నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’ విడుదలకు ముస్తాబైపోయింది. ఇంకో రెండు రోజుల్లోనే ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో విడుదల ముంగిట అత్యంత ముఖ్యమైన తంతుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లో గురువారం ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటం విశేషం.
రెండు రోజుల ముందే ఈ సమాచారం బయటికి వచ్చింది కానీ.. తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి బుధవారమే ఈ వేడుక జరగాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కు కుదరకపోవడం వల్లే ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్తో పవన్ కళ్యాణ్ బంధం చాలా ఏళ్ల ముందే మొదలైంది. ఆ బేనర్లో ఓ సినిమా చేయడానికి పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరుగుతోంది.
రెండేళ్ల కిందట ఈ బేనర్లో పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీని అనౌన్స్ చేశారు. కానీ పవన్ వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా లేటవుతోంది. దీని వల్ల మైత్రీ వాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు అడిగేసరికి ఈ సాయం చేయడానికి పవన్ ముందుకు వచ్చినట్లున్నారు. అలాగే ఈ వేడుక ద్వారా ఆ సినిమా పరంగా పవన్ నుంచి ఏదైనా హామీ లభిస్తుందేమో అని కూడా మైత్రీ వాళ్లు చూస్తుండొచ్చు. ఇక ఈ వేడుకకు పవన్ రావడంలో మరో కోణం కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కారును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాక.. ఆ దిశగా గొంతు కలిపింది టాలీవుడ్ హీరోల్లో ఒక్క నాని మాత్రమే. దీని వల్ల అతను చాలా ఇబ్బంది పడ్డాడు కూడా. ఈ నేపథ్యంలో అతడికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా పవన్ ఈ వేడుకకు అతిథిగా వస్తుండొచ్చు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ నానీని బాగా ఓన్ చేసుకోవచ్చు. కానీ నాని వెనుక పవన్ ఉండడం వల్ల ఈ యంగ్ హీరోను ఏపీ ప్రభుత్వం, వైకాపా వర్గీయులు మరింతగా టార్గెట్ చేస్తారేమో, ఆన్ లైన్-ఆఫ్ లైన్లో సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారేమో అన్న భయాలు కూడా కలుగుతున్నాయి. చూడాలి ఏమవుతుందో మరి.
This post was last modified on June 8, 2022 9:28 pm
నిన్న విడుదలైన ఎపిక్ మీద సోషల్ మీడియా లోపలా బయటా మిక్స్డ్ టాక్ నడుస్తున్న మాట వాస్తవం. ఈ విషయాన్ని…
ఇంస్టాగ్రామ్ రీల్స్ చూస్తున్నారు.. ఫేస్ బుక్ వెతుకుతున్నారు.. సిగ్నల్ సింబల్ గిర్రున తిరుగుతోంది కానీ రీల్స్ ముందుకు జరగడం లేదు.…
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి కోల్ కతాలోని కాళీ ఘాట్ ఆలయంలో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించిన చేపల కూర…
సహజంగా ఏ కేసులో అయినా.. నిందితులు లేదా అనుమానితులను పోలీసులు ప్రశ్నిస్తారు. ముందు మాటలతో.. తర్వాత తమదైన లాఠీ శైలితోనూ…
ఒక ఊరు నుంచి మరో ఊరుకు జాతీయ రహదారి(హైవే)పై ప్రయాణించే సమయంలో టోల్ గేట్లు దాటడం తప్పనిసరి. ఈ టోల్…
నేచురల్ స్టార్ నాని అంటే ఒకప్పుడు బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్లకు కేరాఫ్ అడ్రస్. ఎక్కువగా ఫ్యామిలీ టచ్ ఉన్న…