అదేంటో మెగా ఫ్యాన్స్ ఎంత డిస్ కనెక్ట్ చేసుకున్నా ఆచార్య తాలూకు నీలినీడలు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చేసింది కదా ఇక దాంతో పని లేదనుకుంటే ఏదో ఒక బ్యాడ్ రికార్డు వచ్చి పడి వాళ్ళ మనసులను గాయపరుస్తోంది. సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ భారీగా ప్రమోట్ చేస్తున్న ఆచార్య కేవలం రెండు వారాలకే చాలా చోట్ల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా థియేటర్ కు సంబంధించి గుర్తుపెట్టుకోకూడని రెండు మైలురాళ్లు వచ్చి చేరాయి.
ఖైదీతో స్టార్ డం వచ్చాక చిరంజీవి ఏ సినిమా అయినా సరే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మినిమమ్ 50 రోజులు ఆడేది. చివరిసారిగా లీస్ట్ రన్ వచ్చింది 1986లో రిలీజైన ధైర్యవంతుడుకి. హైదరాబాద్ వెంకటేష్ 70ఎంఎం థియేటర్లో 22 రోజులు ఆడించాక తీసేశారు. షిఫ్ట్ ఉంది కానీ కౌంట్ కాదు. ఆ తర్వాత ఇంకే మెగా మూవీకి అంత తక్కువ రన్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం కర్నూల్ జిల్లా ఆదోని సత్యం టాకీస్ లో మాత్రమే 35 రోజులు ఆడి మేజర్ వచ్చాక వెళ్లిపోయింది.
అంటే 1986 నుంచి 2022 మధ్యలో ఏ చిరంజీవి సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఇన్ని తక్కువ రోజులు ఆడలేదు. ఇదొక్కటే కాదు. కథ ఇంకా ఉంది. చిరంజీవి 50 రోజులు కూడా ఆడని మూవీ చివరిసారి వచ్చింది 1988లో రిలీజైన రుద్రవీణ. ఆ తర్వాత కొన్ని డిజాస్టర్లు వచ్చినప్పటికీ కనీసం ఏదో ఒక సింగిల్ సెంటర్లో అర్ధశతదినోత్సవం జరుపుకున్నవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆచార్య ఎక్కడా ఫిఫ్టీ డేస్ ఆడకుండా రుద్రవీణ ప్లేస్ ని తీసుకుంది. ఇలా ఒకేసారి రెండు మర్చిపోవాల్సిన రికార్డులు రావడం ఫ్యాన్స్ కి బాధేగా..
This post was last modified on June 3, 2022 6:24 pm
ఎన్నికలు అనగానే నాయకుల్లో మార్పులు సహజం. మరీ ముఖ్యంగా ప్రధాన మంత్రినరేంద్ర మోడీ అయితే.. మరింత ఎక్కువగా శ్రద్ధ తీసుకుంటారు.…
ఒకప్పుడు టాలీవుడ్లో తిరుగులేని ఆధిపత్యం చలాయించిన కథానాయికల్లో తమన్నా ఒకరు. టీనేజీలోనే కథానాయిక అవతారం ఎత్తిన ఆమె పదేళ్లకు పైగానే టాప్…
థియేటర్, ఓటిటి మధ్య ఖచ్చితంగా ఎనిమిది వారాల గ్యాప్ ఉండాలనే నిబంధన మీద దక్షిణాది ఇండస్ట్రీ పెద్దలు చాలా సీరియస్…
అధికారంలోకి రావడానికి ముందు వరకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి చాలా ఫెరోషియస్గా కనిపించేవారు. అవినీతి కేసుల వ్యవహారం పక్కన పెడితే…
‘బాహుబలి’ సినిమాకు బాలీవుడ్ నుంచి అప్పట్లో ఎంత గొప్ప సహకారం అందిందో తెలిసిందే. కరణ్ జోహార్ లాంటి అగ్ర నిర్మాత ఆ…
మోనాలిసా.. గత ఏడాది సోషల్ మీడియాను ఒక ఊపు ఊపేసిన పేరిది. ఉత్తర్ప్రదేశ్లో జరిగిన మహా కుంభమేళాతో వెలుగులోకి వచ్చిన…