కొన్ని రోజుల ముందే సినిమాను ప్రీమియర్స్ అంటూ ప్రేక్షకులకు చూపించడమే రిస్కే. ప్రస్తుతం అందుకే ప్రీమియర్స్ వేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. కానీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అడివి శేష్ ‘మేజర్’ సినిమాతో ప్రీమియర్స్ వేస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద తమకున్న కాన్ఫిడెన్స్ తో కొన్ని రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్.
ముందుగా డిల్లీ నుండి మొదలు పెట్టారు. ఇటివలే వైజాగ్ లో కూడా ఫ్రీ షో వేశారు. మేజర్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసినవారంతా సినిమా బాగుందని పబ్లిసిటీ చేస్తున్నారు. అందరికీ తెలిసినే కథే కావడంతో టీం కూడా ఈ రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు అదే రూట్లో కన్నడ హీరో రక్షిత్ కూడా వెళ్లనున్నాడు. రక్షిత్ హీరోగా డాగ్ సెంటిమెంట్ తో ‘777 చార్లి’ తెరకెక్కింది.
ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సురేష్ ప్రొడక్షన్ బేనర్ పై రానా సమర్పణలో విడుదలవుతుంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాను కూడా మేజర్ లాగే ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. జూన్ 2న డిల్లీ, అమ్రిత్సర్ లలో మొదటి షో పడనుంది. అక్కడ రెండు షోలు వేస్తున్నారు.
ఆ తర్వాత లక్నో , పూనె , త్రివేండ్రం , సోలాపూర్ , చెన్నై , కోల్ కత్తా, మదురై , హైదరబాద్ , వైజాగ్ ఇలా 21 సిటీస్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు. యానిమల్ సెంటిమెంట్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు రక్షిత్ శెట్టి. సినిమాలో ఉన్న ఎమోషన్ ఏ మాత్రం పండినా సినిమా హిట్ అనే భావనతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే మేజర్ లా ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నాడు. మరి ‘777 చార్లి’ కి ప్రీమియర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
This post was last modified on June 2, 2022 8:05 am
ఏపీ సీఎం చంద్రబాబు అధ్యక్షతన రేపు ఏపీ కేబినెట్ భేటీ కానుంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ…
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదు చేయాలని రాష్ట్ర హైకోర్టు గుంటూరు పోలీసులను ఆదేశించింది. ఆమెతోపాటు..…
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, యువ నాయకుడు తీన్మార్ మల్లన్నకు ఆ పార్టీ రాష్ట్ర కమిటీ నోటీసులు జారీ చేసింది.…
అధికారం ఉన్నప్పుడు అతి విశ్వాసం చాలామంది రాజకీయ నేతలకు ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. మరీ ముఖ్యంగా ఏపీ మాజీ సీఎం,…
మాచో స్టార్ గోపీచంద్ బలమైన కంబ్యాక్ కోసం అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. దర్శకుడు శ్రీను వైట్ల విశ్వంతో బ్రేక్…
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…