ఇప్పుడంటే నటుడిగా, టెలివిజన్ హోస్ట్గా చాలా బిజీగా ఉన్నాడు కానీ.. ఒకప్పుడు మాత్రం నాగబాబు అంటే నిర్మాతగానే అందరికీ పరిచయం. తన తల్లి అంజనా దేవి పేరు మీద అంజనా ప్రొడక్షన్స్ బేనర్ పెట్టి రుద్రవీణ, త్రినేత్రుడు, ముగ్గురు మొనగాళ్లు, బావగారు బాగున్నారా, గుడుంబా శంకర్, స్టాలిన్, ఆరెంజ్ లాంటి భారీ చిత్రాలతను నిర్మించాడు నాగబాబు.
చిరంజీవితో చేసిన సినిమాల్లో కొన్ని మంచి ఫలితాన్నిచ్చాయి. కొన్ని దెబ్బ కొట్టాయి. అయినా నిలదొక్కుకున్నాడు కానీ.. రామ్ చరణ్ను పెట్టి పెద్ద బడ్జెట్లో తీసిన ఆరెంజ్ ఫలితం తిరగబడడంతో నాగబాబు కోలుకోలేకపోయాడు. ఆ దెబ్బకు అప్పుల పాలైపోయి.. సినిమాల నిర్మాణానికి దూరమైపోయాడు. మధ్యలో నాగబాబుకు సపోర్ట్ ఇవ్వడానికి అల్లు అర్జున్.. తన నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమాలో భాగస్వామిని చేశాడు కానీ.. అది కూడా ఆయన్ని తీవ్ర నిరాశకే గురి చేసింది.
అప్పట్నుంచి అసలే ప్రొడక్షన్ జోలికి వెళ్లట్లేదు నాగబాబు. చేతిలో వరుణ్ తేజ్ లాంటి మీడియం రేంజ్ హీరో ఉన్నా.. ఆయన నిర్మాతగా ప్రయత్నాలు చేయట్లేదు. కానీ తన తండ్రిని వరుణ్ మళ్లీ నిర్మాణంలోకి తీసుకొస్తున్నాడు. అది తన సినిమాతోనే కావడం విశేషం. శుక్రవారం ఎఫ్-3తో ప్రేక్షకులను పలకరించబోతున్న వరుణ్.. దీని తర్వాత ప్రవీణ్ సత్తారుతో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్న సంగతి తెలిసిందే. జులై నుంచి ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.
ఈ చిత్రాన్ని వరుణ్తో తొలి ప్రేమ తీసిన సీనియర్ ప్రొడ్యూసర్ బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. ఇందులో నాగబాబు కూడా భాగస్వామిగా మారబోతున్నాడు. ఈ విషయాన్ని వరుణే స్వయంగా వెల్లడించాడు. కొంచెం పెద్ద బడ్జెట్లో తెరకెక్కనున్న ఈ సినిమా 70 రోజుల పాటు యుఎస్లో చిత్రీకరణ జరుపుకోబోతోంది. మరి ఈ సినిమాతో అయినా నాగబాబు నిర్మాతగా మళ్లీ సక్సెస్ చూస్తాడేమో చూడాలి.
This post was last modified on May 27, 2022 8:08 am
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్పత్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…