రేపు భార్యాభర్తలు కాబోతున్న నయనతార విజ్ఞేశ్ శివన్ ల వివాహ వేడుక కోసం అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. పరిమిత అతిథుల మధ్య మహాబలిపురంలో జరగబోయే ఈ పెళ్లి గురించి కొన్నాళ్ల పాటు ముచ్చట్లు కొనసాగేలా ఉన్నాయి. ఇదిలా ఉండగా ఇలా దర్శకుడిని హీరోయిన్లు పెళ్లి చేసుకోవడమనేది గతంలో ఉందానే ఆసక్తి ప్రేక్షకుల్లో కలగడం సహజం. అవేంటో చూద్దాం.
ప్రస్తుత ఏపి మంత్రి ఒకప్పటి హీరోయిన్ రోజా శ్రీవారు ఆర్కె సెల్వమణి గురించి ఇప్పటి యూత్ కి అంతగా ఐడియా లేకపోవచ్చు కానీ ఆయనకు ఒకప్పుడు 90 దశకంలో విజయ్ కాంత్ కి కెప్టెన్ ప్రభాకర్, పోలీస్ అధికారి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన ట్రాక్ రికార్డు ఉంది. చామంతి తీస్తున్న టైంలో ఇద్దరికీ ప్రేమ మొదలైంది. ఇది ఎంతగా అంటే రోజా సమరం సినిమాని కోట్ల రూపాయల బడ్జెట్ తో తీసేంత దాకా వెళ్ళింది.
అది డిజాస్టర్ అవ్వడం, తీవ్ర నష్టాలు రావడం వేరే కథ. తర్వాత వీరు పెళ్లి చేసుకుని ఒక్కటయ్యారు. పవన్ కళ్యాణ్ సుస్వాగతం సినిమాలో హీరోయిన్ దేవయాని గుర్తుందిగా. ఇప్పటికీ ఆవిడ తెలుగులో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కొనసాగుతున్నారు.2001లో తమిళంలో తన డెబ్యూ మూవీ సూరియవంశం దర్శకుడు రాజకుమారన్ ని సుదీర్ఘమైన లవ్ స్టోరీ తర్వాత వివాహం చేసుకున్నారు.
వెంకటేష్ కలియుగ పాండవులుతో హీరోయిన్ గా పరిచయమైన ఖుష్బూ స్టాలిన్, అజ్ఞాతవాసి లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు చేయడం చూశాం. ఈవిడ భర్త సి సుందర్ ప్రముఖ దర్శకులు. రజనీకాంత్ బ్లాక్ బస్టర్ అరుణాచలం తీసింది తనే. సుందర్ మొదటి సినిమా మురై మామన్ లో ఖుష్బూనే హీరోయిన్. లెజెండరీ డైరెక్టర్ కె భాగ్యరాజ్ ని పెళ్లాడింది అప్పటి కథానాయిక పూర్ణిమనే. ఇక మణిరత్నం సుహాసిని జంట గురించి తెలియని వారు ఉంటారా. మంచి ఫామ్ లో ఉన్న టైంలోనే ముడి వేసుకున్నారు. కనులు కనులను దోచాయంటే దర్శకుడు దేసింగ్ పెరియస్వామి పెళ్లాడిన నిరంజని కూడా ఆ సినిమాలోని కీలకమైన ఆర్టిస్ట్ కావడం ఫైనల్ ట్విస్ట్
This post was last modified on June 8, 2022 7:33 pm
చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డికి పెద్ద చిక్కొచ్చి పడింది. ఈవీఎంలో ఆయన గుర్తు 2వ నెంబర్…
దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి తీసిన ఓ సినిమాలో నటించిన రోజా.. రంగుపడుద్ది అనే డైలాగుతో అలరించారు. అయితే..ఇప్పుడు ఆమెకు నిజంగానే…
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…