దాదాపు రెండు దశాబ్దాల పాటు టాలీవుడ్ను ఏలిన నలుగురు నిన్నటి తరం టాప్ స్టార్లలో విక్టరీ వెంకటేష్ ఒకడు. బొబ్బిలి రాజా, ప్రేమించుకుందాం రా, కలిసుందాం రా లాంటి చిత్రాలతో రికార్డులు తిరగరాసిన ఘన చరిత్ర వెంకీ సొంతం. ఓవైపు కుటుంబ కథా చిత్రాలతో అలరిస్తూనే.. ఇంకోవైపు మాస్, యాక్షన్ చిత్రాలతో మెప్పించడం వెంకీకే చెల్లింది.
ఐతే కెరీర్లో ఒక దశ దాటాక వెంకీ ఫ్యామిలీ, కామెడీ చిత్రాలే ఎక్కువగా చేశాడు. అందుక్కారణం.. వెంకీకి కుటుంబ ప్రేక్షకుల్లో ఉన్న తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్. వాళ్లు ఆయన్నుంచి ఆశించేది కూడా ఫ్యామిలీ, కామెడీ ఎంటర్టైనర్లే. ఐతే ఈ జానర్ సినిమలు చేసేటపుడు వెంకీ ఇమేజ్ గురించి, తన మాస్, యూత్ ఫ్యాన్స్ గురించి ఏమాత్రం ఆలోచించడు. ఇమేజ్ ఛట్రం నుంచి పూర్తిగా బయటికి వచ్చి ఒక కమెడియన్ లాగా నవ్వించడానికి ప్రయత్నిస్తాడు.
ఈ క్రమంలో తన మీద తాను జోకులు వేసుకోవడానికి వెనుకాడడు. పాత్రకు తగ్గట్లు ఎంత తగ్గి నటించడానికైనా కూడా సిద్ధంగా ఉంటాడు.కాబట్టే కెరీర్ పీక్స్లో ఉన్న టైంలో కూడా ‘పెళ్ళి కాని ప్రసాద్’ పాత్రలో నటించి మెప్పించగలిగాడు. ఇక కొన్నేళ్ల కిందట ‘ఎఫ్-2’లో భార్యా బాధితుడిగా వెంకీ చేసిన విన్యాసాలు, పండించిన కామెడీని అంత సులువుగా మరిచిపోలేం. దీనికి కొనసాగింపుగా వచ్చిన ‘ఎఫ్-3’లోనూ వెంకీ అతి సామాన్యమైన, అందులోనూ వైకల్యం ఉన్న పాత్ర చేసి మెప్పించాడు. ఇందులో వెంకీ రేచీకటి ఉన్న వ్యక్తిగా నటించడం విశేషం. ఒకప్పుడు బ్రహ్మానందం లాంటి కమెడియన్లు చేసిన క్యారెక్టర్ ఇది. సీనియర్లు కావచ్చు, యంగ్ హీరోలు కావచ్చు. కాస్త ఇమేజ్ ఉన్న హీరోలెవరైనా సరే.. ఇలాంటి పాత్ర చేయాలంటే కాస్త ఆలోచిస్తారు.
కానీ వెంకీ మాత్రం ఎలాంటి శషభిషలు లేకుండా ఆ పాత్రను చేశాడు. రేచీకటి చుట్టూ నడిపిన కామెడీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. నిజానికి దీని చుట్టూ ఇంకా కామెడీ పండించే అవకాశం ఉన్నా కూడా దర్శకుడు అనిల్ రావిపూడి ఆ ప్రయత్నం చేయలేదు. కంటెంట్ పరంగా వీక్ అయినా సరే.. ‘ఎఫ్-3’ పైసా వసూల్ ఎంటర్టైనర్ అనిపించుకుంటోందంటే అందుక్కారణం కచ్చితంగా వెంకీనే. సినిమాలో మిగతా అంశాలు ఎలా ఉన్నా.. వెంకీ పాత్రతో కనెక్ట్ అయితే చాలు సంతృప్తిగా థియేటర్ నుంచి రావచ్చు. కాబట్టి ‘ఎఫ్-2’ మాదిరే ‘ఎఫ్-3’ సక్సెస్ క్రెడిట్లో మేజర్ షేర్ వెంకీకే చెందుతుంది.
నదుల అనుసంధానం….ఈ మాట టీడీపీ అధినేత నారా చంద్రబాబు నోటి వెంట కొన్ని వందల సార్లు విని ఉంటాం. ప్రాక్టికల్…
ఇటీవలే రాంగోపాల్ వర్మ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ AI వల్ల భవిష్యత్తులో సినిమా పరిశ్రమ మీద పడబోయే తీవ్ర ప్రభావం…
మరో ఏడాది తర్వాత తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ పాదయాత్రల సందడి మొదలుకానుంది. ఎన్నికలకు ముందు ప్రజల్లోకి వెళ్లేందుకు ప్రధాన పార్టీలు…
థియేటర్ రన్ పూర్తి చేసుకున్న పెద్ది ఇటీవలే ఓటిటిలో వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నార్త్ ఆడియన్స్ తో పాటు…
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి.. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ లేఖ రాశారు. ``షాబాద్ ఘటన దారుణం`` అని…
జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఉదార స్వభావం, దాతృత్వం గురించి జనసైనికులు, ఆయన అభిమానులు గొప్పగా…