దక్షిణాది దర్శకులు బాలీవుడ్ సూపర్ స్టార్లను డైరెక్టర్ చేయడం అరుదే. ఇప్పుడు తమిళ డైరెక్టర్ అట్లీ ఆ అరుదైన జాబితాలోనే చేరుతున్నాడు. బాలీవుడ్ చరిత్రలోనే బిగ్గెస్ట్ స్టార్లలో ఒకడైన షారుఖ్ ఖాన్ను అతను డైరెక్ట్ చేయనున్నట్లు కొన్నేళ్ల కిందటే సమాచారం బయటికి వచ్చింది. కానీ ఈ సినిమా అధికారికంగా ఇంకా మొదలే కాలేదు. అట్లీ చివరి సినిమా బిగిల్ రిలీజై మూడేళ్లు కావస్తుండగా.. అప్పట్నుంచి అతను షారుఖ్ సినిమా పని మీదే ఉన్నాడు.
కానీ ఈ చిత్రం గురించి ఇప్పటిదాకా అయితే అధికారిక ప్రకటన రాలేదు. ఐతే ఎట్టకేలకు అందుకు ముహూర్తం కుదిరినట్లు సమాచారం. వీరి కలయికలో చిత్రానికి జవాన్ అనే టైటిల్ కూడా ఖరారైనట్లు తెలిసింది. సినిమా చిత్రీకరణ మొదలు కావడానికి ముందే ప్రి టీజర్ ఒకటి రిలీజ్ చేయబోతున్నారట. అది ఒకటిన్నర నిమిషం నిడివి ఉండబోతోందట.
ఈ మేరకు బాలీవుడ్ మీడియాలో, అలాగే సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. జవాన్ అనే టైటిల్ వినగానే ఇందులో హీరో సైనికుడు అయ్యుంటాడని అనిపిస్తోంది. ఈ చిత్రం కోసం షారుఖ్ సరికొత్త అవతారంలోకి మారబోతున్నాడట. దీని గురించి కూడా క్రేజీ రూమర్లు వినిపిస్తున్నాయి. చాలా ఏళ్ల నుంచి సరైన విజయం లేని షారుఖ్.. నాలుగేళ్ల కిందట జీరోతో బాక్సాఫీస్ దగ్గర ఘోర పరాభవం ఎదుర్కొన్నాక కెరీర్ విషయంలో బాగా ఆలోచనలో పడ్డాడు.
రెండేళ్లకు పైగా గ్యాప్ తీసుకుని ఆచితూచి ప్రాజెక్టులు ఎంచుకున్నాడు. అందులో ఒకటైన పఠాన్ చిత్రీకరణ చివరి దశలో ఉంది. ఇటీవలే రాజ్ కుమార్ హిరాని దర్శకత్వంలో అతను డంకి అనే సినిమాను మొదలుపెట్టాడు. ఇప్పుడు అట్లీ సినిమాకు రంగం సిద్ధం చేస్తున్నాడు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుందని ముందు నుంచి ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
నిన్న విడుదలైన మా ఇంటి బంగారంలో మూడు పాత్రలు మహిళా ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయాయి. మొదటి పేరు సమంత అని…
కాపుల విషయంలో ఏం చేయాలన్న అంశంపై వైసీపీ తర్జన భర్జన పడుతోందా? వారితో కలిసి ముందుకు సాగాలా? లేక.. వారిని…
వైసీపీ సీనియర్ నాయకుడు, ఫైర్బ్రాండ్ కొడాలి నానిపై 2021లో నమోదైన కేసు విచారణకు తాజాగా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.…
హీరోయిన్ కంగనా రౌనత్ టైం ఏ మాత్రం బాలేదు. పట్టిందల్లా ప్లాస్టిక్ అన్న తరహాలో ఏ జానర్ సినిమా చేసినా…
తమపై తాత్కాలిక నిషేధం ఎత్తివేయాలని.. ఉద్దేశ పూర్వకంగానే కేంద్ర ప్రభుత్వం తమపై నిషేధం విధించిందని ఆరోపిస్తూ.. టెలిగ్రామ్ ఢిల్లీ హైకోర్టును…
ఏపీ సీఎం చంద్రబాబును విజయవాడలోని కృష్ణలంకకు చెందిన సాయికృష్ణ కుటుంబ సభ్యులు కలిసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మీడియాతో…