రానా, సాయి పల్లవి కాంబినేషన్ లో వేణు ఉడుగుల తెరకెక్కించిన ‘విరాట పర్వం’ ఎట్టకేలకు థియేటర్స్ లోకి రాబోతుంది . ఇప్పటి వరకూ ఈ సినిమాకు ఊహించిన బజ్ లేదు. కానీ ట్రైలర్ సినిమాపై ఎక్స్ పెక్టేషన్స్ పెంచేసింది. సోషల్ మీడియాలో ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ దక్కింది. దీంతో ఉన్నపళంగా ‘విరాటపర్వం’ హాట్ టాపిక్ అయింది. ఇక కర్నూల్ లో ఈవెంట్ నిర్వహించడం అక్కడ వర్షంలో తడుస్తూ సాయి పల్లవి మాట్లాడుతుంటే రానా గొడుగు పట్టుకోవడం విజువల్ కూడా వైరల్ అయింది.
‘విరాట పర్వం’ చాలా నెలలుగా పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది. ముందుగా జులై 1న రిలీజ్ అనుకొని ప్రకటించారు. కానీ ఇప్పుడు జూన్ 17 న స్లాట్ ఖాళీగా ఉండటంతో వెంటనే ప్రీ పోన్ చేసుకొని ముందుకొచ్చారు. ఇక ట్రైలర్ తో సినిమాపై బజ్ తీసుకురావడంలో మేకర్స్ సక్సెస్ అయ్యారు. త్వరలోనే టీం ఇంకా భారీ ఎత్తున ప్రమోషన్ చేయబోతున్నారట.
‘నీది నాది ఒకే కథ’ లాంటి మంచి ఫీల్ గుడ్ సినిమా తీసి దర్శకుడిగా గుర్తింపు అందుకున్న వేణు ఉడుగుల నుండి చాలా గ్యాప్ తర్వాత వస్తున్న సినిమా ఇది. పోస్ట్ ప్రొడక్షన్ స్టేజిలో కొన్ని కారణాల వల్ల వర్క్ ఆగుతూ వచ్చింది. తర్వాత రిలీజ్ డేట్ కుదరక వాయిదా పడుతూ ఇప్పుడు ఫైనల్ గా 17న రాబోతుంది. మరి వరుస అపజయాలతో సతమవుతున్న రానా సాయి పల్లవితో కలిసి ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో లెట్స్ వైట్ అండ్ సీ.
This post was last modified on June 6, 2022 3:48 pm
అమెరికాలో ఉంటున్న తెలుగు అమ్మాయి, ఇన్ఫ్లుయెన్సర్ (పికు నెమలి) సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో…
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత త్వరలోనే కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. పార్టీ పేరు,…
దక్షిణాది చిత్ర పరిశ్రమలో ఇప్పుడు భాషా పరమైన సరిహద్దులు చెరిగిపోతున్నాయి. ఒకప్పటిలా కాకుండా టాలీవుడ్ కు చెందిన అగ్ర నిర్మాణ…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుట్టినరోజు వస్తుందంటే సోషల్ మీడియాలో రచ్చ మామూలుగా ఉండదు. ఏప్రిల్ 8వ తేదీ కోసం…
హైదరాబాద్ లో మాదక ద్రవ్యాల వినియోగం అంతకంతకూ పెరుగుతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా గురువారం అర్ధరాత్రి నగరంలో జరుగుతున్న ఓ…
టాలీవుడ్ మరో మంచి ఫ్రైడే కోసం ఎదురు చూస్తున్న టైంలో కంటెంట్ నమ్ముకున్న రెండు సినిమాలు ఇవాళ థియేటర్లలో అడుగు…