Movie News

బ్రహ్మస్త్రం వెనుక బ్రహ్మాండమైన ప్లాన్

బాహుబలిని మించే గ్రాండియర్ ని తీయాలని ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్న బాలీవుడ్ దర్శక నిర్మాతలకు అది తీరని కలగా మిగులుతూ వస్తోంది. దాన్ని టార్గెట్ గా పెట్టుకుని తీసినవన్నీ ఫెయిల్ కావడంతో సరైన సమయం కోసం ఎదురు చూస్తున్నారు. సౌత్ నుంచి వర్షంలా కురుస్తున్న ప్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్స్ కు సమాధానంగా బ్రహ్మాస్త్రను చూపిస్తున్నారు.

మూడు భాగాల ఈ సిరీస్ లోని ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 9న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇవాళ వైజాగ్ లో చిన్నపాటి గ్రాండ్ ఈవెంట్ ఒకటి చేశారు. దానికి ముఖ్య అతిథిగా రాజమౌళి హాజరు కాగా హీరో రన్బీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ హాజరయ్యారు. జూన్ 15 ట్రైలర్ రాబోతున్న విషయాన్ని ఇక్కడే ప్రకటించారు.

అంతా బాగానే ఉంది ఉన్నట్టుండి ఇంత దూరం వచ్చి విశాఖపట్నంలో ఈ వేడుక చేయాల్సిన అవసరం ఏమిటనే సందేహం రావడం సహజం. ఇప్పుడీ యూనిట్ చేతిలో కేవలం 80 రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని భాషల్లో ప్రమోషన్లు చేయాలి. ఆడియన్స్ లో హైప్ పెరిగేలా ఓపెనింగ్స్ ని టార్గెట్ చేసుకుని పబ్లిసిటీ వేగం పెంచాలి.

అందులో భాగంగానే ముందు వైజాగ్ నుంచి దీనికి శ్రీకారం చుట్టారు. తెలుగు వెర్షన్ ని సమర్పిస్తున్న జక్కన్న దీని కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎక్కడెక్కడికి వెళ్ళాలి, ఏమేం చేయాలి లాంటి సూచనలన్నీ దగ్గరుండి ఇస్తున్నారట. ఎలాగూ షూటింగు లేక ప్రస్తుతం తగినంత సమయం ఉంది కాబట్టి బ్రహ్మాస్త్రం పార్ట్ వన్ లార్డ్ శివని మోసేందుకు తనవంతు సాయం చేసేందుకు రెడీ అయ్యారు. ఇందులో నాగార్జున కూడా ఓ కీలక పాత్ర చేయడంతో ఇక్కడి బిజినెస్ కి ఇది కూడా కీలకం కాబోతోంది. 

This post was last modified on May 31, 2022 10:44 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

కమ్యూనిస్టులు… మళ్ళీ అదే తప్పిదం

రాజ‌కీయాల్లో అవ‌కాశాలు రావ‌డ‌మే అరుదు. వ‌చ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవ‌స‌రం.. వాటిని ప‌ట్టుకుని ఎద‌గాల్సిన అవ‌స‌రం కూడా పార్టీల‌కు, నాయ‌కుల‌కు…

39 minutes ago

సంచలనాలకు సిద్ధమవుతున్న జన నాయకుడు

తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…

2 hours ago

దృశ్యం 3 ఇక్కడితో ఆగడం లేదా

పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…

2 hours ago

ఇక సీఎం విజయ్ ను ఎవరు ఆపలేరు

త‌మిళ‌నాడు రాజ‌కీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత ప‌రిస్థితి తొలిగిపోయింది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో అతి పెద్ద పార్టీగా అవ‌త‌రించిన…

2 hours ago

ప‌వ‌న్ ఇంటికి ప్ర‌ధాని మోడీ?

దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ.. ఆదివారం హైద‌రాబాద్‌లో ప‌ర్య‌టించ‌నున్నారు. వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ ప‌ర్య‌ట‌న‌లో మ‌రో…

4 hours ago

కొత్తమ్మాయిలపై విరుచుకుపడ్డ ‘బద్రి’ భామ

‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…

5 hours ago