చాన్నాళ్ళుగా వాయిదా పడుతూ థియేటర్స్ ఆ ? ఓటీటీ ఆ ? అనే సందిగ్దం లో ఉన్న రానా ‘విరాట పర్వం’ త్వరలోనే థియేటర్స్ లోకి రాబోతుంది. ఇటివలే జులై 1న రిలీజ్ అంటూ డేట్ కూడా ఎనౌన్స్ చేశారు. కానీ ఉన్నపళంగా ఇప్పుడు ఆ డేట్ మార్చుకొని ఇంకాస్త ముందుకొచ్చారు. జులై 1న రిలీజ్ అవ్వాల్సిన ఈ సినిమాను జూన్ 17న రిలీజ్ చేయబోతున్నారు.
ఈ మేరకు అధికారికంగా ప్రకటన ఇచ్చారు. నిజానికి ఆ డేట్ రవితేజ సినిమాది. జూన్ 17 ‘రామారావు ఆన్ డ్యూటీ’ రిలీజ్ అవ్వాలి. కానీ ఆ సినిమా కొన్ని అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. దీంతో ‘విరాట పర్వం’ ఫస్ట్ కాపీతో రెడీగా ఉన్న సురేష్ బాబు రవితేజ స్లాట్ లో రానా సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు.
ఇక జూన్ 10 న నాని ‘అంటే సుందరానికీ’ సినిమాతో పాటు కన్నడ డబ్బింగ్ సినిమా ‘777 చార్లీ’ రిలీజ్ అవ్వబోతుంది. ఇక రక్షిత్ శెట్టి సినిమా వల్ల తెలుగులో రానా సినిమాకి ఎలాంటి ఎఫెక్ట్ ఉండదు. కానీ నాని సినిమా ఏమాత్రం బాగున్నా ఆ తర్వాతి వారంలో రిలీజయ్యే ‘విరాటపర్వం’ మీద ఆ ఎఫెక్ట్ పడుతుంది.
జూన్ లో స్లాట్ దొరకడంతో సురేష్ బాబు అన్ని విధాల ఆలోచించి ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు. సినిమాలో సాయి పల్లవి కోలో సాంగ్ హిట్ నంబర్ అనిపించుకుంది. టీజర్ , ట్రైలర్ కూడా ఆకట్టుకున్నాయి. మరి రానా ఈ సినిమాతో ఎలాంటి హిట్ అందుకుంటాడో చూడాలి.
This post was last modified on May 30, 2022 9:31 pm
పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…
తెలంగాణలోని సింగిల్ థియేటర్లలో అద్దె విధానానికి స్వస్తి పలికి పర్సంటేజీ పద్ధతిని తీసుకురావాలని ఇక్కడి ఎగ్జిబిటర్లు ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తూ…
తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…
తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…
అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…
తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…