స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు తమ ఫ్యామిలీ మూలపురుషులతో కలిసి నటించడం వాటి మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టేసుకోవడం సహజమే. కాకపోతే అధిక సందర్భాల్లో ఇవి నిరాశ కలిగించే ఫలితాలనే ఇచ్చాయి. మొన్నామధ్య వచ్చిన ఆచార్యలో చిరంజీవి చరణ్ కలిసి డాన్స్ చేసినా లాభం లేకపోయింది. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబులు కలిసి వంశీ చేస్తే అదీ తేడా కొట్టింది. ఎన్టీఆర్ బాలకృష్ణలు కలిసి చేసినవాటిలో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ. ఏఎన్ఆర్ నాగ్ కాంబోలోనూ అంతే.
పైన చెప్పిన ఏ కలయికకు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు లేవు. దానవీరశూరకర్ణ, మనం లాంటి కొన్నింటిని మినహాయించవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఆది పురుష్. ఇందులో కృష్ణం రాజు ఓ కీలక పాత్ర చేశారనే టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో బిర్లా ఓ మోస్తరుగా ఆడగా రెబెల్ ఘోరంగా దెబ్బ తింది. ఇక రాధే శ్యామ్ సంగతి సరేసరి. పెద్దాయనని ఇబ్బంది పెట్టడమే కాదు అంత కష్టపడినా కూడా కనీసం యావరేజ్ ఫలితం కూడా దక్కినంత దారుణంగా ఫెయిల్ అయ్యింది.
ఆది పురుష్ లో సీత తండ్రి మిథిలాధిపతి జనకుడిగా కృష్ణంరాజుగారు కనిపిస్తారని టాక్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ నుంచి అందుతున్న సమాచారం నమ్మదగినదే. ఓం రౌత్ దర్శకత్వంలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రామాయణ ఆధారిత గ్రాండియర్ కి సంబంధించిన కనీసం ఫస్ట్ లుక్ ఇప్పటిదాకా విడుదల కాలేదు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదు. టాకీ పార్ట్ అయితే పూర్తి చేశారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉన్నాయట మరి.
This post was last modified on June 6, 2022 3:42 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఏ చిన్న అవకాశాన్నీ వదలట్లేదా? అంటే.. ఔననే సమాధానమే వస్తోంది. పెట్టుబడులకు ఎక్కడ అవకాశం ఉంటే..…
ప్రేక్షకులను థియేటర్లకు వచ్చేలా చేయడం చిన్న సినిమాల నిర్మాతలకు దినదిన గండంగా మారిపోయింది. ఆడియన్స్ అభిరుచులు మారిపోయాయో లేక ఓటిటిల…
మ్యూజిక్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ వచ్చే మార్చి 21 హైదరాబాద్ లో లైవ్ కన్సర్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. గచ్చిబౌలి…
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో శాసన సభను బాయ్కాట్ చేసిన వైసీపీ ప్రజాప్రతినిధులు శాసన మండలిలో మాత్రం చిందులు తొక్కుతున్నారు.…
తనతో కలిసి సినిమాలు చేసేవాళ్లకు ప్రభాస్ విందు భోజనాలతో ఎలా సర్ప్రైజ్ చేయిస్తుంటాడో కథలు కథలుగా చెబుతుంటారు. హైదరాబాద్లో షూటింగ్స్…
ఏపీని రాజకీయంగా కుదిపేస్తున్న తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది.…