అదేంటో మెగా ఫ్యాన్స్ ఎంత డిస్ కనెక్ట్ చేసుకున్నా ఆచార్య తాలూకు నీలినీడలు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చేసింది కదా ఇక దాంతో పని లేదనుకుంటే ఏదో ఒక బ్యాడ్ రికార్డు వచ్చి పడి వాళ్ళ మనసులను గాయపరుస్తోంది. సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ భారీగా ప్రమోట్ చేస్తున్న ఆచార్య కేవలం రెండు వారాలకే చాలా చోట్ల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా థియేటర్ కు సంబంధించి గుర్తుపెట్టుకోకూడని రెండు మైలురాళ్లు వచ్చి చేరాయి.
ఖైదీతో స్టార్ డం వచ్చాక చిరంజీవి ఏ సినిమా అయినా సరే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మినిమమ్ 50 రోజులు ఆడేది. చివరిసారిగా లీస్ట్ రన్ వచ్చింది 1986లో రిలీజైన ధైర్యవంతుడుకి. హైదరాబాద్ వెంకటేష్ 70ఎంఎం థియేటర్లో 22 రోజులు ఆడించాక తీసేశారు. షిఫ్ట్ ఉంది కానీ కౌంట్ కాదు. ఆ తర్వాత ఇంకే మెగా మూవీకి అంత తక్కువ రన్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం కర్నూల్ జిల్లా ఆదోని సత్యం టాకీస్ లో మాత్రమే 35 రోజులు ఆడి మేజర్ వచ్చాక వెళ్లిపోయింది.
అంటే 1986 నుంచి 2022 మధ్యలో ఏ చిరంజీవి సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఇన్ని తక్కువ రోజులు ఆడలేదు. ఇదొక్కటే కాదు. కథ ఇంకా ఉంది. చిరంజీవి 50 రోజులు కూడా ఆడని మూవీ చివరిసారి వచ్చింది 1988లో రిలీజైన రుద్రవీణ. ఆ తర్వాత కొన్ని డిజాస్టర్లు వచ్చినప్పటికీ కనీసం ఏదో ఒక సింగిల్ సెంటర్లో అర్ధశతదినోత్సవం జరుపుకున్నవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆచార్య ఎక్కడా ఫిఫ్టీ డేస్ ఆడకుండా రుద్రవీణ ప్లేస్ ని తీసుకుంది. ఇలా ఒకేసారి రెండు మర్చిపోవాల్సిన రికార్డులు రావడం ఫ్యాన్స్ కి బాధేగా..
This post was last modified on June 3, 2022 6:24 pm
ప్రపంచకప్ గెలిచిన భారత అంధ మహిళల క్రికెట్ జట్టుకు కెప్టెన్గా వ్యవహరించిన దీపిక, తమ గ్రామానికి ఇప్పటికీ సరైన రహదారి…
ఏపీ సీఎం చంద్రబాబును ఆ పార్టీ నాయకులు ఒకే కోణంలో చూస్తున్నారా? బాబుకు రెండో కోణం కూడా ఉందన్న విషయాన్ని…
గుంటూరు ఎంపీ అదే విధంగా కేంద్ర మంత్రిగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖరకు సీఎం చంద్రబాబు కీలక బాధ్యతలు అప్పగించారు. రెండు…
కేంద్రంలోని బిజెపి తమకు తోడుగా ఉంటుందని లేదా వచ్చే ఎన్నికలనాటికీ తమతో కలిసి వస్తుందన్న ఆశల్లో వైసిపి ఉంది. ఈ…
భారత రాష్ట్రసమితి(బీఆర్ఎస్).. ఈ పేరుకు పెద్ద ప్రాభవమే ఉంది. ఒక్కొక్కపార్టీకి నాయకుల పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ, బీఆర్ఎస్ కు…
సెంటిమెంటుకు-రాజకీయాలకు మధ్య సయామీ కవలలకు ఉన్నంత బంధం ఉంటుంది. సో.. సెంటిమెంటును కాదని నాయకులు రాజకీయాలు చేయగలరా? సాధ్యంకాదు. సో..…