టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్ కమింగ్ సినిమా ఎఫ్ ౩ మే 27న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం భారీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయా చానెల్స్ కి మంచి కంటెంట్ ఇస్తున్నాడు అనిల్. అందులో భాగంగా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా చెప్పుకున్నాడు.
ఎప్పకైనా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సోషియో ఫాంటసీ సినిమా చేయాలనుందని అది తన డ్రీం అని అన్నాడు. ‘మాయాబజార్’ లాంటి ఫ్యామిలీ సినిమా తీసి ఎమోషన్స్ తో మెప్పించాలనేది అనీల్ కున్న ఇంకో డ్రీం కూడా. దర్శకుడిగా చిరంజీవి ,బాలయ్య , వెంకటేష్ , నాగార్జున లతో సినిమాలు చేయాలనుకున్నాను. అందులో వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను.
ఇప్పుడు బాలయ్య గారితో చేయబోతున్నాను. ఇక చిరు , నాగ్ ఇద్దరే మిగిలారు. వాళ్ళని కూడా డైరెక్ట్ చేస్తే దర్శకుడిగా నా ఆశయం నెరవేరుతుందని చెప్తున్నాడు. మరి చిరు , నాగ్ అనీల్ కి ఎప్పుడు అవకాశం ఇస్తారో చూడాలి.
ఇక తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో మెప్పిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ బాలయ్యని తన సినిమాలో సరికొత్తగా, ఇప్పటి వరకూ ఎవరూ చూడని కోణంలో చూపిస్తానని ఘంటాపదంగా
ఎఫ్ ౩ ప్రమోషన్స్ లో బాలయ్య సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ చెప్పేసి ఇప్పటి నుండే బాలయ్య ఫ్యాన్స్ ని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్. మరి బాలయ్య ని అనిల్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో ఎలాంటి సినిమా రూపొందిస్తాడో చూడాలి.
This post was last modified on May 27, 2022 5:05 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…