దక్షిణాది దర్శకులు బాలీవుడ్ సూపర్ స్టార్లను డైరెక్టర్ చేయడం అరుదే. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ ఆ అరుదైన జాబితాలోనే చేరుతున్నాడు. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్ను అతను డైరెక్ట్ చేయనున్నట్లు కొన్నేళ్ల కిందటే సమాచారం బయటికి వచ్చింది. కానీ ఈ సినిమా అధికారికంగా ఇంకా మొదలే కాలేదు. అట్లీ చివరి సినిమా బిగిల్ రిలీజై మూడేళ్లు కావస్తుండగా.. అప్పట్నుంచి అతను షారుఖ్ సినిమా పని మీదే ఉన్నాడు.
కానీ ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా అయితే అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. వీరి కలయికలో చిత్రానికి జవాన్ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ప్రి టీజర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారట. అది ఒకటిన్నర నిమిషం నిడివి ఉండబోతోందట.
ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో, అలాగే సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జవాన్ అనే టైటిల్ వినగానే ఇందులో హీరో సైనికుడు అయ్యుంటాడని అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం షారుఖ్ సరికొత్త అవతారంలోకి మారబోతున్నాడట. దీని గురించి కూడా క్రేజీ రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని షారుఖ్.. నాలుగేళ్ల కిందట జీరోతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొన్నాక కెరీర్ విషయంలో బాగా ఆలోచనలో పడ్డాడు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకున్నాడు. అందులో ఒకటైన పఠాన్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవలే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో అతను డంకి అనే సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు అట్లీ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
This post was last modified on June 2, 2022 10:52 am
ఏపీ మాజీ సీఎం జగన్ తన అజ్ఞానపూరితమైన వ్యాఖ్యలతో నిత్యం వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. జగన్ ప్రెస్ మీట్…
సినిమాల్లో డ్యూయల్ రోల్స్ తో మెప్పించిన హీరో విజయ్ ఇప్పుడు రాజకీయ రంగంలోనూ అదే తరహాలో రెండు నియోజకవర్గాల నుంచి…
అమెరికా-ఇరాన్ యుద్ధం ఇప్పుడు కేవలం భూమి, ఆకాశానికే పరిమితం కాకుండా సముద్ర గర్భంలో ఉన్న ఇంటర్నెట్ వ్యవస్థపై కూడా నీలినీడలు…
రోటీన్ కు తగ్గట్లు వ్యవహరిస్తే కిక్ ఏముంటుంది? వినూత్న ఆలోచనలకు వేదికగా హైదరాబాద్ మహానగరం సాగుతోంది. ఇందులో భాగంగా సరికొత్త…
వసూళ్ల లెక్కల్లోనే కాదు చాలా విషయాల్లో దురంధర్ ది రివెంజ్ ఎవరికీ అందని రికార్డులు సొంతం చేసుకుంటోంది. భారతీయ సినీ…
నిన్న జరిగిన బ్యాండ్ మేళం సక్సెస్ మీట్ లో ఎక్కువ శాతం నటీనటులు, దర్శకుడు ఒక పాయింట్ మీద ఫిర్యాదు…