Movie News

భీముడితో లోకనాయకుడు – నిజమేనా

అసలింకా షూటింగే మొదలు కానీ సినిమాల గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని ఆర్ఆర్ఆర్ విజయం కొంతే తీర్చిందని ఫీలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోలో హీరోగా తను చేయబోయే ప్రాజెక్టుల మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. కొరటాల శివ కన్నా ఎక్కువ వాళ్ళ ఫోకస్ ప్రశాంత్ నీల్ మీద ఉంది. కెజిఎఫ్, సలార్ తర్వాత చేయబోయేది తమ హీరోతోనే కాబట్టి ఎలివేషన్లు ఏ స్థాయిలో ఉంటాయోనని ఊహించుకుంటున్నారు.

ప్రభాస్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తారక్ తాలూకు పనులు కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా నెగటివ్ లీడ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే లోక నాయకుడు కమల్ హాసన్ ని సంప్రదించినట్టు ఫిలిం నగర్ టాక్. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కమల్ కు కొత్తేమి కాదు. అభయ్ లో చేసిన సైకో విలనిజం ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. కెరీర్ తొలిదశలో చేసిన ఎర్రగులాబీలు చరిత్రలో నిలిచిపోయే ఎవర్ గ్రీన్ పెర్ఫార్మన్స్. దశావతారంలోనూ చెలరేగిపోవడం గుర్తుందిగా.

సో కథ నచ్చాలే కానీ కమల్ హాసన్ ఇమేజ్ గట్రా పట్టించుకోరు. కాకపోతే పైన చెప్పిన ఉదాహరణలన్నీ ఆయన హీరోగా నటించినవి. మరి తారక్ మూవీలో అంటే ఒప్పుకుంటారా అనేది చూడాలి. అయినా ప్రశాంత్ నీల్ అంత గుడ్డిగా డిజైన్ చేయరు. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళను హర్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటారు. మరి ఇదెంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. జూన్ 3న విడుదల కాబోయే విక్రమ్ పనుల్లో బిజీగా ఉన్న కమల్ ఆ తర్వాత శంకర్ అందుబాటుని బట్టి ఇండియన్ 2 రీ స్టార్ట్ చేయాల్సి ఉంది.

This post was last modified on May 25, 2022 12:28 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

దానంకు స్పీకర్ క్లీన్ చిట్… కరెక్టేనా?

తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల కేసు వ్యవహారం ఆసక్తి రేపిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ కు 10…

59 minutes ago

మహేష్ అభిమానులకు హరీష్ సారి

సోషల్ మీడియాలో చాలా అలెర్ట్ గా ఉండాలి. ముఖ్యంగా సెలబ్రిటీలు బిజీగా షెడ్యూల్స్ లో ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా…

2 hours ago

కొత్త శుక్రవారం గంగార్పణం అవుతోంది

థియేటర్లకు సరైన సినిమాలు వస్తే రావడానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉన్నారు. ఎటొచ్చి వాళ్ళను కనీస స్థాయిలో మెప్పించే కంటెంట్ ఉన్నవి…

2 hours ago

టికెట్ ఇచ్చినా పట్టించుకోలేదా?

తెలంగాణలో రెండు రాజ్య‌స‌భ స్థానాల‌కు పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ అభ్య‌ర్థులు అభిషేక్ మ‌ను సింఘ్వీ, వేం న‌రేందర్ రెడ్డిలు..…

6 hours ago

ఏపీలో హోటల్స్… ఇబ్బంది లేనట్టేనా?

వంటగ్యాస్ కొరత కారణంగా దేశవ్యాప్తంగా చిన్న హోటళ్లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. హోటళ్లకు సరఫరా అయ్యే కమర్షియల్ సిలిండర్ల పంపిణీని…

8 hours ago

ఏపీలో స్పెషల్ ఆఫీసర్ల పాలన.. ఎక్కడంటే!

రాష్ట్రంలోని పలు మున్సిపల్ సంస్థల్లో పాలకవర్గాల గడువు ముగియడంతో అక్కడ స్పెషల్ ఆఫీసర్ల పాలన అమల్లోకి రానుంది. మున్సిపల్ కార్పొరేషన్లు,…

9 hours ago