దక్షిణాది దర్శకులు బాలీవుడ్ సూపర్ స్టార్లను డైరెక్టర్ చేయడం అరుదే. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ ఆ అరుదైన జాబితాలోనే చేరుతున్నాడు. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్ను అతను డైరెక్ట్ చేయనున్నట్లు కొన్నేళ్ల కిందటే సమాచారం బయటికి వచ్చింది. కానీ ఈ సినిమా అధికారికంగా ఇంకా మొదలే కాలేదు. అట్లీ చివరి సినిమా బిగిల్ రిలీజై మూడేళ్లు కావస్తుండగా.. అప్పట్నుంచి అతను షారుఖ్ సినిమా పని మీదే ఉన్నాడు.
కానీ ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా అయితే అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. వీరి కలయికలో చిత్రానికి జవాన్ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ప్రి టీజర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారట. అది ఒకటిన్నర నిమిషం నిడివి ఉండబోతోందట.
ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో, అలాగే సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జవాన్ అనే టైటిల్ వినగానే ఇందులో హీరో సైనికుడు అయ్యుంటాడని అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం షారుఖ్ సరికొత్త అవతారంలోకి మారబోతున్నాడట. దీని గురించి కూడా క్రేజీ రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని షారుఖ్.. నాలుగేళ్ల కిందట జీరోతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొన్నాక కెరీర్ విషయంలో బాగా ఆలోచనలో పడ్డాడు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకున్నాడు. అందులో ఒకటైన పఠాన్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవలే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో అతను డంకి అనే సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు అట్లీ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 2, 2022 10:52 am
తప్పు ఎవరు చేసినా తప్పే.. అన్న సూత్రాన్ని పాటిస్తున్న టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు.. తన పార్టీవారిని కూడా వదిలి…
మీ వాహనం 2019 ఏప్రిల్ 1వ తేదీకి ముందే తయారైందా? అయితే ఇక ఆలస్యం చేయకండి. పాత వాహనాలకు హై…
ఒక చిన్న నిమిషం టీజర్ తోనే పెద్ది చేసిన పెద్ద రచ్చ మాములుగా లేదు. ఐపీఎల్ సీజన్ లో క్రికెట్…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఎంత సున్నిత మనస్కులో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అదే…
సూపర్ స్టార్ రజనీకాంత్ కెరీర్ లో అతి పెద్ద బ్లాక్ బస్టర్స్ గా చెప్పుకునే సినిమాల్లో బాషా స్థానం చాలా…
2008లో 166 మందిని పొట్టనపెట్టుకున్న ముంబై 26/11 ఉగ్రదాడికి సంబంధించి కీలక నిందితుడైన తహావూర్ హుస్సేన్ రాణా ఎట్టకేలకు భారత్కు…