అడవి శేష్ కెరీర్ లోనే టాప్ గ్రాసర్ గా నిలిచిన మేజర్ కమల్ హాసన్ విక్రమ్ పోటీని తట్టుకుని మరీ మంచి వసూళ్లు రాబడుతోంది. కమర్షియల్ అంశాలు లేని రియలిస్టిక్ డ్రామా అయినప్పటికీ దేశభక్తి మేళవించిన ఈ నిజ జీవిత గాధ ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని బాగా ఆకట్టుకుంటోంది. కలెక్షన్లు స్టడీగా ఉన్నాయి. విక్రమ్ వల్ల ఇతర రాష్ట్రాల్లో కొంత ప్రభావం ఉన్నప్పటికీ ఏపి తెలంగాణలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు ఇవ్వడం ఖాయమని అర్థమైపోయింది. అయితే ఇక్కడో అంశం గమనించాలి.
మేజర్ కు మహేష్ బాబు నిర్మాణ భాగస్వామి కావడం ప్రమోషన్ పరంగా చాలా ప్లస్ అయ్యింది. నిజాయితీ ఉన్న ప్రయత్నం కావడంతో రిలీజ్ కు ముందు నుంచే మహేష్ చొరవ తీసుకుని మరీ ప్రత్యేకంగా వీడియో షూట్లలో పాల్గొన్నాడు. తన సినిమాకు తప్ప ఇంకెవరికీ ఇంటర్వ్యూలు ఇవ్వని తన శైలిని పక్కనపెట్టి మేజర్ టీమ్ తో ముఖాముఖీ చేశాడు.
దాన్ని రెండో వారంలో వదలడం మంచి మార్కెటింగ్ ఎత్తుగడ. తొమ్మిరోజుల ముందే ప్రీ రిలీజ్ ప్రీమియర్లు వేయడంతో మొదలుపెట్టి పబ్లిసిటీ ప్లాన్లన్నీ పక్కాగా అమలు చేశారు. ఇంత పెద్ద స్టార్ డం ఉన్న హీరో అండగా ఉంటే ఫలితాలు ఆశించిన దానికన్నా గొప్పగా వస్తాయని చెప్పడానికి ఇంతకన్నా ఉదాహరణ అక్కర్లేదు.
ప్రత్యేకంగా మహేష్ ఫ్యాన్స్ విడుదలకు ముందే మేజర్ ని ఓన్ చేసుకున్నారు. సర్కారు వారి పాట రన్నింగ్ లో ఉన్నా సరే దీని ప్రచారానికి ఎలాంటి లోటు రాకుండా సోషల్ మీడియాలో తోడ్పడ్డారు. ఫైనల్ గా పాజిటివ్ టాక్ రావడంతో మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ వెండితెర మీద కూడా విజయం సాధించాడు. ఇప్పుడీ స్ఫూర్తితోనే జిఎంబి సంస్థ మరిన్ని ప్రాజెక్టులు రెడీ చేయనుంది.
This post was last modified on June 7, 2022 8:55 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…