రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు ఉడుగుల తెరకెక్కించిన ‘విరాట పర్వం’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది . ఇప్పటి వరకూ ఈ సినిమాకు ఊహించిన బజ్ లేదు. కానీ ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. సోషల్ మీడియాలో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఉన్నపళంగా ‘విరాటపర్వం’ హాట్ టాపిక్ అయింది. ఇక కర్నూల్ లో ఈవెంట్ నిర్వహించడం అక్కడ వర్షంలో తడుస్తూ సాయి పల్లవి మాట్లాడుతుంటే రానా గొడుగు పట్టుకోవడం విజువల్ కూడా వైరల్ అయింది.
‘విరాట పర్వం’ చాలా నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ముందుగా జులై 1న రిలీజ్ అనుకొని ప్రకటించారు. కానీ ఇప్పుడు జూన్ 17 న స్లాట్ ఖాళీగా ఉండటంతో వెంటనే ప్రీ పోన్ చేసుకొని ముందుకొచ్చారు. ఇక ట్రైలర్ తో సినిమాపై బజ్ తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. త్వరలోనే టీం ఇంకా భారీ ఎత్తున ప్రమోషన్ చేయబోతున్నారట.
‘నీది నాది ఒకే కథ’ లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమా తీసి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న వేణు ఉడుగుల నుండి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో కొన్ని కారణాల వల్ల వర్క్ ఆగుతూ వచ్చింది. తర్వాత రిలీజ్ డేట్ కుదరక వాయిదా పడుతూ ఇప్పుడు ఫైనల్ గా 17న రాబోతుంది. మరి వరుస అపజయాలతో సతమవుతున్న రానా సాయి పల్లవితో కలిసి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో లెట్స్ వైట్ అండ్ సీ.
This post was last modified on June 6, 2022 3:48 pm
రాజమండ్రిలో నిర్వహించిన కూటమి పార్టీల(జనసేన-బీజేపీ-టీడీపీ) ఎన్నికల ప్రచార సభ 'ప్రజాగళం'లో చంద్రబాబు పాల్గొన లేక పోయారు. ఆయన వేరే సభలో…
మాములుగా కమెడియన్లు హీరోలు కావడం గతంలో ఎన్నో చూశాం. చూస్తున్నాం. కానీ మధ్యవయసు దాటిన క్యారెక్టర్ ఆర్టిస్టులు కథానాయకులుగా మారడం…
ఏపీలో డబుల్ ఇంజన్ సర్కారు రానుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అన్నారు. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమే కేంద్రంలోనూ…
ఆంధ్రప్రదేశ్లో కొన్ని వారాల నుంచి ఎన్నికల కమిషన్ కొరఢా ఝళిపిస్తూ ఉంది. ఎన్నికల సమయంలో తమ పరిధి దాటి వ్యవహరిస్తున్న…
కుర్ర హీరోల్లో వేగంగా మార్కెట్ పడిపోయిన వాళ్ళలో రాజ్ తరుణ్ పేరు మొదటగా చెప్పుకోవాలి. కెరీర్ ప్రారంభంలో కుమారి 21…
ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్.. గత ఏడాది ఏపీలో జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి చట్టం. ఇప్పుడీ చట్టం ఎన్నికల ముంగిట…