అదేంటో మెగా ఫ్యాన్స్ ఎంత డిస్ కనెక్ట్ చేసుకున్నా ఆచార్య తాలూకు నీలినీడలు చేదు జ్ఞాపకాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. ఓటిటిలో వచ్చేసింది కదా ఇక దాంతో పని లేదనుకుంటే ఏదో ఒక బ్యాడ్ రికార్డు వచ్చి పడి వాళ్ళ మనసులను గాయపరుస్తోంది. సోషల్ మీడియాలో అమెజాన్ ప్రైమ్ భారీగా ప్రమోట్ చేస్తున్న ఆచార్య కేవలం రెండు వారాలకే చాలా చోట్ల థియేట్రికల్ రన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే. కానీ ఊహించని విధంగా థియేటర్ కు సంబంధించి గుర్తుపెట్టుకోకూడని రెండు మైలురాళ్లు వచ్చి చేరాయి.
ఖైదీతో స్టార్ డం వచ్చాక చిరంజీవి ఏ సినిమా అయినా సరే హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా మినిమమ్ 50 రోజులు ఆడేది. చివరిసారిగా లీస్ట్ రన్ వచ్చింది 1986లో రిలీజైన ధైర్యవంతుడుకి. హైదరాబాద్ వెంకటేష్ 70ఎంఎం థియేటర్లో 22 రోజులు ఆడించాక తీసేశారు. షిఫ్ట్ ఉంది కానీ కౌంట్ కాదు. ఆ తర్వాత ఇంకే మెగా మూవీకి అంత తక్కువ రన్ రాలేదు. కట్ చేస్తే ఇప్పుడు ఆచార్య రెండు తెలుగు రాష్ట్రాలు కలిపి కేవలం కర్నూల్ జిల్లా ఆదోని సత్యం టాకీస్ లో మాత్రమే 35 రోజులు ఆడి మేజర్ వచ్చాక వెళ్లిపోయింది.
అంటే 1986 నుంచి 2022 మధ్యలో ఏ చిరంజీవి సినిమా డైరెక్ట్ రిలీజ్ లో ఇన్ని తక్కువ రోజులు ఆడలేదు. ఇదొక్కటే కాదు. కథ ఇంకా ఉంది. చిరంజీవి 50 రోజులు కూడా ఆడని మూవీ చివరిసారి వచ్చింది 1988లో రిలీజైన రుద్రవీణ. ఆ తర్వాత కొన్ని డిజాస్టర్లు వచ్చినప్పటికీ కనీసం ఏదో ఒక సింగిల్ సెంటర్లో అర్ధశతదినోత్సవం జరుపుకున్నవి ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడు ఆచార్య ఎక్కడా ఫిఫ్టీ డేస్ ఆడకుండా రుద్రవీణ ప్లేస్ ని తీసుకుంది. ఇలా ఒకేసారి రెండు మర్చిపోవాల్సిన రికార్డులు రావడం ఫ్యాన్స్ కి బాధేగా..
This post was last modified on June 3, 2022 6:24 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…