దక్షిణాది దర్శకులు బాలీవుడ్ సూపర్ స్టార్లను డైరెక్టర్ చేయడం అరుదే. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ ఆ అరుదైన జాబితాలోనే చేరుతున్నాడు. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్ను అతను డైరెక్ట్ చేయనున్నట్లు కొన్నేళ్ల కిందటే సమాచారం బయటికి వచ్చింది. కానీ ఈ సినిమా అధికారికంగా ఇంకా మొదలే కాలేదు. అట్లీ చివరి సినిమా బిగిల్ రిలీజై మూడేళ్లు కావస్తుండగా.. అప్పట్నుంచి అతను షారుఖ్ సినిమా పని మీదే ఉన్నాడు.
కానీ ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా అయితే అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. వీరి కలయికలో చిత్రానికి జవాన్ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ప్రి టీజర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారట. అది ఒకటిన్నర నిమిషం నిడివి ఉండబోతోందట.
ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో, అలాగే సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జవాన్ అనే టైటిల్ వినగానే ఇందులో హీరో సైనికుడు అయ్యుంటాడని అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం షారుఖ్ సరికొత్త అవతారంలోకి మారబోతున్నాడట. దీని గురించి కూడా క్రేజీ రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని షారుఖ్.. నాలుగేళ్ల కిందట జీరోతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొన్నాక కెరీర్ విషయంలో బాగా ఆలోచనలో పడ్డాడు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకున్నాడు. అందులో ఒకటైన పఠాన్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవలే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో అతను డంకి అనే సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు అట్లీ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 2, 2022 10:52 am
జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని ఆశపడ్డ బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గతంలో ఏ చిన్న అవకాశం దొరికినా…
తన 12 మెట్ల కిన్నెర వాయిద్యంతో జాతీయస్థాయిలో గుర్తింపు పొంది రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్ చేతుల మీదుగా పద్మశ్రీ అవార్డు అందుకున్న కిన్నెర మొగులయ్య…
ప్రతి సినిమాకు విభిన్నంగా కొత్తగా ప్రయత్నిస్తున్న సుహాస్ తాజాగా ప్రసన్నవదనంతో థియేటర్లలో అడుగు పెట్టాడు. ఈ ఏడాది అంబాజీపేట మ్యారేజీ…
దర్శకుడు శేఖర్ కమ్ముల సెన్సిటివ్ సినిమాలు తీస్తాడనే పేరే కానీ సీరియస్ సబ్జెక్టులు టచ్ చేస్తే అవుట్ ఫుట్ ఏ…
పీసీసీ అధ్యక్షుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పట్ల కాంగ్రెస్ అధిష్ఠానం ఫుల్ ఖుషీగా ఉందని తెలిసింది. లోక్సభ ఎన్నికల…
తెలంగాణ ప్రధాన ప్రతిపక్షం బీఆర్ ఎస్కు భారీ షాక్ తగిలింది. ప్రస్తుతం బీఆర్ ఎస్ ఎమ్మెల్సీగా ఉన్న దండే విఠల్రావు…