నేచురల్ స్టార్ నాని కొత్త సినిమా ‘అంటే సుందరానికీ’ విడుదలకు ముస్తాబైపోయింది. ఇంకో రెండు రోజుల్లోనే ఈ చిత్రం థియేటర్లలోకి దిగబోతోంది. ఈ నేపథ్యంలో విడుదల ముంగిట అత్యంత ముఖ్యమైన తంతుకు రంగం సిద్ధమైంది. ఈ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్కు ముహూర్తం ఖరారైంది. హైదరాబాద్లో గురువారం ఈ వేడుకను నిర్వహించనున్నారు. ఈ వేడుకకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరు కాబోతుండటం విశేషం.
రెండు రోజుల ముందే ఈ సమాచారం బయటికి వచ్చింది కానీ.. తాజాగా అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. నిజానికి బుధవారమే ఈ వేడుక జరగాల్సి ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్కు కుదరకపోవడం వల్లే ఒక రోజు వాయిదా వేయాల్సి వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్తో పవన్ కళ్యాణ్ బంధం చాలా ఏళ్ల ముందే మొదలైంది. ఆ బేనర్లో ఓ సినిమా చేయడానికి పవన్ అడ్వాన్స్ తీసుకున్నాడు. ఐతే ఆ ప్రాజెక్టు పట్టాలెక్కడంలో చాలా ఆలస్యం జరుగుతోంది.
రెండేళ్ల కిందట ఈ బేనర్లో పవన్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ మూవీని అనౌన్స్ చేశారు. కానీ పవన్ వేరే కమిట్మెంట్ల వల్ల ఈ సినిమా లేటవుతోంది. దీని వల్ల మైత్రీ వాళ్లు బాగా ఇబ్బంది పడుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్లు అడిగేసరికి ఈ సాయం చేయడానికి పవన్ ముందుకు వచ్చినట్లున్నారు. అలాగే ఈ వేడుక ద్వారా ఆ సినిమా పరంగా పవన్ నుంచి ఏదైనా హామీ లభిస్తుందేమో అని కూడా మైత్రీ వాళ్లు చూస్తుండొచ్చు. ఇక ఈ వేడుకకు పవన్ రావడంలో మరో కోణం కూడా ఉంది.
ఆంధ్రప్రదేశ్లో టికెట్ల ధరల విషయంలో పవన్ కళ్యాణ్ జగన్ సర్కారును తీవ్ర స్థాయిలో దుయ్యబట్టాక.. ఆ దిశగా గొంతు కలిపింది టాలీవుడ్ హీరోల్లో ఒక్క నాని మాత్రమే. దీని వల్ల అతను చాలా ఇబ్బంది పడ్డాడు కూడా. ఈ నేపథ్యంలో అతడికి మోరల్ సపోర్ట్ ఇవ్వడానికి కూడా పవన్ ఈ వేడుకకు అతిథిగా వస్తుండొచ్చు. ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ నానీని బాగా ఓన్ చేసుకోవచ్చు. కానీ నాని వెనుక పవన్ ఉండడం వల్ల ఈ యంగ్ హీరోను ఏపీ ప్రభుత్వం, వైకాపా వర్గీయులు మరింతగా టార్గెట్ చేస్తారేమో, ఆన్ లైన్-ఆఫ్ లైన్లో సినిమాను దెబ్బ తీసే ప్రయత్నం చేస్తారేమో అన్న భయాలు కూడా కలుగుతున్నాయి. చూడాలి ఏమవుతుందో మరి.
This post was last modified on June 8, 2022 9:28 pm
సినీ పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పలేమని సీనియర్ దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ స్పష్టం చేశారు. ఇటీవల…
బరామతి విమాన ప్రమాదంలో దుర్మరణం చెందిన మహారాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి అజిత్ పవార్ స్థానాన్ని ఇప్పుడు ఆయన భార్య సునేత్ర…
తన సొంత నియోజకవర్గం కుప్పాన్ని ప్రయోగశాలగా మార్చనున్నట్టు సీఎం చంద్రబాబు తెలిపారు. తాజాగా శుక్రవారం రాత్రి తన నియోజకవర్గానికి వచ్చిన…
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ విషయంలో తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పంతం నెగ్గలేదు. తనను ఎర్రవెల్లిలోని తన ఫామ్…
రామ్ చరణ్ కొత్త సినిమా ‘పెద్ది’కి సెట్స్ మీదికి వెళ్లే సమయంలో రిలీజ్ డేట్ ఖరారు చేశారు. ఈ ఏడాది…
వీణవంకలో సమ్మక్క-సారలమ్మ జాతరలో మొక్కులు చెల్లించుకునేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తన కుటుంబ సభ్యులు, మహిళా సర్పంచ్…