ఏదో అనుకున్నారు కానీ.. అడివి శేష్ మీద ప్రేక్షకుల గురి మామూలుగా లేదు. క్షణం, గూఢచారి, ఎవరు సినిమాలతో అతను జనాల మనసుల్లో బలమైన ముద్రే వేసినట్లున్నాడు. శేష్ సినిమా అంటే ఆషామాషీగా ఉండదని, నిరాశపరిచే అవకాశమే లేదని ప్రేక్షకులు బలంగా నమ్ముతున్నట్లున్నారు. ముంబయి తాజ్ హోటల్లో ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు వదిలిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా శేష్ ప్రధాన పాత్రలో ‘గూఢచారి’ దర్శకుడు శశికిరణ్ తిక్క రూపొందించిన ‘మేజర్’ సినిమాకు ముందు నుంచి పాజిటివ్ బజ్ ఉండగా.. రిలీజ్ ముంగిట అది ఇంకా పెరిగింది.
ట్రైలర్ చూశాక ఇది స్యూర్ షాట్ హిట్ అనిపించింది. ఏం చేసినా చాలా శ్రద్ధగా, సిన్సియర్గా చేస్తాడని పేరు తెచ్చుకున్న శేష్.. తన టీంతో కలిసి సందీప్ కథను వెండితెరపై గొప్పగా ప్రెజెంట్ చేసి ఉంటాడని జనాలు నమ్ముతున్నారు. మామూలుగా ఇలాంటి కథల్లో ఎగ్జాజరేషన్లు ఎక్కువ ఉంటాయి. కానీ శేష్ అండ్ టీం అలా చేసి ఉండదని.. ప్రతి ఒక్కరూ ఎమోషనల్గా కనెక్ట్ అయ్యేలా ఈ కథను చూపించి ఉంటారనే భరోసా అందరిలో కనిపిస్తోంది.
సినిమా మీద ఎంతో నమ్మకం ఉంటే తప్ప విడుదలకు పది రోజుల ముందు నుంచే పెయిడ్ ప్రిమియర్లు మొదలుపెట్టదు చిత్ర బృందం. పుణెతో మొదలుపెట్టి ఒక్కో సిటీలో ప్రిమియర్లు వేస్తుండగా.. అన్ని చోట్లా అద్భుత స్పందన వస్తోంది. ప్రతి సిటీలోనూ ఇలా టికెట్లు పెట్టగానే అలా సోల్డ్ ఔట్ అయిపోతున్నాయి.
హైదరాబాద్లో ముందు ఒక్క ఏఎంబీ సినిమాస్లో మాత్రమే ప్రిమియర్స్ అన్నారు. కానీ జనాల్లో క్రేజ్ చూసి మేజర్ మల్టీప్లెక్సులన్నీ ప్రిమియర్స్ వేస్తున్నాయి. ఇప్పటికే ఆరు షోలకు టికెట్లు పెట్టగా.. బుక్ మై షోలో చకచకా అమ్ముడైపోయి.. సోల్డ్ ఔట్ బోర్డు పెట్టేయాల్సి వచ్చింది. ఈ క్రేజ్ చూసి షోలు ఇంకా పెంచబోతున్నారు. టాక్ తేడా కొట్టే అవకాశమే కనిపించడం లేదు కాబట్టి ‘మేజర్’ బాక్సాఫీస్ దగ్గర అద్భుతాలు చేసే సంకేతాలు కనిపిస్తున్నాయి.
This post was last modified on May 29, 2022 3:38 pm
ఇవాళ విడుదలవుతున్న సినిమాల్లో బాక్ అరణ్మయి 4 ఒకటి. మాములు తమిళ డబ్బింగ్ మూవీ అయితే ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు…
ఏపీలో సార్వత్రిక ఎన్నికలు అంటే..అసెంబ్లీ+పార్లమెంటు ఎన్నికలు ఈ నెల 13న జరగనున్నాయి. అయితే.. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కొన్ని…
మాములుగా ఒక వెబ్ సిరీస్ గురించి సినిమా ప్రేక్షకులు ఎదురు చూడటం తక్కువ. కానీ హీరామండి ఈ విషయంలో తన…
ఇవాళ హరిహర వీరమల్లు కొత్త టీజర్ రిలీజ్ చేసి ఇకపై దర్శకత్వ బాధ్యతలు జ్యోతికృష్ణ చూసుకుంటాడని అధికారికంగా ప్రకటించడం అభిమానుల్లో…
టీడీపీ అధినేత చంద్రబాబు ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆయన విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అటు…
బండ్ల గణేష్ ఆలియాస్ బ్లేడ్ గణేష్. నిజమే ఈ కమేడియన్ పేరు వింటే మొదటగా గుర్తొచ్చేది 7 ఓ క్లాక్…