తొలి సినిమాతో ఎంత పెద్ద విజయం అందుకున్నా.. ఆ తర్వాత కూడా వరుసగా మరి కొన్ని హిట్లు ఇచ్చినా.. ఎల్లకాలం విజయాలతోనే సాగడం మాత్రం దాదాపు అసాధ్యమే. బడా బడా దర్శకులు కూడా కెరీర్లో కాస్త ముందుకెళ్లాక ఫ్లాపులు ఎదుర్కొన్న వారే. టాలీవుడ్లో ఒక్క రాజమౌళి మాత్రమే అపజయమే లేకుండా సాగిపోతున్నాడు. ఆయన కెరీర్లో ఒక్క ‘సై’ మాత్రమే పెద్ద హిట్ కాలేదు. కానీ అది కూడా ఫ్లాప్ అని అనలేం. ఉన్నంతలో బాగానే ఆడింది.
బ్రేక్ ఈవెన్ అయి హిట్ స్టేటస్ అందుకుంది. రాజమౌళికి ముందు, తర్వాత ఇలా సుదీర్ఘ కెరీర్లో అపజయాలు లేకుండా సాగలేకపోయారు. కొరటాల శివ వరుసగా నాలుగు బ్లాక్బస్టర్లు ఇచ్చి రాజమౌళి బాటలో సాగుతున్నట్లు కనిపించాడు కానీ.. ఆయన ట్రాక్ రికార్డును ‘ఆచార్య’ దారుణంగా దెబ్బ తీసింది. అది మెగా డిజాస్టర్ అయింది. ఈ నేపథ్యంలో అందరి కళ్లూ అనిల్ రావిపూడి మీద నిలిచాయి.
‘పటాస్’తో మొదలుపెట్టి.. సుప్రీం, రాజా ది గ్రేట్, ఎఫ్-2 సరిలేరు నీకెవ్వరు.. ఇలా వరుసగా ఐదు సూపర్ హిట్ సినిమాలతో అనిల్ తన ప్రత్యేకతను చాటుకున్నాడు. ఇప్పుడు ‘ఎఫ్-3’ సినిమాతో అతను డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేస్తాడా లేదా అని అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు ఏమంత ఆశాజనకంగా లేకపోవడం, ‘ఎఫ్-3’ మీద బ్రేక్ ఈవెన్ భారం చాలా పెద్దదిగా ఉండడంతో ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో అన్న సందేహాలు కలిగాయి.
ఐతే ‘ఎఫ్-3’లో లాజిక్లు లేకపోయినా కామెడీతో అని మ్యాజిక్ చేయడంతో సినిమాకు శుభారంభం దక్కింది. రివ్యూలు, మౌత్ టాక్ పాజిటివ్గా ఉంది. అలాగే సినిమాకు మంచి ఓపెనింగ్స్ కూడా వచ్చాయి. తొలి రోజుతో పోలిస్తే రెండో రోజు వసూళ్లు ఇంకా మెరుగ్గా ఉండబోతున్నట్లుగా ట్రేడ్ పండిట్లు చెబుతున్నారు. మొత్తంగా చూస్తే సినిమాకు అన్నీ మంచి శకునాలే అన్నట్లుగా ఉంది. కాబట్టి బాక్సాఫీస్ దగ్గర ‘ఎఫ్-3’ సక్సెస్ ఫుల్ సినిమాగా నిలబడడం, అనిల్ డబుల్ హ్యాట్రిక్ పూర్తి చేసి.. రాజమౌళి తర్వాత ఈ ఘనత సాధించిన దర్శకుడిగా ఘనత వహించడం ఖాయంగా కనిపిస్తోంది.
This post was last modified on May 28, 2022 11:17 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…