రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటివలే తేజ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. ముందు నుండి ప్రచారంలో ఉన్న ‘అహింస’ టైటిలే పెట్టుకొని ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదొచ్చి చాలా రోజులవుతుంది కానీ ఇంత వరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. షూటింగ్ స్టేజిలోనే సినిమా ఆగిపోయిందా ? అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకలకు కలుగుతున్నాయి.
తేజ డైరెక్షన్ లో సినిమా అంటే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఉదయం ఏడింటికి మొదటి షాట్ పెట్టేస్తాడు. తనకున్న ఎక్స్ పీరియన్స్ తో టకటకా సీన్స్ తీసేస్తాడు. ఎక్కడా సమయం వృదా కాకుండా చూసుకుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే తేజ సినిమా అంటే డిలె ఉండదు. అందుకే అతని మేకింగ్ స్టైల్ గురించి చాలా మంది చెప్పుకుంటారు. అలాంటి తేజ సినిమా మొదటి సారి నెలలు తరబడి షూటింగ్ స్టేజిలోనే ఉండటమే ‘అహింస’ పై సందేహం కలిగిస్తుంది.
నిజానికి దగ్గుబాటి అభిరామ్ కాస్త డిఫరెంట్ అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఎప్పుడూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడని అతని చుట్టూ ఉండేవారు అంటుంటారు. అలాంటి వ్యక్తి తేజ డైరెక్షన్ లో సినిమా చేయడం అంటే కాస్త కష్టమే మరి.
తేజ నటుల నుండి డిసిప్లెన్ కోరుకుంటాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ ఏదైనా అతన్ని స్ట్రిక్ట్ చేస్తాడు. సెట్స్ లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు సహించడు. సినిమాకు సంబంధించి ఇంకా ఫైనల్ షెడ్యుల్ ఉంది. మరి ఆఖరి షెడ్యుల్ దగ్గర ఈ సినిమా ఎందుకు ఆగింది ? అభిరాం తేజని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ? వీరిద్దరికి సింక్ అవ్వలేదా ? తెలియాల్సి ఉంది.
వైసీపీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం విశాఖపట్నంలో పర్యటించనున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్…
అంతర్గత వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం కనక నిజమయ్యే పక్షంలో రామ్ చరణ్ అభిమానులకు అది గుడ్ న్యూస్ కానుంది.…
అల్లు అర్జున్ హీరోగా లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రాబోతున్న కొత్త సినిమాపై ఇండస్ట్రీలో రకరకాల చర్చలు నడుస్తున్నాయి. సినిమా…
విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది చనిపోగా… ఆరుగురు తీవ్రంగా గాయపడి వేర్వేరు ఆసుపత్రుల్లో…
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు ఎప్పుడు కష్టం వచ్చినా… ఆదుకునేందుకు కర్ణాకట కొత్త సీఎం డీకే శివకుమార్ సదా…
సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు ఒక క్రేజీ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్త హాట్ టాపిక్ గా మారింది. కోలీవుడ్ కు…