున్నాడు.
స్మాల్ బ్రేక్ తర్వాత మళ్ళీ వరుస షూటింగ్స్ మొదలు పెడుతున్నారు. ప్రస్తుతానికి ఇటు బాబీ సినిమా అటు మెహర్ సినిమా షెడ్యుల్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. బాబీ సినిమా త్వరలోనే మలేషియాలో భారీ షెడ్యుల్ జరుపుకోనుంది. ఈ సినిమాపై ట్రేడ్ వర్గాలో కూడా మంచి అంచనాలు ఉన్నాయి. చిరు మాస్ లుక్ ఈ సినిమాపై హైప్ క్రియేట్ చేస్తుంది.
మహారాష్ట్ర ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు దేవేంద్ర ఫడణవీస్తో ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్…
విజయవాడ పెద్ది ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా ముగిసింది. ఏర్పాట్ల దగ్గరి నుంచి అయిపోయే దాకా ఎక్కడా అపశ్రుతి లేకుండా…
తెలంగాణ నాయకురాలు, తెలంగాణ రక్షణ సేన(టీఆర్ఎస్) పార్టీ అధ్యక్షురాలు కవిత తాజాగా చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున…
పెద్ది నుంచి ఏదైనా బ్యాంగర్ లాంటి కంటెంట్ కావాలని ఎదురు చూస్తున్న అభిమానులకు అది మస్సా మస్సా వీడియో సాంగ్…
ఏపీ సీఎం చంద్రబాబు.. తాజాగా కల్లు రుచి చూశారు. వాస్తవానికి ఆయన ఇలాంటి వాటికి కడు దూరంగా ఉంటారు. అయితే..…
తెలంగాణ రాజకీయాలు వ్యూహాత్మక మలుపు తిరుగుతున్నాయి. బీఆర్ ఎస్, టీఆర్ ఎస్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కసారిగా జనసేన పార్టీపై…