రేపు ‘అంటే సుందరానికి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ముఖ్యఅతిథిగా పవన్ కళ్యాణ్ రాకతో ఆ సినిమాకు ఆల్రెడీ ఉన్న బజ్ మరింత పెరగడం ఖాయం. కాకపోతే గత కొంత కాలంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో రాజకీయాల ప్రస్తావన తేకుండా మాట్లాడలేకపోతున్న పవన్ ఇప్పుడీ వేదిక మీద ఎలాంటి స్పీచ్ ఇవ్వబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ ఉంది.
అందులోనూ టికెట్ రేట్ల వివాదం చెలరేగినప్పుడు నాని కూడా అప్పట్లో కొన్ని కామెంట్స్ చేయడం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కొంత ట్రోలింగ్ ని కూడా ఎదురుకోవాల్సి వచ్చింది. అదంతా గతం. ఇప్పుడూ నాని తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోలేదు కానీ విపరీత ధరలకు టికెట్లు అమ్మడం గురించి తప్పనే చెప్పడం విశేషం.
ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ వ్యవహారానికి సంబంధించి మాములు పరిస్థితులు నెలకొన్నాయి. ఏపిలో ప్రత్యేకమైన సినిమాలకు తప్ప ఎలాంటి పెంపులు ఇవ్వడం లేదు. కాబట్టి ఎఫ్3, అంటే సుందరంలు రెగ్యులర్ రేట్లకే వెళ్లాయి. ఎటొచ్చి తెలంగాణలో మాత్రమే ఇదింకా నానుతూనే ఉంది. ఒక పద్ధతి ప్రకారం లేని హైక్స్ థియేటర్ ఫుట్ ఫాల్స్ ని బాగా ప్రభావితం చేస్తున్నాయి.
ఇదంతా ఎలా ఉన్నా పవన్ నాని గురించి సినిమా గురించి మాత్రమే మాట్లాడే అవకాశాలున్నాయి. రిపబ్లిక్ టైంలో అవసరానికి మించిన ఆవేశానికి పోవడం ఎలాంటి ఇబ్బందులను సృష్టించిందో తనకు తెలియంది కాదు. అందులోనూ అంటే సుందరం మెగా ఫ్యామిలీ మూవీ కాదు. ఇది దృష్టిలో ఉంచుకునే ప్రసంగం ప్లాన్ చేసుకుని ఉండొచ్చు. మైత్రితో ఎప్పటి నుంచో ఒక సినిమా బాకీ ఉన్న పవన్ అదెప్పుడు తీరుస్తాడో తెలియడం లేదు. సుజిత్ తో ఏదో తమిళ రీమేకని వినిపించింది కానీ ఆ తర్వాత ఎలాంటి చప్పుడు లేదు
This post was last modified on June 8, 2022 3:29 pm
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ ఎన్నికలకు ఇంకో వారమే సమయం ఉంది. ఈ ఎన్నికలు ఇటు అధికార వైఎస్సార్ కాంగ్రెస్కు, అటు ప్రతిపక్ష…
‘ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ ఎంత పెద్ద హిట్టో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. ఇండియాలో అత్యంత ఆదరణ పొందిన…
ఏపీ ప్రభుత్వానికి కేంద్ర ఎన్నికల సంఘం భారీ షాక్ ఇచ్చింది. ముఖ్యంగా జగన్ ప్రబుత్వం అమలు చేస్తున్న పథకాలను ఎన్నికల…
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…