రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇటివలే తేజ పుట్టిన రోజు సందర్భంగా టైటిల్ కూడా ఎనౌన్స్ చేశారు. ముందు నుండి ప్రచారంలో ఉన్న ‘అహింస’ టైటిలే పెట్టుకొని ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. అదొచ్చి చాలా రోజులవుతుంది కానీ ఇంత వరకూ ఈ సినిమా గురించి ఎలాంటి అప్ డేట్ లేదు. షూటింగ్ స్టేజిలోనే సినిమా ఆగిపోయిందా ? అనే ప్రశ్నలు కూడా ప్రేక్షకలకు కలుగుతున్నాయి.
తేజ డైరెక్షన్ లో సినిమా అంటే చాలా స్పీడ్ గా ఉంటుంది. ఉదయం ఏడింటికి మొదటి షాట్ పెట్టేస్తాడు. తనకున్న ఎక్స్ పీరియన్స్ తో టకటకా సీన్స్ తీసేస్తాడు. ఎక్కడా సమయం వృదా కాకుండా చూసుకుంటాడు. ఒకరకంగా చెప్పాలంటే తేజ సినిమా అంటే డిలె ఉండదు. అందుకే అతని మేకింగ్ స్టైల్ గురించి చాలా మంది చెప్పుకుంటారు. అలాంటి తేజ సినిమా మొదటి సారి నెలలు తరబడి షూటింగ్ స్టేజిలోనే ఉండటమే ‘అహింస’ పై సందేహం కలిగిస్తుంది.
నిజానికి దగ్గుబాటి అభిరామ్ కాస్త డిఫరెంట్ అని ఇండస్ట్రీలో ఓ టాక్ ఉంది. ఎప్పుడూ లైఫ్ ని ఎంజాయ్ చేస్తుంటాడని అతని చుట్టూ ఉండేవారు అంటుంటారు. అలాంటి వ్యక్తి తేజ డైరెక్షన్ లో సినిమా చేయడం అంటే కాస్త కష్టమే మరి.
తేజ నటుల నుండి డిసిప్లెన్ కోరుకుంటాడు. హీరో బ్యాక్ గ్రౌండ్ ఏదైనా అతన్ని స్ట్రిక్ట్ చేస్తాడు. సెట్స్ లో పిచ్చి పిచ్చి వేషాలు వేస్తే అస్సలు సహించడు. సినిమాకు సంబంధించి ఇంకా ఫైనల్ షెడ్యుల్ ఉంది. మరి ఆఖరి షెడ్యుల్ దగ్గర ఈ సినిమా ఎందుకు ఆగింది ? అభిరాం తేజని ఏమైనా ఇబ్బంది పెట్టాడా ? వీరిద్దరికి సింక్ అవ్వలేదా ? తెలియాల్సి ఉంది.
This post was last modified on June 2, 2022 9:19 pm
బాలకృష్ణ - కొరటాల శివ కాంబినేషన్ సినిమా ఫిక్సయిపోయింది. వచ్చే వారమే పూజా కార్యక్రమాలతో ఓపెనింగ్ జరగనుందని సమాచారం. అయితే…
వైసీపీ అధినేత జగన్ శుక్రవారం నుంచి యూరప్ పర్యటనకు వెళ్తున్నారు. దాదాపు 20 రోజులకు పైగానే ఆయన రాష్ట్రానికి దూరంగా…
తెలంగాణలో రెండు రోజుల క్రితం మొదలైన ఆర్టీసీ కార్మికుల సమ్మె అప్పుడే రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న ప్రధాన…
బాలకృష్ణ కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడు అత్యంత భారీ బడ్జెట్ తో తీసిన సినిమా నిప్పురవ్వ. దానికైన ఖర్చు గురించి…
70, 80, 90 దశకాల్లో ప్రపంచ వ్యాప్తంగా సంగీత ప్రియులను ఒక ఊపు ఊపిన లెజెండరీ మ్యుజీషియన్ మైకేల్ జాక్సన్…
కొత్త సినిమాల సంగతేమో కానీ తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులు డార్లింగ్ వర్షంలో తడిసిపోతున్నారు. ఇవాళ ఏపీ తెలంగాణ వ్యాప్తంగా దీనికొచ్చిన…