ఆచార్య ఎపిక్ డిజాస్టర్ తర్వాత విదేశాలకు వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి రెండు రోజుల క్రితం తిరిగి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సినిమా నష్టాల తాలూకు లావాదేవీల గురించి దర్శకుడు కొరటాల శివతో ఒక దఫా చర్చలు పూర్తయినట్టు సమాచారం. ఇంకొద్ది రోజుల్లో దానికి సంబంధించిన వ్యవహారాలన్నీ ఒక కొలిక్కి తెస్తారట. సరే ఇలాంటి ఫ్లాపులు చూడటం ఏ స్టార్ హీరోకైనా సహజమే కానీ ఆచార్య మాత్రం చాలా స్పెషల్ కేస్ గా నిలవడం చిరుని పునరాలోచనలో పడేసిందని ఆయన సన్నిహితుల నుంచి వినిపిస్తున్న మాట.
దానికి కారణాలు లేకపోలేదు. ఈ పరాజయం తన ఇమేజ్ మాత్రమే ఓపెనింగ్స్ తేలేదని స్పష్టం చేసింది. చాలా చోట్ల బెనిఫిట్ షోలు సైతం ఫుల్ కాకపోవడాన్ని కొందరు వీరాభిమానుల నుంచి తెప్పించుకున్న స్పెషల్ రిపోర్ట్స్ సహాయంతో విశ్లేషణ చేస్తున్నారట. అసలు ఒక్క షో కూడా పూర్తి కాకుండా ఇంత నెగటివ్ వైబ్రేషన్లు జనంలోకి ఎలా వెళ్లాయనే దాని మీద వివిధ అభిప్రాయాలు సేకరించి వాటికి తన అనుభవాన్ని జోడించి ఒక కంక్లూజన్ తీసుకొచ్చే ప్రయత్నాల్లో ఉన్నారని తెలిసింది. ఇందులో చాలా దగ్గరివాళ్ళు ఉన్నట్టు వినికిడి.
ఇవన్నీ పోస్ట్ మార్టం చేశాక మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందుతున్న భోళాశంకర్ ని తేలిగ్గా తీసుకోవడానికి లేదని అర్థమైపోయిందట. ఏదో హిట్ కొట్టిన రీమేక్ కదా కాస్త మాసాలాలు జోడిస్తే చాలు ఆడేస్తుందనే నమ్మకం ఇప్పుడు సన్నగిల్లి ఉండొచ్చు. అందుకే గాడ్ ఫాదర్ ఎలాగూ పూర్తయ్యింది కాబట్టి ముందుగా స్ట్రెయిట్ మూవీ వాల్తేర్ వీరయ్య మీద సీరియస్ ఫోకస్ పెట్టి ఆ తర్వాత భోళా శంకర్ సంగతి చూస్తారు. అందుకే కీర్తి సురేష్, తమన్నాలతో సహా కీలక ఆర్టిస్టుల కాల్ షీట్స్ ఇంకా కన్ఫర్మ్ చేయలేదని తెలిసింది. ఇదేమో కానీ అసలు భోళా శంకర్ ప్రాజెక్టే క్యాన్సిల్ అయ్యిందనే పుకారు సోషల్ మీడియా ఊపందుకోవడం ఫైనల్ ట్విస్ట్.
This post was last modified on June 9, 2022 9:36 am
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…