స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు తమ ఫ్యామిలీ మూలపురుషులతో కలిసి నటించడం వాటి మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టేసుకోవడం సహజమే. కాకపోతే అధిక సందర్భాల్లో ఇవి నిరాశ కలిగించే ఫలితాలనే ఇచ్చాయి. మొన్నామధ్య వచ్చిన ఆచార్యలో చిరంజీవి చరణ్ కలిసి డాన్స్ చేసినా లాభం లేకపోయింది. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబులు కలిసి వంశీ చేస్తే అదీ తేడా కొట్టింది. ఎన్టీఆర్ బాలకృష్ణలు కలిసి చేసినవాటిలో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ. ఏఎన్ఆర్ నాగ్ కాంబోలోనూ అంతే.
పైన చెప్పిన ఏ కలయికకు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు లేవు. దానవీరశూరకర్ణ, మనం లాంటి కొన్నింటిని మినహాయించవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఆది పురుష్. ఇందులో కృష్ణం రాజు ఓ కీలక పాత్ర చేశారనే టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో బిర్లా ఓ మోస్తరుగా ఆడగా రెబెల్ ఘోరంగా దెబ్బ తింది. ఇక రాధే శ్యామ్ సంగతి సరేసరి. పెద్దాయనని ఇబ్బంది పెట్టడమే కాదు అంత కష్టపడినా కూడా కనీసం యావరేజ్ ఫలితం కూడా దక్కినంత దారుణంగా ఫెయిల్ అయ్యింది.
ఆది పురుష్ లో సీత తండ్రి మిథిలాధిపతి జనకుడిగా కృష్ణంరాజుగారు కనిపిస్తారని టాక్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ నుంచి అందుతున్న సమాచారం నమ్మదగినదే. ఓం రౌత్ దర్శకత్వంలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రామాయణ ఆధారిత గ్రాండియర్ కి సంబంధించిన కనీసం ఫస్ట్ లుక్ ఇప్పటిదాకా విడుదల కాలేదు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదు. టాకీ పార్ట్ అయితే పూర్తి చేశారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉన్నాయట మరి.
కొందరు స్టార్ హీరోయిన్లు కెరీర్ మంచి ఊపులో కొనసాగుతున్న టైంలోనే వ్యక్తిగత జీవితంలో సెటిల్ అవ్వాలని చూస్తుంటారు. ఈ క్రమంలో…
మొన్నామధ్య విడుదలైన యాక్షన్ కింగ్ అర్జున్ డబ్బింగ్ సినిమా 'బ్లాస్ట్ జోన్' తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఆడింది. ప్రమోషన్లు పెద్దగా…
పవన్ కళ్యాణ్ స్వయంగా ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను పోస్ట్ చేశారు. ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్తో పాటు కనిపిస్తున్నది…
సోషల్ మీడియాలో ఇప్పుడో టాపిక్ హాట్ డిస్కషన్ గా మారింది. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రేక్షకుడు బుక్ మై…
ఏపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారిన గాదె సాయికృష్ణ అదృశ్యం కేసులో ట్విస్టుల మీద ట్విస్టులు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ…
వైసీపీ కీలక నేత, మాజీ మంత్రి, కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రెడ్డి ప్రస్తుతం వెంటిలేటర్ పై ఉన్నారు.…