స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు తమ ఫ్యామిలీ మూలపురుషులతో కలిసి నటించడం వాటి మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టేసుకోవడం సహజమే. కాకపోతే అధిక సందర్భాల్లో ఇవి నిరాశ కలిగించే ఫలితాలనే ఇచ్చాయి. మొన్నామధ్య వచ్చిన ఆచార్యలో చిరంజీవి చరణ్ కలిసి డాన్స్ చేసినా లాభం లేకపోయింది. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబులు కలిసి వంశీ చేస్తే అదీ తేడా కొట్టింది. ఎన్టీఆర్ బాలకృష్ణలు కలిసి చేసినవాటిలో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ. ఏఎన్ఆర్ నాగ్ కాంబోలోనూ అంతే.
పైన చెప్పిన ఏ కలయికకు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు లేవు. దానవీరశూరకర్ణ, మనం లాంటి కొన్నింటిని మినహాయించవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఆది పురుష్. ఇందులో కృష్ణం రాజు ఓ కీలక పాత్ర చేశారనే టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో బిర్లా ఓ మోస్తరుగా ఆడగా రెబెల్ ఘోరంగా దెబ్బ తింది. ఇక రాధే శ్యామ్ సంగతి సరేసరి. పెద్దాయనని ఇబ్బంది పెట్టడమే కాదు అంత కష్టపడినా కూడా కనీసం యావరేజ్ ఫలితం కూడా దక్కినంత దారుణంగా ఫెయిల్ అయ్యింది.
ఆది పురుష్ లో సీత తండ్రి మిథిలాధిపతి జనకుడిగా కృష్ణంరాజుగారు కనిపిస్తారని టాక్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ నుంచి అందుతున్న సమాచారం నమ్మదగినదే. ఓం రౌత్ దర్శకత్వంలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రామాయణ ఆధారిత గ్రాండియర్ కి సంబంధించిన కనీసం ఫస్ట్ లుక్ ఇప్పటిదాకా విడుదల కాలేదు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదు. టాకీ పార్ట్ అయితే పూర్తి చేశారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉన్నాయట మరి.
This post was last modified on June 6, 2022 3:42 pm
వరద భయం లేకుండా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో అమరావతి నగరాన్ని నిర్మిస్తున్నట్లు కూటమి ప్రభుత్వం హామీ ఇస్తోంది. మరోవైపు అమరావతి…
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…