అల వైకుంఠపురములో చిత్రానికి గీత ఆర్ట్స్ ని భాగస్వామిగా చేసిన అల్లు అర్జున్ తన తాజా చిత్రం పుష్ప కి కూడా తన బంధువు ఒకరిని పార్టనర్ గా పెట్టాడు. దీంతో ఈ చిత్రం బడ్జెట్ వ్యవహారాల్లో కూడా బన్నీ టీమ్ ఇన్వాల్వ్ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది. అల వైకుంఠపురములో చిత్రానికి దాదాపు నూట యాభై కోట్ల షేర్ వచ్చినపుడు పుష్ప కోసం ఒక బడ్జెట్ అనుకున్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది.
మునుపటి లెక్కలతో సినిమా తీస్తే కరోనా తర్వాతి కాలంలో వర్కవుట్ అవదు. అందుకే ఈ చిత్రం కోసం బడ్జెట్ తిరిగి ప్లాన్ చేస్తున్నారట. ఎక్కడెక్కడ ఖర్చు తగ్గించవచ్చు అనేది తర్కించుకుంటూ లెక్కలు వేస్తున్నారట. ఇంతవరకు షూటింగ్ జరగకపోవడం ఈ చిత్రానికి ప్లస్ అవుతోంది.
దీనివల్ల లొకేషన్స్, సెట్స్ దగ్గర్నుంచి అన్నిటినీ రీప్లాన్ చేసుకునే సౌకర్యం కుదిరింది. అయితే ఈ చిత్రానికి అవసరమయిన అటవీ నేపథ్యంకి సంబంధించిన సన్నివేశాలను ఎక్కడ తీయాలనేది ఇంకా కచ్చితంగా ఫిక్స్ అవలేదని తెలిసింది.
This post was last modified on June 27, 2020 2:03 am
ఈ వారం కొత్త రిలీజులకే జనం వస్తారో రారోననే అనుమానాలు నెలకొంటే మే 10 ఆర్ఆర్ఆర్ రీ రిలీజ్ చేయబోతున్నారు.…
పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. విజయం కోసం.. మెగా కుటుంబం రోడ్డెక్కిన విషయం…
ఎన్నికలు ఇంకో వారం రోజుల్లో జరగనుండగా ఏపీ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా ఏపీ అధికారి పార్టీని…
కెరీర్ మొదలుపెట్టి సంవత్సరాలు గడుతున్నా ఒక పెద్ద బ్రేక్ దక్కించుకుని టాప్ లీగ్ లోకి వెళ్లిపోవాలనే ప్లాన్ లో ఉన్న…
ఇంకో మూడు రోజుల్లో విడుదల కావాల్సిన ప్రతినిధి 2కి కష్టాల పరంపర కొనసాగతూనే ఉన్నట్టు ఫిలిం నగర్ టాక్. నారా…
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…