అదేంటో మెగా ఫ్యాన్స్ ఎంత డిస్ కనెక్ట్ చేసుకున్నా ఆచార్య తాలూకు నీలినీడలు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చేసింది కదా ఇక దాంతో పని లేదనుకుంటే ఏదో ఒక బ్యాడ్ రికార్డు వచ్చి పడి వాళ్ళ మనసులను గాయపరుస్తోంది. సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ భారీగా ప్రమోట్ చేస్తున్న ఆచార్య కేవలం రెండు వారాలకే చాలా చోట్ల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా థియేటర్ కు సంబంధించి గుర్తుపెట్టుకోకూడని రెండు మైలురాళ్లు వచ్చి చేరాయి.
ఖైదీతో స్టార్ డం వచ్చాక చిరంజీవి ఏ సినిమా అయినా సరే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మినిమమ్ 50 రోజులు ఆడేది. చివరిసారిగా లీస్ట్ రన్ వచ్చింది 1986లో రిలీజైన ధైర్యవంతుడుకి. హైదరాబాద్ వెంకటేష్ 70ఎంఎం థియేటర్లో 22 రోజులు ఆడించాక తీసేశారు. షిఫ్ట్ ఉంది కానీ కౌంట్ కాదు. ఆ తర్వాత ఇంకే మెగా మూవీకి అంత తక్కువ రన్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం కర్నూల్ జిల్లా ఆదోని సత్యం టాకీస్ లో మాత్రమే 35 రోజులు ఆడి మేజర్ వచ్చాక వెళ్లిపోయింది.
అంటే 1986 నుంచి 2022 మధ్యలో ఏ చిరంజీవి సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఇన్ని తక్కువ రోజులు ఆడలేదు. ఇదొక్కటే కాదు. కథ ఇంకా ఉంది. చిరంజీవి 50 రోజులు కూడా ఆడని మూవీ చివరిసారి వచ్చింది 1988లో రిలీజైన రుద్రవీణ. ఆ తర్వాత కొన్ని డిజాస్టర్లు వచ్చినప్పటికీ కనీసం ఏదో ఒక సింగిల్ సెంటర్లో అర్ధశతదినోత్సవం జరుపుకున్నవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆచార్య ఎక్కడా ఫిఫ్టీ డేస్ ఆడకుండా రుద్రవీణ ప్లేస్ ని తీసుకుంది. ఇలా ఒకేసారి రెండు మర్చిపోవాల్సిన రికార్డులు రావడం ఫ్యాన్స్ కి బాధేగా..
This post was last modified on June 3, 2022 6:24 pm
వెంకటేష్ ఫిల్మోగ్రఫీలో నువ్వు నాకు నచ్చావ్ చాలా ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వచ్చి పాతిక సంవత్సరాలు…
చిన్న హీరోలు వేగంగా ఎక్కువ సినిమాలు చేయడం రెమ్యునరేషన్ పరంగా సంతృప్తినిస్తుందేమో కానీ కెరీర్ పరంగా ఒక్కోసారి ఇదే పెద్ద…
స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి బీఆర్ఎస్ తరఫున గత ఎన్నికల్లో గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్కు మద్దతుగా వ్యవహరిస్తూ…
నైజాంలో చాలా ఏళ్ల నుంచి డిస్ట్రిబ్యూషన్లో దిల్ రాజే కింగ్. ఆయన ఈ ఏరియాలో నంబర్ వన్ డిస్ట్రిబ్యూటర్గా ఎదిగాక..…
వచ్చే వారం ది కేరళ స్టోరీ 2 విడుదల కానుంది. మూడేళ్ళ క్రితం వచ్చిన మొదటి భాగం ఎంత సంచలనం…
రాజకీయ పార్టీలు ఓట్ల కోసం కురిపిస్తున్న ఉచితాల ఆఫర్లపై దేశ సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. కేవలం…