అల వైకుంఠపురములో చిత్రానికి గీత ఆర్ట్స్ ని భాగస్వామిగా చేసిన అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప కి కూడా తన బంధువు ఒకరిని పార్టనర్ గా పెట్టాడు. దీంతో ఈ చిత్రం బడ్జెట్ వ్యవహారాల్లో కూడా బన్నీ టీమ్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి దాదాపు నూట యాభై కోట్ల షేర్ వచ్చినపుడు పుష్ప కోసం ఒక బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
మునుపటి లెక్కలతో సినిమా తీస్తే కరోనా తర్వాతి కాలంలో వర్కవుట్ అవదు. అందుకే ఈ చిత్రం కోసం బడ్జెట్ తిరిగి ప్లాన్ చేస్తున్నారట. ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించవచ్చు అనేది తర్కించుకుంటూ లెక్కలు వేస్తున్నారట. ఇంతవరకు షూటింగ్ జరగకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవుతోంది.
దీనివల్ల లొకేషన్స్, సెట్స్ దగ్గర్నుంచి అన్నిటినీ రీప్లాన్ చేసుకునే సౌకర్యం కుదిరింది. అయితే ఈ చిత్రానికి అవసరమయిన అటవీ నేపథ్యంకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కడ తీయాలనేది ఇంకా కచ్చితంగా ఫిక్స్ అవలేదని తెలిసింది.
This post was last modified on June 27, 2020 2:03 am
మెగాస్టార్ చిరంజీవి కెరీర్లో అత్యధిక బడ్జెట్లో, భారీ అంచనాలతో మొదలైన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ లాంటి బ్లాక్ బస్టర్తో దర్శకుడిగా…
గత వారం రోజులుగా అలేఖ్య చిట్టి పికిల్స్ వ్యవహారం సోషల్ మీడియాను ఎలా ఊపేస్తోందో తెలిసిందే. పచ్చళ్ల రేట్లు ఎక్కువ…
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటన ముగిసింది. ఉమ్మడి అనంతపురం జిల్లా…
ఐపీఎల్ 2025లో ముంబయి ఇండియన్స్ మరో ఓటమిని మూటగట్టుకుంది. వాంఖడే వేదికగా బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో ముంబయి 12 పరుగుల…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్ సోమవారం అగ్ని ప్రమాదంలో గాయపడ్డ…
ది రాజా సాబ్ విషయంలో జరుగుతున్న ఆలస్యం, అప్డేట్స్ లేకుండా కనిపిస్తున్న నిర్లిప్తత ఫ్యాన్స్ ని ఫ్రస్ట్రేట్ చేస్తున్న మాట…