Movie News

మేజర్ రూట్లోనే ‘777 చార్లి’

కొన్ని రోజుల ముందే సినిమాను ప్రీమియర్స్ అంటూ ప్రేక్షకులకు చూపించడమే రిస్కే. ప్రస్తుతం అందుకే ప్రీమియర్స్ వేయడానికి దర్శక నిర్మాతలు ముందుకు రావడం లేదు. కానీ చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ అడివి శేష్ ‘మేజర్’ సినిమాతో ప్రీమియర్స్ వేస్తున్నాడు. మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ సినిమా మీద తమకున్న కాన్ఫిడెన్స్ తో కొన్ని రోజుల ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నారు మేకర్స్.

ముందుగా డిల్లీ నుండి మొదలు పెట్టారు. ఇటివలే వైజాగ్ లో కూడా ఫ్రీ షో వేశారు. మేజర్ ప్రీమియర్స్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చూసినవారంతా సినిమా బాగుందని పబ్లిసిటీ చేస్తున్నారు. అందరికీ తెలిసినే కథే కావడంతో టీం కూడా ఈ రిస్క్ తీసుకున్నారు. ఇప్పుడు అదే రూట్లో కన్నడ హీరో రక్షిత్ కూడా వెళ్లనున్నాడు. రక్షిత్ హీరోగా డాగ్ సెంటిమెంట్ తో ‘777 చార్లి’ తెరకెక్కింది.

ఈ సినిమా జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.  సురేష్ ప్రొడక్షన్ బేనర్ పై రానా సమర్పణలో విడుదలవుతుంది. ప్రమోషన్స్ కూడా బాగానే చేస్తున్నారు. ట్రైలర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అందుకే ఈ సినిమాను కూడా మేజర్ లాగే ముందే ప్రీమియర్స్ ప్లాన్ చేశారు. జూన్ 2న డిల్లీ, అమ్రిత్సర్ లలో మొదటి షో పడనుంది. అక్కడ రెండు షోలు వేస్తున్నారు.

ఆ తర్వాత లక్నో , పూనె , త్రివేండ్రం , సోలాపూర్ , చెన్నై , కోల్ కత్తా, మదురై , హైదరబాద్ , వైజాగ్ ఇలా 21 సిటీస్ లో ప్రీమియర్స్ వేయబోతున్నారు. యానిమల్ సెంటిమెంట్ డ్రామాతో తెరకెక్కిన ఈ సినిమా మీద చాలా నమ్మకం పెట్టుకున్నాడు రక్షిత్ శెట్టి. సినిమాలో ఉన్న ఎమోషన్ ఏ మాత్రం పండినా సినిమా హిట్ అనే భావనతో ఉన్నాడు. ఆ నమ్మకంతోనే మేజర్ లా ప్రీమియర్స్ ప్లాన్ చేసుకున్నాడు. మరి ‘777 చార్లి’ కి ప్రీమియర్స్ నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.

This post was last modified on June 2, 2022 8:05 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

హిర‌ణ్య క‌శ్య‌ప‌ను వ‌ద‌ల‌ని గుణ‌శేఖర్

హిర‌ణ్య‌క‌శ్య‌ప‌.. టాలీవుడ్లో చాలా ఏళ్ల పాటు చ‌ర్చ‌ల్లో ఉన్న చిత్రం. సీనియ‌ర్ ద‌ర్శ‌కుడు గుణ‌శేఖ‌ర్.. రుద్ర‌మ‌దేవి త‌ర్వాత తీయాల‌నుకున్న సినిమా…

18 minutes ago

పిఠాపురం కోసం ఢిల్లీ వరకు.. కేంద్ర మంత్రులకు పవన్ విజ్ఞాపన

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బుధవారం ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు కేంద్ర…

19 minutes ago

వైసీపీ మాజీ ఎంపీ నుంచే వైసీపీ కార్యకర్తకు బెదిరింపులా?

వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ తన వ్యవహార శైలితో నిత్యం వార్తల్లో నిలుస్తుంటారన్న సంగతి తెలిసిందే. వైసీపీ హయాంలో…

3 hours ago

మొదటి దెబ్బ తిన్న టీం ఇండియా

​విశాఖపట్నం వేదికగా జరిగిన నాలుగో టీ20లో టీమిండియాకు చిక్కెదురైంది. వరుసగా మూడు విజయాలతో జోరు మీదున్న భారత్‌కు న్యూజిలాండ్ షాక్…

6 hours ago

వారి బాధ వర్ణనాతీతం ‘బంగారం’

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు చుక్కలను తాకుతున్నాయి. ఇవాళ మార్కెట్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక…

8 hours ago

తెలంగాణలో మరో కుంభకోణం: హరీష్ రావు

తెలంగాణలో మరో కుంభకోణం జరుగుతోందని బీఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. దీని…

8 hours ago