స్టార్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన హీరోలు తమ ఫ్యామిలీ మూలపురుషులతో కలిసి నటించడం వాటి మీద అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టేసుకోవడం సహజమే. కాకపోతే అధిక సందర్భాల్లో ఇవి నిరాశ కలిగించే ఫలితాలనే ఇచ్చాయి. మొన్నామధ్య వచ్చిన ఆచార్యలో చిరంజీవి చరణ్ కలిసి డాన్స్ చేసినా లాభం లేకపోయింది. అప్పుడెప్పుడో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ బాబులు కలిసి వంశీ చేస్తే అదీ తేడా కొట్టింది. ఎన్టీఆర్ బాలకృష్ణలు కలిసి చేసినవాటిలో హిట్లు తక్కువ ఫ్లాపులు ఎక్కువ. ఏఎన్ఆర్ నాగ్ కాంబోలోనూ అంతే.
పైన చెప్పిన ఏ కలయికకు ఆల్ టైం బ్లాక్ బస్టర్లు లేవు. దానవీరశూరకర్ణ, మనం లాంటి కొన్నింటిని మినహాయించవచ్చు. ఇప్పుడీ ప్రస్తావన రావడానికి కారణం ఆది పురుష్. ఇందులో కృష్ణం రాజు ఓ కీలక పాత్ర చేశారనే టాక్ అభిమానులను కొంత ఆందోళనకు గురి చేస్తోంది. గతంలో బిర్లా ఓ మోస్తరుగా ఆడగా రెబెల్ ఘోరంగా దెబ్బ తింది. ఇక రాధే శ్యామ్ సంగతి సరేసరి. పెద్దాయనని ఇబ్బంది పెట్టడమే కాదు అంత కష్టపడినా కూడా కనీసం యావరేజ్ ఫలితం కూడా దక్కినంత దారుణంగా ఫెయిల్ అయ్యింది.
ఆది పురుష్ లో సీత తండ్రి మిథిలాధిపతి జనకుడిగా కృష్ణంరాజుగారు కనిపిస్తారని టాక్. ఇంకా అఫీషియల్ గా చెప్పలేదు కానీ లీకైన సోర్స్ నుంచి అందుతున్న సమాచారం నమ్మదగినదే. ఓం రౌత్ దర్శకత్వంలో 500 కోట్లకు పైగా బడ్జెట్ తో రూపొందుతున్న ఈ రామాయణ ఆధారిత గ్రాండియర్ కి సంబంధించిన కనీసం ఫస్ట్ లుక్ ఇప్పటిదాకా విడుదల కాలేదు. 2023 సంక్రాంతికి సినిమా రిలీజ్ చేయడం మీద కూడా క్లారిటీ లేదు. టాకీ పార్ట్ అయితే పూర్తి చేశారు కానీ విజువల్ ఎఫెక్ట్స్ పనులు చాలా ఉన్నాయట మరి.
రామ్ చరణ్ టాప్ స్టార్ అయిపోయాడు. చిరంజీవి ఫుల్ హ్యాపీ. పెద్ది సక్సెస్ మీట్ లో ఏకంగా న్యూ ఏజ్…
లెనిన్ సూపర్ హిట్టయిపోయింది. బ్లాక్ బస్టర్ దారిలో ఉంది. పదేళ్లకు పైగా విజయం కోసం మొహం వాచిపోయిన అఖిల్ అభిమానులకు…
సినిమాల్లో వేషం కోసం చెన్నయ్ వెళ్లారు.. అభిమాన హీరోని కలిసి ఎందుకు హైదరాబాదు వెళ్లారు.. అనే వార్తలను తరచూ వింటూ…
పోలవరం ప్రాజెక్టును ఆరు నూరైనా పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు శపథం చేశారు. గోదావరి జిల్లాల్లో పర్యటనకు వచ్చిన ఆయన…
అక్కినేని నాగార్జున కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న 100వ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. కానీ…
జూనియర్ ఎన్టీఆర్.. రాజకీయ రంగ ప్రవేశంపై తరచుగా ప్రచారం జరుగుతూనే ఉంది. ఆయనకు అను కూలంగా ఏపీలోనూ కొన్ని ప్రాంతాల్లో…