Movie News

OTTలో సర్కారు – షాక్ ఇచ్చేశారు

కలెక్షన్లకు కాస్త ఊపు తీసుకొద్దామని సర్కారు వారి పాటలో మురారివా పాటను జోడిస్తున్నారు కానీ అది మరీ అద్భుతాలు చేసే సీన్ ఉండకపోవచ్చు. దీని సంగతి పక్కనపెడితే కొన్ని ప్రధాన కేంద్రాలు మినహాయిస్తే ఇప్పుడీ మూవీ ఫైనల్ రన్ కు దగ్గరగా వచ్చేసింది. చాలా చోట్ల వసూళ్లు పడిపోయాయి. రెండు వారాలు మంచి జోష్ తో హడావిడి కనిపించినప్పటికీ థర్డ్ వీక్ నుంచి మైత్రి సైతం పబ్లిసిటీ దూకుడు తగ్గించేసింది. మేజర్, విక్రమ్, సామ్రాట్ పృథ్విరాజ్ లాంటి కొత్త చిత్రాలు వస్తుండటంతో ఇంతకన్నా ఆశించలేం.

ఇప్పుడందరి చూపు సర్కారు వారి పాట ఓటిటి ప్రీమియర్ మీద ఉంది. ఈ రోజు నుంచే అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ మొదలుపెట్టేశారు. అయితే ఇక్కడో ట్విస్ట్ ఉందండోయ్. కొద్దిరోజుల పాటు రెంటల్ పద్ధతిలో అదేనండి పే పర్ వ్యూ మోడల్ లో అందుబాటులో ఉంచారు. కెజిఎఫ్ చాఫ్టర్ 2కి ఇలాగే చేసిన సంగతి తెలిసిందే. 199 రూపాయలు కట్టేసి రెండు రోజుల్లో చూడాలనే కండీషన్ మీద సోషల్ మీడియాలో నెటిజెన్లు భగ్గుమన్నప్పటికీ ప్రైమ్ అదేమీ పట్టించుకోలేదు. దీనికి కూడా అదే కొనసాగిస్తున్నారు.

మహేష్ సినిమా క్రేజ్ కాబట్టి ఎందరు డబ్బులు కట్టి చూస్తారో మరి. దీని తర్వాత ప్రైమ్ సభ్యులకు ఫ్రీ స్ట్రీమింగ్ జూలై మొదటి వారం నుంచి ఉండొచ్చు. ఇప్పుడీ రిలీజ్ కి ప్రత్యేకంగా పబ్లిసిటీ గట్రా చేయకుండా సైలెంట్ గా వదలడం గమనార్హం. ఎక్స్ ట్రా డబ్బులు తీసుకోని కారణంగానే ఆర్ఆర్ఆర్ నెట్ ఫ్లిక్స్, జీ5లో వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తోంది. ఏది ఏమైనా ఈ రెంటల్ మోడల్ ని భారతీయులకు అలవాటు చేయడానికి ప్రైమ్ ఫిక్స్ అయిపోయింది. మిగిలిన ఓటిటిలు కూడా ఇదే ఫాలో అయితే జేబుకు చిల్లులే.

This post was last modified on June 2, 2022 1:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

ప్రీమియర్ రేట్లు నిర్ణయించుకున్న పెద్ది ?

జూన్ 4 విడుదల కాబోతున్న పెద్ది కోసం ఎదురు చూపులు మాములుగా లేవు. రెండు నెలలుగా డ్రైగా ఉన్న బాక్సాఫీస్…

11 seconds ago

త‌మిళ రాజ‌కీయాల్లో పుష్ప సోఫా రచ్చ

గ‌త ప‌ది రోజులుగా త‌మిళనాడు రాజ‌కీయాలు దేశ‌వ్యాప్తంగా ఎంత చ‌ర్చ‌నీయాంశం అవుతున్నాయో తెలిసిందే. ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా టీవీకే…

34 minutes ago

చిరంజీవి దగ్గరికి వెళ్తే ఏమవుతుంది

ఇవాళ జరిగిన టాలీవుడ్ ప్రొడ్యూసర్ల సమావేశంలో నిర్మాత నాగవంశీ ఒక మాటన్నారు. ఒకవేళ ఈ సమస్య పరిష్కారం కాకుండా పెద్దిని…

2 hours ago

పెద్దిని వద్దనుకుంటే ఎవరికి నష్టం

నైజామ్ సింగల్ స్క్రీన్ పర్సెంటేజ్ వివాదం ముదిరిపోతోంది. నిన్న శిరీష్, సునీల్ నారంగ్ తదితరులు నిర్వహించిన ఎగ్జిబిటర్ల ప్రెస్ మీట్…

3 hours ago

“రాహుల్-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు!“

కాంగ్రెస్ పార్టీ అగ్ర‌నేత‌లు.. ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీల‌కు కేర‌ళలో తీవ్ర‌నిర‌స‌న సెగ త‌గులుతోంది. రాహుల్‌-ప్రియాంక‌.. కేర‌ళ మిమ్మ‌ల్ని క్ష‌మించ‌దు.…

3 hours ago

పవన్ చెప్తే చేస్తాడండోయ్

నిజమేనండోయ్… జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఏదైనా మాట ఇచ్చారంటే దానిని నెరవేర్చి తీరతారు. ఇందుకు…

4 hours ago