అసలింకా షూటింగే మొదలు కానీ సినిమాల గురించి అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి పెరుగుతోంది. అరవింద సమేత వీర రాఘవ తర్వాత మూడేళ్ళ గ్యాప్ ని ఆర్ఆర్ఆర్ విజయం కొంతే తీర్చిందని ఫీలవుతున్న జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సోలో హీరోగా తను చేయబోయే ప్రాజెక్టుల మీద విపరీతమైన ఎగ్జైట్ మెంట్ తో ఉన్నారు. కొరటాల శివ కన్నా ఎక్కువ వాళ్ళ ఫోకస్ ప్రశాంత్ నీల్ మీద ఉంది. కెజిఎఫ్, సలార్ తర్వాత చేయబోయేది తమ హీరోతోనే కాబట్టి ఎలివేషన్లు ఏ స్థాయిలో ఉంటాయోనని ఊహించుకుంటున్నారు.
ప్రభాస్ తో బిజీగా ఉన్న ప్రశాంత్ నీల్ తారక్ తాలూకు పనులు కూడా చూసుకుంటున్నారు. ముఖ్యంగా నెగటివ్ లీడ్ కోసం తెగ ప్రయత్నిస్తున్నారట. అందులో భాగంగానే లోక నాయకుడు కమల్ హాసన్ ని సంప్రదించినట్టు ఫిలిం నగర్ టాక్. ఇలాంటి క్యారెక్టర్స్ చేయడం కమల్ కు కొత్తేమి కాదు. అభయ్ లో చేసిన సైకో విలనిజం ప్రేక్షకులు అంత సులభంగా మర్చిపోలేరు. కెరీర్ తొలిదశలో చేసిన ఎర్రగులాబీలు చరిత్రలో నిలిచిపోయే ఎవర్ గ్రీన్ పెర్ఫార్మన్స్. దశావతారంలోనూ చెలరేగిపోవడం గుర్తుందిగా.
సో కథ నచ్చాలే కానీ కమల్ హాసన్ ఇమేజ్ గట్రా పట్టించుకోరు. కాకపోతే పైన చెప్పిన ఉదాహరణలన్నీ ఆయన హీరోగా నటించినవి. మరి తారక్ మూవీలో అంటే ఒప్పుకుంటారా అనేది చూడాలి. అయినా ప్రశాంత్ నీల్ అంత గుడ్డిగా డిజైన్ చేయరు. ఫ్యాన్స్ ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళను హర్ట్ చేయకుండా ప్లాన్ చేసుకుంటారు. మరి ఇదెంతవరకు నిజమవుతుందో వేచి చూడాలి. జూన్ 3న విడుదల కాబోయే విక్రమ్ పనుల్లో బిజీగా ఉన్న కమల్ ఆ తర్వాత శంకర్ అందుబాటుని బట్టి ఇండియన్ 2 రీ స్టార్ట్ చేయాల్సి ఉంది.
This post was last modified on May 25, 2022 12:28 pm
రెండు రాష్ట్రాల మధ్య జల వివాదాలపై ఏపీ సీఎం చంద్రబాబు మరోసారి స్పందించారు. నీళ్లు వద్దు, గొడవలే కావాలని కొందరు…
సాధారణంగా ఏదైనా ఆర్డర్ ఇస్తే డెలివరీ బాయ్స్ వెంటనే ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. కానీ తమిళనాడులో జరిగిన ఒక ఘటన మాత్రం…
ఏపీ రాజధాని అమరావతిలో కీలక ప్రాజెక్టును తిరిగి పట్టాలెక్కించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో సుమారు రూ. 2…
సెన్సార్ చిక్కుల్లో పడి నానా యాతన పడ్డ సినిమాల్లో జన నాయకుడుకి మోక్షం దక్కలేదు కానీ పరాశక్తి సంకెళ్లు తెంచుకుంది.…
వైసీపీ అధినేత జగన్ మారుతాడేమో, ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందేమో అని కూటమి నాయకులు పలుసార్లు భావిస్తూ వచ్చారు. అందుకే…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. వైసీపీ పాలనతో రాష్ట్రం పూర్తిగా విధ్వంసమైందని అన్నారు.…