అసలింకా షూటింగే మొదలు కానీ సినిమాల గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని ఆర్ఆర్ఆర్ విజయం కొంతే తీర్చిందని ఫీలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోలో హీరోగా తను చేయబోయే ప్రాజెక్టుల మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. కొరటాల శివ కన్నా ఎక్కువ వాళ్ళ ఫోకస్ ప్రశాంత్ నీల్ మీద ఉంది. కెజిఎఫ్, సలార్ తర్వాత చేయబోయేది తమ హీరోతోనే కాబట్టి ఎలివేషన్లు ఏ స్థాయిలో ఉంటాయోనని ఊహించుకుంటున్నారు.
ప్రభాస్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తారక్ తాలూకు పనులు కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా నెగటివ్ లీడ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే లోక నాయకుడు కమల్ హాసన్ ని సంప్రదించినట్టు ఫిలిం నగర్ టాక్. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కమల్ కు కొత్తేమి కాదు. అభయ్ లో చేసిన సైకో విలనిజం ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. కెరీర్ తొలిదశలో చేసిన ఎర్రగులాబీలు చరిత్రలో నిలిచిపోయే ఎవర్ గ్రీన్ పెర్ఫార్మన్స్. దశావతారంలోనూ చెలరేగిపోవడం గుర్తుందిగా.
సో కథ నచ్చాలే కానీ కమల్ హాసన్ ఇమేజ్ గట్రా పట్టించుకోరు. కాకపోతే పైన చెప్పిన ఉదాహరణలన్నీ ఆయన హీరోగా నటించినవి. మరి తారక్ మూవీలో అంటే ఒప్పుకుంటారా అనేది చూడాలి. అయినా ప్రశాంత్ నీల్ అంత గుడ్డిగా డిజైన్ చేయరు. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళను హర్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటారు. మరి ఇదెంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. జూన్ 3న విడుదల కాబోయే విక్రమ్ పనుల్లో బిజీగా ఉన్న కమల్ ఆ తర్వాత శంకర్ అందుబాటుని బట్టి ఇండియన్ 2 రీ స్టార్ట్ చేయాల్సి ఉంది.
This post was last modified on May 25, 2022 12:28 pm
రాజకీయాల్లో అవకాశాలు రావడమే అరుదు. వచ్చిన వాటిని వినియోగించుకోవాల్సిన అవసరం.. వాటిని పట్టుకుని ఎదగాల్సిన అవసరం కూడా పార్టీలకు, నాయకులకు…
తమిళనాడు కొత్త ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ కొత్త సినిమా జన నాయకుడు విడుదలకు మార్గం సుగమమయ్యింది. సిఎం పదవిని చేపట్టేందుకు…
పదమూడేళ్ల క్రితం ఇండస్ట్రీకి కొత్త ట్రెండ్ తీసుకొచ్చిన దృశ్యం ఫ్రాంచైజ్ లో మూడో భాగం మే 21 విడుదల కానుంది.…
తమిళనాడు రాజకీయాల్లో చోటు చేసుకున్న అనిశ్చిత పరిస్థితి తొలిగిపోయింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో అతి పెద్ద పార్టీగా అవతరించిన…
దేశ ప్రధాని నరేంద్ర మోడీ.. ఆదివారం హైదరాబాద్లో పర్యటించనున్నారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటారు. అయితే.. ఈ పర్యటనలో మరో…
‘కహోనా ప్యార్ హై’ చిత్రంతో హృతిక్ రోషన్ మాత్రమే కాదు.. ఆ చిత్ర కథానాయిక అమీషా పటేల్ సైతం ఓవర్…