టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి అప్ కమింగ్ సినిమా ఎఫ్ ౩ మే 27న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమాను ప్రమోట్ చేసుకోవడం కోసం భారీగా ఇంటర్వ్యూలు ఇస్తూ ఆయా చానెల్స్ కి మంచి కంటెంట్ ఇస్తున్నాడు అనిల్. అందులో భాగంగా తన డ్రీం ప్రాజెక్ట్ కూడా చెప్పుకున్నాడు.
ఎప్పకైనా ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ లాంటి సోషియో ఫాంటసీ సినిమా చేయాలనుందని అది తన డ్రీం అని అన్నాడు. ‘మాయాబజార్’ లాంటి ఫ్యామిలీ సినిమా తీసి ఎమోషన్స్ తో మెప్పించాలనేది అనీల్ కున్న ఇంకో డ్రీం కూడా. దర్శకుడిగా చిరంజీవి ,బాలయ్య , వెంకటేష్ , నాగార్జున లతో సినిమాలు చేయాలనుకున్నాను. అందులో వెంకటేష్ గారితో రెండు సినిమాలు చేశాను.
ఇప్పుడు బాలయ్య గారితో చేయబోతున్నాను. ఇక చిరు , నాగ్ ఇద్దరే మిగిలారు. వాళ్ళని కూడా డైరెక్ట్ చేస్తే దర్శకుడిగా నా ఆశయం నెరవేరుతుందని చెప్తున్నాడు. మరి చిరు , నాగ్ అనీల్ కి ఎప్పుడు అవకాశం ఇస్తారో చూడాలి.
ఇక తన మార్క్ ఎంటర్టైన్ మెంట్ తో మెప్పిస్తూ వరుస విజయాలు అందుకుంటున్న అనిల్ బాలయ్యని తన సినిమాలో సరికొత్తగా, ఇప్పటి వరకూ ఎవరూ చూడని కోణంలో చూపిస్తానని ఘంటాపదంగా
ఎఫ్ ౩ ప్రమోషన్స్ లో బాలయ్య సినిమాకు సంబంధించి కొన్ని అప్ డేట్స్ చెప్పేసి ఇప్పటి నుండే బాలయ్య ఫ్యాన్స్ ని దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నాడు అనిల్. మరి బాలయ్య ని అనిల్ ఎలా ప్రెజెంట్ చేస్తాడో ఎలాంటి సినిమా రూపొందిస్తాడో చూడాలి.
This post was last modified on May 27, 2022 5:05 pm
నిర్మాత దిల్ రాజు అన్నట్టు వందల సినిమాలు తీయకపోయినా కెవిఎన్ ప్రొడక్షన్స్ అనేది ఇప్పుడు అన్ని బాషల ఇండస్ట్రీలో హాట్…
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమా ‘కాాకా’ నుంచి ఇటీవల రిలీజ్ చేసిన టైటిల్ గ్లింప్స్ మెగా అభిమానులనే కాక సామాన్య…
కింగ్ సైజ్ ఫిలిం మేకర్ అని ఎవరికైనా బిరుదు ఇవ్వాల్సి వస్తే అందరి మదిలో మెదిలే ఒకే ఒక్క పేరు…
మాస్ రాజా రవితేజ నిఖార్సయిన హిట్టు కొట్టి నాలుగేళ్లయింది. ఈ నాలుగేళ్లలో ఆయన ఆరు చిత్రాలతో పలకరించాడు. వీటిలో కొన్ని…
ఏదైనా మితంగా తింటేనే అందం. మితిమీరిందా పొట్ట ఉబ్బిపోయి డాక్టర్ చుట్టూ తిరగాల్సి వస్తుంది. తిండి సామెత సినిమాలకు కూడా…
కరోనా తర్వాత థియేటర్స్ కి జనం మళ్ళీ వచ్చేలా చేసిన సినిమాల్లో జాంబీ రెడ్డి ఉంది. దర్శకుడు ప్రశాంత్ వర్మ…