రేపు ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ రాకతో ఆ సినిమాకు ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరగడం ఖాయం. కాకపోతే గత కొంత కాలంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల ప్రస్తావన తేకుండా మాట్లాడలేకపోతున్న పవన్ ఇప్పుడీ వేదిక మీద ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
అందులోనూ టికెట్ రేట్ల వివాదం చెలరేగినప్పుడు నాని కూడా అప్పట్లో కొన్ని కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంత ట్రోలింగ్ ని కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. అదంతా గతం. ఇప్పుడూ నాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోలేదు కానీ విపరీత ధరలకు టికెట్లు అమ్మడం గురించి తప్పనే చెప్పడం విశేషం.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మాములు పరిస్థితులు నెలకొన్నాయి. ఏపిలో ప్రత్యేకమైన సినిమాలకు తప్ప ఎలాంటి పెంపులు ఇవ్వడం లేదు. కాబట్టి ఎఫ్3, అంటే సుందరంలు రెగ్యులర్ రేట్లకే వెళ్లాయి. ఎటొచ్చి తెలంగాణలో మాత్రమే ఇదింకా నానుతూనే ఉంది. ఒక పద్ధతి ప్రకారం లేని హైక్స్ థియేటర్ ఫుట్ ఫాల్స్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇదంతా ఎలా ఉన్నా పవన్ నాని గురించి సినిమా గురించి మాత్రమే మాట్లాడే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టైంలో అవసరానికి మించిన ఆవేశానికి పోవడం ఎలాంటి ఇబ్బందులను సృష్టించిందో తనకు తెలియంది కాదు. అందులోనూ అంటే సుందరం మెగా ఫ్యామిలీ మూవీ కాదు. ఇది దృష్టిలో ఉంచుకునే ప్రసంగం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. మైత్రితో ఎప్పటి నుంచో ఒక సినిమా బాకీ ఉన్న పవన్ అదెప్పుడు తీరుస్తాడో తెలియడం లేదు. సుజిత్ తో ఏదో తమిళ రీమేకని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు
This post was last modified on June 8, 2022 3:29 pm
కరణం బలరామకృష్ణమూర్తి.. రాజకీయ ఉద్ధండుడిగా పేరొందిన ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన నేత. కుమారుడు కరణం వెంకటేష్ను ఎమ్మెల్యేగా చూసుకోవాలన్న…
నియోజకవర్గాల పునర్విభజన అనూహ్య పరిణామాల నేపథ్యంలో అలా వెనక్కెళ్లిపోయింది. దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాలకు తీరని అన్యాయం అంటూ కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా…
బ్లాక్ బస్టర్ సినిమాల వెనుక కొన్ని వేల మంది కష్టం దాగి ఉంటుంది. కాకపోతే ప్రేక్షకులకది అనవసరం. థియేటర్ లో…
ప్రతి నెల ఒకటో తారీకు కోసం ఉద్యోగులు ఎదురు చూడడం సహజం. కారణం నెలంతా కష్టపడితే జీవితాలు అకౌంట్ లో…
తెలంగాణలో కొత్త పార్టీ పెట్టేందుకు రెడీ అయిన మాజీ సీఎం, బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్.. తనయ కవిత.. నిన్న…
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల సంఘం నిబంధనల మేరకు మంగళవారం సాయంత్రం 5 గంటలకే అన్ని పార్టీలు..…