రేపు ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ రాకతో ఆ సినిమాకు ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరగడం ఖాయం. కాకపోతే గత కొంత కాలంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల ప్రస్తావన తేకుండా మాట్లాడలేకపోతున్న పవన్ ఇప్పుడీ వేదిక మీద ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
అందులోనూ టికెట్ రేట్ల వివాదం చెలరేగినప్పుడు నాని కూడా అప్పట్లో కొన్ని కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంత ట్రోలింగ్ ని కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. అదంతా గతం. ఇప్పుడూ నాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోలేదు కానీ విపరీత ధరలకు టికెట్లు అమ్మడం గురించి తప్పనే చెప్పడం విశేషం.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మాములు పరిస్థితులు నెలకొన్నాయి. ఏపిలో ప్రత్యేకమైన సినిమాలకు తప్ప ఎలాంటి పెంపులు ఇవ్వడం లేదు. కాబట్టి ఎఫ్3, అంటే సుందరంలు రెగ్యులర్ రేట్లకే వెళ్లాయి. ఎటొచ్చి తెలంగాణలో మాత్రమే ఇదింకా నానుతూనే ఉంది. ఒక పద్ధతి ప్రకారం లేని హైక్స్ థియేటర్ ఫుట్ ఫాల్స్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇదంతా ఎలా ఉన్నా పవన్ నాని గురించి సినిమా గురించి మాత్రమే మాట్లాడే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టైంలో అవసరానికి మించిన ఆవేశానికి పోవడం ఎలాంటి ఇబ్బందులను సృష్టించిందో తనకు తెలియంది కాదు. అందులోనూ అంటే సుందరం మెగా ఫ్యామిలీ మూవీ కాదు. ఇది దృష్టిలో ఉంచుకునే ప్రసంగం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. మైత్రితో ఎప్పటి నుంచో ఒక సినిమా బాకీ ఉన్న పవన్ అదెప్పుడు తీరుస్తాడో తెలియడం లేదు. సుజిత్ తో ఏదో తమిళ రీమేకని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు
This post was last modified on June 8, 2022 3:29 pm
గత పది రోజులుగా తమిళనాడు రాజకీయాలు దేశవ్యాప్తంగా ఎంత చర్చనీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…
ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…
నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…
కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీలకు కేరళలో తీవ్రనిరసన సెగ తగులుతోంది. రాహుల్-ప్రియాంక.. కేరళ మిమ్మల్ని క్షమించదు.…
నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…
కేంద్ర హోం శాఖ సహాయం మంత్రి బండి సంజయ్ తనయుడు బండి భగీరథ్ పై పోక్సో కేసు నమోదైన సంగతి…